Monday, November 10, 2025

Lokabhiramam : నిప్పు చెప్పే సంగతులు

Lokabhiramam 
నిప్పు చెప్పే సంగతులు

నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ` ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.

***

చుట్ట వెలిగించడానికి చెన్నయ్య చెకుముకి రాయి కొట్టేవాడు. పొయ్యి వెలిగించడానికి పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది. అప్పుడు అగ్గిపెట్టె, కిరోసిన్‌ నూనె వచ్చి పద్ధతి మార్చాయి. అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది. ఓ సినిమాలో క్రూరుడయిన విలన్‌ ఎదుటివాడి బట్టబుర్ర మీద పుల్లగీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం చూచాను. అది తెలుగు సినిమా మాత్రం కాదు. అగ్గిపుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రతగలవి అని పేరు కూడా పెట్టారు. అగ్గిపెట్టల మీద సేఫ్టీ మ్యాచెస్‌ అని ఉంటుంది. కనీసం ఈసారయినా గమనించి చూడండి. అదీ మీకు అగ్గిపెట్టె దొరికితేనే. ఇక ఆ తర్వాత కరెంటు వచ్చి కాలాన్నే మార్చింది. ఇప్పుడు నిప్పు, పొగ, వేడి ఏదీ లేకుండానే మైక్రోవేవ్‌లో వంట జరుగుతోంది. మంటలేదుగానీ వంట మాత్రం అలాగే ఉంది. ఇంతకూ వంట, మంట ఎప్పుడు మొదలయ్యాయనేది అసలు ప్రశ్న.

తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు, పళ్ళు గానీ, వేటాడిన జంతువును గానీ పచ్చిగానే తినేవాడు. కాల్చి తినడం ఆ తర్వాత అలవాటయింది. చిన్నప్పుడొక కథ విన్నట్లు గుర్తు. తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఒకసారి అగ్ని ప్రమాదం జరిగిందట. మంట ఆరిన తర్వాత జంతువేమయిందో వెదుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు. చురుక్కుమంది. అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు. మాంసం రుచి మారింది. బాగుంది కూడా! అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారంటారు. ఇలాంటి కథలు, కథలుగా కూడా నిజాలుగా వినిపిస్తాయి. అప్పట్లో అంటే ఆది మానవుని కాలంలో ఏం జరిగిందీ అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారాలు లేవు కదా! కనుక కథకూ, సత్యానికి మధ్యన అంత తేడా లేదు.

పది లక్షల సంవత్సరాల క్రితం ‘హోమో ఎరెక్టస్‌’ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు, వెలుగుకు ఇతర అవస రాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం. రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవీ, కనిపించడం లేదంటారు మరి కొందరు పరిశోధకులు. అంటే, అప్పటికి ‘హోమో సాపియోన్స్‌’ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు. అంతకు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్సులో దొరికాయి. 4,65,000 సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిలా మండిన చోటు ఒకటి దొరికింది. లెక్కలో ఎంత తప్పు ఉన్నా 65 వేల సంవత్సరాలకన్నా అటూ, ఇటూ కావడానికి వీలులేదంటున్నారు పరిశోధకులు. అంటే నాలుగు లక్షల ఏళ్ళనాడే మనుషులు పొయ్యి పెట్టి వంట చేసుకు న్నారని భావం. ఆ కాలానికి నేడున్నలాంటి మానవజాతి ఆవిర్భవించలేదు. నిటారు మనుషుల కాలమే అది!

ఎలెక్ట్రాన్‌ స్పిన్‌ రెసొనాన్స్‌ అనే పద్ధతితో ఎక్కువ వేడయిన క్వార్ట్‌జ్‌ వయసు గుర్తించడం వీలవుతుంది. గులకరాళ్ళు, మట్టిలో ఈ క్వార్ట్‌జ్‌ ఉంటుంది. పొయ్యిలో నుంచి రాళ్ళను, మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ళ నాటివని తెలిసింది. మొదటి పరిశీలనలోని రాళ్ళు 3,80,000 సంవత్సరాల నాటివి. అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది. అందులోని రాళ్ళను పరిక్షిస్తే అవి 4,65,000 నాటివని తెలిసింది. అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకటి కాలం నిర్ణయించడానికి వాడుతున్న డేటింగ్‌ పద్ధతుల్లో పొరపాటు లేదని, రెండవది పరీక్షించిన రాళ్ళు నిజంగా ఒక ‘పొయ్యి’లోవని, ఏదో వేరు రకంగా గురయినవి కావని తేలాలి!

పరిశోధనలో ఎప్పటికీ పొర పాట్లే జరుగు తాయంటే అన్యాయం. అలాగని పొరపాటు జరగవు అనడానికి కూడా లేదు. ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది. ఇద్దరు గప్పాల రాయుళ్ళు ముచ్చటాడు తున్నారట. ‘‘మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే, ఆ లోతులో తీగలు దొరికనయి. అంటే వెనకట మనవారు టెలిఫోను వాడుకున్నారనే గదా అర్థం!’’ అన్నాడు మొదటి గప్పాలాయన. రెండవ ఆయన అందుకని ‘‘మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగా దొరకలేదు. అంటే అప్పట్లో వారు వైర్‌లెస్‌, సెల్‌ఫోన్‌ వాడుకున్నారనేగా అర్థం!’’ అన్నాడు. ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు. వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు! వేడెక్కిన రాళ్ళ వయసు నిర్థారించడానికి వాడే పద్ధతి గట్టిదే. అయితే అందులో అయిదు లక్షల కన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం. పరిశీలిస్తున్న ఈ రాళ్ళు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి. అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే. అందుకే పరిశోధకులు రాళ్ళను థర్మోల్యుమినిసెన్స్‌ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక సమస్య తీరుతుంది. సాధారణంగా ఏ విషయాన్నయినా అనుమానం లేకుండా నిర్ణయించా లంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం, పరిశోధనలోనే కాదు, మన బతుకుల్లోనూ అలవాటే. డాక్టర్‌లు తాము చెప్పింది కాక, మరో డాక్టర్‌కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే పద్ధతి ఉండనే ఉన్నది కదా!

ఇక రెండవ సమస్య, రాళ్ళు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా? లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురయినవా? అడవులు తగలబడడం మామూలే. అది కాకున్నా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు. ఇటువంటి మంటకు, మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం. అయితే ఫ్రాన్సు తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలా కాలం పాటు మండిన దాఖలాలున్నాయి. సహజంగా తగల బడిన వస్తువులేవీ ఇంతకాలం మండవు.

హోమో ఎరెక్టస్‌ కాలంలోనే మంటను, నిప్పును వాడుకున్నారనేది నిర్ణయమయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది. నిప్పు, చక్రం, వ్యవసాయం మానవజాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు. అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి. నిప్పు నియంత్రణ జీవితానికి గుర్తు. చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రగతికి ఆధారం. వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి, అన్నిటికీమించి ‘స్వంత’ భావానికి మొదలు. పంట స్వంతం. ఫలసాయం స్వంతం. అది తన వారికే అందాలి. అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నాలేకున్నా స్వంతం కానవసరం లేదు.

మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది. మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ఎందుకున్నారని ప్రశ్నిస్తే, జవాబులందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి!

aలక్‌ : నాన్న ఒక అనుభవం చెప్పేవాడు. కొత్తగా మంటినూనె వచ్చిన రోజులు. మంటినూనె అంటే నేల నుంచి తీసిన నూనె. అదేమిటో మీకు అర్థమయి ఉండదు. పెట్రోలును భూమిలోనుంచి తీస్తారు. మంచినూనెను నువ్వులు, ఫల్లీలు అనే వేరుశెనగలు లాంటి వృక్షసంబంధ పదార్థాలనుంచి తీస్తారు. అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ అంతే. ఎందుకోగానీ ఆముదాన్ని నూనె అనలేదు. అది వేరే కథగానీ, కెరొసీన్‌ తెచ్చుకొని మా ఊళ్లో ఒకతను ఆముదం దీపం పద్ధతిలో మట్టి మూకుడులో పోసి వత్తి వేసి వెలిగించాడట. వత్తి ఒకటే కాదు, మొత్తం దీపమంతా వెలగడం మొదల యింది. గ్యాసు నూనె బుడ్డీ దీపాలు వాడిన వాండ్లకు ఈ సంగతి తెలుస్తుంది. పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసె అంటుకున్నది. తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు. ఇంట్లోని డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటిముందు నాట్యం చేశాడట. నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు.


Friday, November 7, 2025

M Balamuralikrishna with Annavarapu and Dandamudi

M Balamuralikrishna 

with Annavarapu and  Dandamudi

Excerpts from an invited audience concert.

00:00 Vande mataram - Ranjani
06:39 Nanupalimpa - Mohanam
45:50 Ganalola nee leela - Ragamalika
52:58 Paluke Bangaramayena - Anandabhairavi

Lalgudi Jayaraman Violin 1974

Lalgudi Jayaraman   Violin   1974


Sheer listening pleasure!

Thursday, November 6, 2025

Wednesday, November 5, 2025

Manishi : My Telugu version of Vaikkom Mohammaed Bashir Story


Manishi

 Vaikkom Mohammaed Bashir Story

Mysore T Chowdaiah Violin 4 songs and Two Kritis ( 2 Videos)

Mysore T Chowdaiah - Violin 

Mysore Veerabharaiah - Mridangam
K S Manjunath - Ghatam


00:00 Varnam - Kapi
04:11 Prasanna Ganapati - Bahudari
07:27 Makelara Vicharamu - ravichandrika
13:29 Katyayani - Kalyani


00:00 Kaddanuvariki - Todi - Tyagaraja
15:02 Entarani - Harikambhoji - Tyagaraja






Tuesday, November 4, 2025

Loka 14 Katha cheputanu Ookodatava (కథ చెపుతాను ఊ కొడతావా?

Katha cheputanu Ookodatava
(కథ చెపుతాను ఊ కొడతావా?)


వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. ` ఎవరన్నారో తెలియదు.

---

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకులకథ, బయిండ్లకథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనేలేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చెప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది.  హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. కథకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.
మా ఇంట్లో బుడ్డన్న పనిచేసే వాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజుకూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాల పాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచు కునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడిరచడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా చంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపే వాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించే వాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.
నేను కథలు రాయకూడదని నిర్ణయించుకున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్‌ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాతతీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంత మంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి. కథ అంటేనే చెప్పబడినది అని అర్థం కదా! 
కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్‌ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసర మయిన మాటలుగానీ, చెప్పిందే మళ్లీ చెప్పడం గానీ ఉండదు. మొదట్లో ఆయన పద్ధతి గొప్పగా ఉందని అనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకు పోయిన పద్ధతేమో అని అనిపించ సాగింది. ఇక మరికొందరు ఉప న్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నా ననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసుకెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉంది గానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూనే ఉంటాయి.
ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నానుగానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడం లోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్నమాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెరమీద లాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్య నారాయణగారిలా అందరూ రచనలు చేసి ఉండక పోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించింది అంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్‌ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్యవరకు నేను కూడా అదే పద్ధతి. అయినాసరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తా పత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించ కూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.
రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ బాగా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలు పెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించే వాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి. అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
aలక్‌ : చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.



Voleti Venkateswarlu Vocal Bhairavi, Shankrabharanam and 2 more

Voleti Venkateswarlu - Vocal

00:00 Bagayenayya - Chandrajyoti
10:50 Sari Evvare - Bhairavi - Spencer Venugopal
33:08 Sundareswaruni - Shankarabharanam
01:08:04 Khelati Pindande - Sindhubhairavi



Monday, November 3, 2025

N Vijayasiva Paridanamichite in Bilahari Patnam Kriti

N Vijayasiva 

Paridanamichite in Bilahari 

Patnam Kriti


N Vijayasiva - Vocal
R K Sriram Kumar - Violin
J Vaidyanathan - Mridangam
S Govindarajan - Ghatam


Paridanamicchite in Bilahari

Patnam Subramanya Iyer's famous composition


paridAnamiccitE pAlintuvEmO
(paridAna)

parama puruSa shrIpati nApai nIku
karuNa galgaga kAraNamEmemayyA
(paridAna)

rokkamicchutakunE mukkaNTi celikAnu
cakkani celiniyosaga janaka rAjunugAnu
mikkili sainya mivva markaTEndruDugAnu
AggadigameDu galgu Adi venkaTEshA nIku
(paridAna)

Monday, October 27, 2025

Sunday, October 26, 2025

లోకాభిరామం : విశ్వనాథ ప్రభావం My article in Telugu

లోకాభిరామం

విశ్వనాథ ప్రభావం

కోపమున కొకరు లక్ష్యముగా నుండుట సహజము. అట్టి వారి యందు మంచితనముగా కోపము ప్రదర్శించుట బాగుండును, తిట్టవచ్చును. కానీ యాకశ్మలమును మనసు నందుంచుకొని, నిరంతరము అనుమా నించుటయు, అవమానించుటయు మాత్రము మాన్యముగాదు. ఇతరుల ముందు విమర్శించుట కన్న నీచ లక్షణము మరొకటి లేదు. చేతనయిన ఎదురుగనే యనదలుచుకున్నదేదో యనవలెను. తెగులెక్కువయినచో అరవవచ్చును గూడ! అంతేగాని, మనసును గుళ్లుకొనుచు, పోయినంత గాలము, ఆ విషయమునే మననము జేసుకొనుట స్వీయారోగ్యమునేగాక వాతావరణము నంతటిని నాశనము జేయును. కోపము రావలెను. వచ్చినంత వేగముగ మాయము గావలెను. ఉత్తముల కోపము క్షణభంగురమను మాట యున్నది గదా!

ఈ వాక్యాలు 2000 సంవత్సరం జులై పదకొండునాడు నేను డయరీలో రాసుకున్నానంటే నమ్మగలరా? విషయం గురించి కాదు గానీ, మాట తీరును గమనిస్తే గ్రాంథికం మీద నాకున్న ప్రేమ కనబడుతుందనుకుంటాను.

విశ్వనాథ: కొందరు మహానుభావులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారంటారు. అక్షరాలకు ఉండగల అసలు బలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్న కాలంలోనే, విశ్వనాథ సత్యనారాయణ గారి మాట తీరు మొహంలో పిడిగుద్దులాగ వచ్చి తగిలింది. బి.ఎస్సీలో ఉండగానే రామాయణ కల్పవృక్షం ఆసాంతం చదివాను.

అర్థమయిందా అని మీరు అడగవచ్చు. నేను అర్థమవుతుందని చదవలేదు. అదేమిటో చూద్దామని చదివాను. అదే ఊపులో ఆయన నవలలు చదివాను. నన్నయ ‘ప్రసన్న కథా కవితార్థ యుక్తి’ వంటి విమర్శ గ్రంథాలూ చదివాను. పశువుల కాపరి చిత్రములు (కౌబాయ్‌ మూవీస్‌) గురించి ఆయన రాసిన సంగతులు చదివాను. ఒక మనిషిలో ఇంతటి వైవిధ్యం, అందులోనూ అనుకోనంత లోతులు ఉండడం, ఆశ్చర్యం (ఈ మాట సరిపోదు, దాని అమ్మమ్మ లాంటి ఒక మాట ఉంటే బాగుండును!) ఆలోచన నన్ను వెర్రివాడిని చేశాయి. ‘ఇందొకటి యున్నది ఒకటి యనగా రెండు’ అంటారు విశ్వనాథ! అందరూ ఆయనను ఛాదస్తం అని కొట్టిపడేయడం చూచాను. అది సులభమే, కానీ, ఆ లోతులను అందుకోవడానికి బోలెడంత శ్రమ పడాలి. నేనందులోనే ఉన్నాను’ అన్నాను నన్నాక్షేపించిన మిత్రులతో!

నవలలు: ఈ అక్షరాలు రాసేందుకు కూచుంటే, చొక్కాపు వెంకటరమణ ఫోన్‌ చేశారు. ఆయనను కొన్ని క్షణాల క్రితమే గుర్తు చేసుకున్నానని చెప్పాను. రమణగారు విజయవాడలో ఒక పత్రికలో ఉప సంపాదకులుగా ఉన్నారు. ఆ పత్రికలో విశ్వనాథ వారి నవల ఒకటి ధారావాహికగ వస్తున్నది. ఆయనేం రాసి పంపిస్తారేమన్నానా! రమణగారు వెళ్లి డిక్టేషన్‌ తీసుకుని వచ్చి కంపోజ్‌ చేయించే వారట. ఈయన వెళ్లి అరుగు మీద కూచుంటారు. ఆయన లోపల నుంచి వచ్చావా అంటారు. రాసుకో అని అక్కడ నుంచే వాక్యాలు చెపుతూ బయటకు వస్తారు. పోయిన వారం కథ ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ ఆగిందని చెప్పవలసిన అవసరమే లేదు!

పుస్తకం డాట్‌కామ్‌లో ఒక అక్కయ్యగారు విశ్వనాథ వారి గురించి రాసే ప్రయత్నం చేశారు. నవలల గురించి నాలుగు మాటలు రాశారు. విశ్వనాథ వారి సాహిత్య సృష్టి సముద్రం వంటిది. అందులో నవల ఒక భాగం మాత్రమే. అది హిమాలయ పర్వత శ్రేణికన్నా విస్తృతం! ఒక్కో వరుస నవలలను చదివితే ఒక ఆలోచనాక్రమం బయటపడుతుంది. కొండ, సముద్రం కలగలిసి విరోధాభాసమా?

చరిత్ర నవలలు: కాశ్మీర, నేపాళ రాజవంశాల గురించిన నవలలు ఎంత నవలలో అంతగానూ చరిత్ర పుస్తకాలు. ఇక పురాణ వైర గ్రంథమాల గురించి చెప్పనవసరమే లేదు. భారతదేశ చరిత్రను పడమటి వారు తమకు అనుకూలంగా రాయించారన్నది విశ్వనాథ వారి వాదం. అసలు చరిత్రను ఆయన చరిత్రగా కాక, నవలలుగా రాయడంతో చిక్కు వచ్చి పడిరది. చాలామందే చదివారు గానీ, వాటి మీద జరగవలసినంత చర్చ జరగలేదు. విశ్వనాథ వారు సమకాలీన రాజకీయం మీద చెణుకులుగా, వ్యాఖ్యలుగా రాసిన నవలలు ఎంతమందికి తలకెక్కి నయని నాకొక అనుమానం. పులుల సత్యాగ్రహం, నందిగ్రామ రాజ్యం, ప్రళయనాయుడు లాంటివన్నీ చిన్నచిన్న నవలలు. కానీ వాటిలో వ్యాఖ్యలు ఎంతో బలమయినవి.

పులిమ్రుగ్గు’ అని ఒక నవల. ఇది ఫాంటసీ అనే తరహా కిందికి వస్తుంది. ఇందులో ఒక మనిషి పులిగా మారుతుంటాడు. ఆ కథను కూడా తమదయిన శైలిలో చెప్పడం వల్ల మామూలు నవలలు చదివేవారికి, అది తలకెక్కలేదు. విశ్వనాథ వారి చిన్న కుమారుడు పావని (శాస్త్రి), నాకు మంచి మిత్రుడు. ఆయన ఈ నవలను ఒకప్పుడు మామూలు భాషలో రాసి ఒక వారపత్రికలో అచ్చేయించాడు. అయినా శంఖం మోగలేదు. దూరదర్శన్‌లో సీరియల్‌గా తీయడానికి పులిముగ్గు ఎంపికయింది అని సంతోషంగా చెప్పాడు ఒక రోజున. బోలెడు గ్రాఫిక్స్‌, గందరగోళం అవసరమవుతాయి. తెలుగు టీవీ ఇంకా అంత ఎత్తుకు చేరలేదు. ఏమనుకోకండి, మీ ఆశయం నెరవేరదు అన్నాను. అన్నంతా అయింది. ‘పోనీ, మనం వేరే ప్రయత్నం చేద్దాం, ఏ నవలయితే బాగుంటుంది, చెప్పండి’ అని మరో రోజు అడిగాడాయన. ఒక నవల  పేరు వెంటనే చెప్పాను. రాజకీయం, కుట్రలు, గూఢచారులు మొదలయిన మసాలా ఇంతకన్నా బలంగా ఉన్న నవల నాకు తెలిసి, మరోటి లేదు. ‘భలే! మీరు నాన్నగారి రచనలను మరీ లోతుగా పరిశీలించారండీ!’ అని మురిసిపోయాడు. పాపం, పావని. ‘సాహిత్యం - సైన్సు’ సంబంధాల గురించి నేను ఏదో పత్రికలో ఒక వ్యాసం రాశాను. అందులో విశ్వనాథ నవలలోని కొన్ని అంశాలను ఉదాహరిం చాను. ఆయన ఒకానొక నవలలో, బహుశా ‘దమయంతీ స్వయంవరం’ అనుకుంటాను, నీటి పారుదల, ఆనకట్టల గురించి ఒక చోట రాసిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నది కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే మైదాన ప్రాంతానికి నీరు అందించడం గురించి ఆయన వివరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. అదే సంగతి నా వ్యాసంలో రాశాను. పావనితో ఆ తరువాత ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు అతను గతంలోకి వెళ్లిపోయి, తండ్రిగారు, నీటిపారుదల నిపుణులు, మిత్రులు కె.ఎల్‌.రావు గారితో జరిపిన చర్చల గురించి చెప్పసాగాడు. ఆ తరువాత మరొకసారి తిరుమలలో కలిసి, ‘విజయవాడలో వరుసగా లెక్చర్లు ఏర్పాటు చేశాము. ఒక నెల మీరూ మాట్లాడాలి’ అన్నాడు. కానీ, పాపం తానే మిగల్లేదు! నాకు విశ్వనాథ వంటి మహామహుని గురించి మాట్లాడే అవకాశం మిగలలేదు.

పుస్తకాల వేట: నేను బిఎస్సీలో ఉండగా ఒక రెడ్డిగారు సైకిలు మీద వచ్చి మా ఇంట్లో పాలు పోస్తూ ఉండేవారు. నా చేతుల్లో తరచు పుస్తకాలు గమనించి నాతో మాట కలిపాడాయన. ఆయన సాహిత్యాభిమాని. విశ్వనాథ వారికి వీరాభిమాని. నేను చదవని రెండు మూడు నవలలు ఆయన తేవడం, నేను చదవడం గుర్తుంది. తెరచిరాజు, చెలియలికట్ట ఆ వరుసలోనే చదివాను. స్త్రీ పురుష సంబంధాల గురించి ఆ నవలలో ఆయన చిత్రించిన సంగతులు కలవరపరిచేంత బలంగా ఉంటాయి. తెరచిరాజు చదివి నేను విహ్వలుడనయి ఏడ్చాను. వారం రోజులు తిండి మరిచి ఆలోచించాను. అట్లాంటి పుస్తకాలను వెదికయినా సరే తెచ్చి చదవాలి.

విశ్వనాథ వారికి ఉన్నచోటే పుస్తకం రాయడం, అక్కడే అచ్చేయించడం అలవాటు. కరీంనగర్‌లో ఉండగా ‘మ్రోయు తుమ్మెద’ ‘సముద్రపు దిబ్బ’ నవలలను అక్కడి చింతల నరసింహులు అండ్‌ సన్స్‌ అనే సంస్థ వారు అచ్చు వేశారు. వారు పుస్తకా లను అమ్మే ప్రయత్నం మాత్రం అంతగా చేసినట్లు లేదు. వెతకగా వెతకగా వాళ్ల స్టేషనరీ పుస్తకాల దుకాణం హనుమకొండలో ఉందని తెలిసింది. పనిగట్టుకుని అక్కడికి వెళ్లి అడిగాను. విన్న పెద్ద మనిషి ముందు ఆశ్చర్యంగా, నావేపు చూచాడు. ‘ఉన్నయి’ అని లోపలి నుంచి రెండు పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు.

మ్రోయు తుమ్మెద’ ప్రపంచమంతా అన్ని భాషలలోనూ చదవవలసిన నవల. దాని గురించి చెప్పుకోడానికి చాలా ఉంది. సంగీతము, నాదోపాసన, కరీంనగర్‌లోని ఒక సంగీత కారుడు అందులోని విషయం.

అంత వెతికి తెచ్చుకున్న నా పుస్తకాన్ని ఎవరో తీసుకుపోయారు. తిరిగి ఇవ్వలేదు. ఈ మాట చెపితే పుస్తక మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తి నాకు, ఒక జిరాక్స్‌ ప్రతి చేసి ఇచ్చారు.

భ్రమరవాసిని నాకు షామీర్‌పేట దగ్గర ఒకానొక చీకటి రాత్రిలో కనిపించిందని చెపితే విశ్వనాథ ప్రభావము గురించి ఇక ముందుకు చెప్పవలసిన అవసరం ఉండదేమో. నా దృష్టిలో ఆయన ఒక మనిషి కాదు. అటువంటివారు చాలా అరుదుగా మనుషుల మధ్యన కనిపించి మాయమవుతారు.



Nedunuri Krishnamurthy : Husseini and Navroz

Nedunuri Krishnamurthy

Husseini and Navroz

Friday, October 24, 2025

Madurai Mani Iyer Nagumomu in Abheri Tyagaraja

Madurai Mani Iyer   

Nagumomu in Abheri   

Tyagaraja kriti


Birthday tribute to one and only MMI or Madurai Mani Iyer!

Madurai Mani Iyer with Tyagaraja's master piece.
in his inimitable own style!

nagu mOmu kana lEni nA jAli telisi
nannu 1brOva rAdA SrI raghuvara nI (nagu)

naga rAja dhara nIdu parivArul(e)lla
ogi bOdhana jEsE vAralu kArE(y)aTul(u)NDudurE nI (nagu)

khaga rAju nI(y)Anati vini vEga cana lEDO
gaganAnik(i)laku bahu dUrambaninADO
jagamElE paramAtma evaritO moraliDudu
vaga jUpaku tALanu nann(E)lukOrA tyAgarAja nuta nI (nagu)


సగం రోజు నాగీబ్ మహఫూజ్ కథకు తెలుగు అనువాదం Naguib Mahafouz story in Telugu

సగం రోజు   

నాగీబ్ మహఫూజ్ 

కథకు తెలుగు అనువాదం

Read my article published in Sakshi daily long back
https://www.sakshi.com/news/family/kb-gopal-explains-about-egyptian-great-writter-naguib-mahfouz-1273859

O S Tyagarajan : Deva Jagannatha in Kalyanavasantam

O S Tyagarajan

Deva Jagannatha in  

Kalyanavasantam

 
A really short and sweet Gopalakrishna Bharati song!

Thursday, October 23, 2025

Sudha Raghunathan Srichakraraja in Sivashakti

Sudha Raghunathan   

Srichakraraja in Sivashakti

G N Balasubramaniam composition


Wednesday, October 22, 2025

Tuesday, October 21, 2025

Voleti Venkateswarlu : Sankalpamettido - Kharaharapriya - Patnam Com...

Voleti Venkateswarlu

Sankalpamettido  -  Kharaharapriya

Patnam Composition

Voleti Venkateswarlu : Vandeham jagadvallabham - Hamsadhvani - And Neevada - Saranga

Voleti Venkateswarlu 

Vandeham jagadvallabham  -  Hamsadhvani

Annamacharya composition



Neevada Ne gana - Saranga

Tyagarajaswamy composition


Monday, October 20, 2025

M D Ramanathan Diksitar kritis in Eesamanohari Gaula and Anandabhairavi

In Tribute to great

Muttuswami Dikshitar!

M D Ramanathan   

Diksitar kritis in 

Eesamanohari, Gaula and Anandabhairavi

Saturday, October 18, 2025

Friday, October 17, 2025

Mulla Nasruddin Story 2 Patadi ముల్లా నస్రుద్దీన్ కథ - పాతది

ముల్లా నస్రుద్దీన్ కథ

పాతది (Name of the Story)

T N Seshagopalan Ennadu nee kripa Vachaspati Patnam

T N Seshagopalan   

Ennadu nee kripa   in Vachaspati   

Patnam Subramanya Iyer Kriti

Thursday, October 16, 2025

లోకాభిరామం సన్నాయి నొక్కులు (Sannayi Nokkulu) Telugu Column Article ...

లోకాభిరామం   

సన్నాయి నొక్కులు 

సన్నాయి అనే నాదస్వరం గురించి నా వ్యాసం


G N Balasubramanyam Ragam Tanam : Reetigaula - Pallavi Missing

G N Balasubramanyam  

Ragam Tanam   Reetigaula   

- Pallavi Missing

Wednesday, October 15, 2025

Tuesday, October 14, 2025

G N Balasubramanyam - Vinayaka - Hamsadhwani VeenaKuppiayar and Sukhi ...

G N Balasubramanyam

Vinayaka -  Hamsadhwani VeenaKuppiayar 
and Sukhi Evvaro - Kanada - Tyagaraja

Monday, October 13, 2025

Sunday, October 12, 2025

Friday, October 10, 2025

A K C Natarajan Clarinet Sharavanabhava in ragam Shanmukhapriya

A K C Natarajan   Clarinet   

Sharavanabhava in ragam Shanmukhapriya


Clarinet or clarionet is not an Indian instrument. Natarajan is originally a graded vocalist. He learnt Nadaswaram, but i think never played any concerts.
Natarajan adapted clarinet to suit carnatic style of playing and mastered it.
He was given may awards and rewards. He bever worried about them and continued palying the instrument with all the love to it.
It is not out of place if I tell that I on behalf of All India Radio invited him to Hyderabad arranged a concert in Tyagaraja Ganasabha. I remember Kamalakara rao playd mridangam that day.
I was in Tirumala for covering brahmotsavams and that year Natarajan was there palying clarinet on invitation from TTD. We were together all through teh feast.


Listen to him paly Shanmukhapriya ragam and a wonderful kriti in it!

లోకాభిరామం కవిత్వతత్వవిచారం Lokabhiramam Kavitvatatvavicharam

లోకాభిరామం

కవిత్వ తత్వ విచారం


My artice 

Kavitva Tatva Vicharam

In Telugu, 
దయచేసి ఓపికగా వినండి.
పది నిమిషాలు మాత్రమే.

Wednesday, October 8, 2025

Ramnad Krishnan - Vocal Concert Part 3 - Bale Balendu - Reetigaula and Abhimanamennadu Vi...

Ramnad Krishnan - Vocal

Concert Part 3

Bale Balendu - Reetigaula and Abhimanamennadu Vivardhini

Ramnad Krishnan Radio in Parts 1 & 2


Ramnad Krishnan 

Part 1

Varnam (Kanada) , Tyagarajapalaya (Gaula ) Sarievvare (Shahana)



Part 2


Nee_Padamule - Bhairavi





Monday, October 6, 2025

D K Jayaraman - Vocal : Two Videos


D K Jayaraman   - Vocal 

Nannu vidachi and 2 Tamil songs




00:00 Kamakshi Gauri - Saveri
14:00 Ranganayakam



Saturday, October 4, 2025

T R Mahalingam Flute Ragam Tanam Pallavi in Kambhoji

T R Mahalingam - Flute   

Ragam Tanam Pallavi in 

Kambhoji

There was a mistake in my earlier upload of this track. Here it is afresh!

Thursday, October 2, 2025

One Grain Ant A little piece in three languages!


One Grain Ant


A piece in three languages!

Here it and tell me what you think of it and also me!

Lokabhiramam 10 Science Ratalamanikalu - సైన్స్ రాతలమానికాలు - లోకాభిరామం

లోకాభిరామం

సైన్స్ రాతలమానికాలు 


M Balamuralikrishna Samukhana and Maravairiramani

M Balamuralikrishna 

  


Samukhana and Maravairiramani


LGJ, TKMurthy and Alangudi make the team!