Tuesday, December 21, 2010

Lalgudi Jayaraman - Violin

Shravanam - Violin

Sri Lalgudi G Jayaraman - Giripai - Shahana



Let us enjoy great music!
@@@@@

Monday, December 20, 2010

Medha 06-12-2010

Here is the content of the Medha page published on 6th December 2010

చక్కెర - కొన్ని సంగతులు.
December 6th, 2010


భారతదేశంలో రెండువేల సంవత్సరాల క్రితం నుంచే చెరుకు నుంచి చక్కెర తయారు చేశారు. అలెగ్జాండరుతో బాటు వచ్చిన వారు తేనెటీగలు లేని తెనెను చూచి ఆశ్చర్యపోయార్ట.


బీట్‌రూట్‌లో కూడా చెరుకులో ఉన్నలాంటి చక్కెర ఉంటుందని 1747లో జెర్మన్ రసాయనశాస్తవ్రేత్త ఆండియస్ మార్‌గ్రఫ్ కనుకొన్నాడు.


చక్కెరకు బదులుగా సకారిన్, ఆహ్పార్లేమ్ అనే రసాయనాలను వాడుతున్నారు. కానీ వాటిని అలా వాడాలని మాత్రం ఎవరూ పరిశోధించి తయారు చేయలేదు. మరేదో పరిశోధన చేస్తున్న వారు వాటిని తిని చూడడం, రుచి బాగుండడంతో అవి వాడకంలోకి వచ్చాయి.


లుగ్డునేమ్ అనే ఒక రసాయనం అన్నింటికన్నా తీయనిదని గమనించారు. మామూలు చక్కెర కన్నా అది రెండు లక్షల రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది!


చక్కెరలన్నీ కార్బన్, హైడ్రోజెన్, ఆక్సిజన్‌ల కలయికతో తయారవుతాయి. ఈ మూడు మామూలుగా అంతటా ఉండే రసాయనాలు. వాటికి తీపి ఉండనే ఉండదు.


అమెరికాలో ఒక్కొక్కరు ఏటా సగటున 61 పౌండ్ల చక్కెర తింటారట. అందులో సుమారు సగం ‘కాండీ’ రూపంలో తింటారు.


చక్కెర ఎక్కువగా తింటే ముఖంమీద ముడతలు త్వరగా పడతాయి.



ఏరోసోల్ కాలుష్యం.
December 6th, 2010

ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మీది గాలులలో ఏరోసోల్ కాలుష్యం మరీ ఎక్కువయిందని పరిశోధకులు గుర్తించారు. అందులో కొంత పరిశ్రమలు, వ్యవసాయాల కారణంగా వస్తున్నది. మిగతాది ప్రకృతి నుంచి వస్తుంది. ఏరోసోల్ కాలుష్యం మోతాదు, ఆ కణాల సైజు, అవి వచ్చే తీరు మొదలయిన అంశాలు రుతువులను బట్టి మారుతున్నట్లు ఈ సంవత్సరం జరిగిన పరిశోధనల్లో తెలిసింది. ఏరోసోల్స్ అంటే సూక్ష్మమయిన దుమ్ము, ద్రవం కణాలు. అవి అగ్నిపర్వతాలు, ఇసుక, తుఫానులు, ఉప్పు, సముద్రంలోని తుంపరులు మొదలయిన కారణాల వల్ల గాలిలో చేరుకుంటాయి. ఏరోసోల్స్‌లో 90 శాతం వరకు ఈ రకంగా ప్రకృతి నుండి వచ్చేవే. అవన్నీ పెద్ద కణాలుగా ఉంటాయి. మిగతా ఏరోసోల్స్ మనిషి చేస్తున్న పనులవల్ల వస్తాయి. సల్ఫేట్స్, నల్లని బ్రౌన్ రకాల కార్బన్, శిలాజ ఇంధనాలయిన పెట్రోల్, డీజెల్ వాడకంవల్ల వచ్చేవి, చివరగా వ్యవసాయం కారణంగా గాలిలో చేరేవి, ఈ రకం కిందికి లెక్కలోకి వస్తాయి. మనుషుల వల్ల పుట్టే ఈ రకం ఏరోసోల్ కణాలు చిన్నవిగా ఉంటాయి. వాటివల్ల మన ఊపిరితిత్తులకు ఎంతో హానీ కలుగుతుంది. ఇలినాయిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సాజ్ఞిక్ డే, లారీ ఉగిరొలామో కలిసి తొమ్మిది సంవత్సరాలు ఏరోసోల్ సమాచారాన్ని సేకరించి, పరిశీలించారు. సీజన్, ప్రదేశాల ప్రకారం వాటి మార్పులను లెక్క వేశారు. జ్హ్జీ వారు నిర్ణయించిన మోతాదుకన్నా భారతదేశం మీద ఈ కాలుష్యం బాగా ఎక్కువగా ఉందని తెలిసింది. అది పరిమితకన్నా రెండు నుంచి అయిదు రెట్లు ఎక్కువ ఉంటున్నది. వర్షకాలానికి ముందు సముద్రం మీద నుంచి గాలులు భూమి మీదకు వస్తాయి. అప్పుడు ఆఫ్రికా, అరేబియన్ ద్వీపకల్పం దుమ్ము ఇక్కడికి చేరుతుంది. వర్షాలకు ముందు కాలుష్యం మరీ ఎక్కువవుతుంది. ఇందులో దుమ్ముతో బాటు, మనిషి కారణంగా వచ్చే కాలుష్యం కూడా భారీగా ఉంటుంది. వర్షాలతో ఈ దుమ్ము, మనికిందకు వచ్చేస్తాయి. అప్పుడిక మనిషివల్ల జరిగే కాలుష్యం ప్రభావం మరింత ఎక్కువవుతుంది. చలికాలంలో సముద్రం మీదకు వీచే గాలుల కారణంగా కాలుష్యం, దేశంమీద అన్ని భాగాలకు పరుచుకుంటుంది. నాసావారి టెర్రా అనే అంతరిక్ష నౌకలోని కెమెరాల సాయంతో సమాచారం సేకరించి చిత్రాలుగా తయారు చేశారు. ఎరుపురంగుగల చిత్రంలో ఏరోసోల్ పరుచుకునే మందం కనబడుతుంది. మరో చిత్రంలో ఆ కాలుష్యం, ప్రకృతి నుంచి, మనిషి కారణంగా వచ్చే తీరు కనబడుతుంది. కాలుష్యం గురించి కనీసం తెలిసి ఉంటే, జాగ్రత్తల సంగతి తర్వాత వస్తుంది.


నీటి దశలు....December 6th, 2010



సహజంగా ఓకేసారి ఘన, ద్రవ, వాయు రూపాలలో కనిపించేది నీరు ఒకటే. ఈ స్థితుల వేడిమి, ఒత్తిడిలులో
తేడా కూడా తక్కువే. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ (యు.ఎస్)లోని ఈ దృశ్యం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు!

నవ సయిన్స్!.
December 6th, 2010

అది కాలాపానీ లాంటి అధ్వాన్నమయిన జైలు. అందులోని ఒక సెల్‌లో ఒక ముసలాయన ఉన్నాడు. అదే సెల్‌లోకి మరొక కుర్రవాడిని కూడా తెచ్చి తోశారు. కుర్రవాడు అస్తమానమూ తప్పించుకోవడం గురించి ఆలోచిస్తుంటాడు. రకరకాల ప్లానులు చెపుతుంటాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజున అతను తప్పించుకు పారిపోయాడు. ఒక వారం రోజులయింది. పోలీసులు అతడిని మళ్లీ లాక్కుతెచ్చి అదే సెల్‌లో తోశారు.


అతను సగం చచ్చి ఉన్నాడు. ఆకలి దప్పితో నకనక లాడుతున్నాడు. తన ప్రయత్నం ఎంత నిరర్దకంగా ఉందని పెద్దాయనకు వివరించసాగాడతను. దారి దొరకలేదని, ప్రాణం మీదకు వచ్చిందనీ ఏవేవో చెప్పాడు. పెద్దాయన అంతా విని ‘నాకు తెలుసు!’ అన్నాడు. ‘ఎలాగంటావా? నీవు వేసిన పథకాలను 20 ఏళ్ళ క్రితమే నేను ప్రయోగించి చూశానన్నాడు. ‘్ఛ! మరి నాకు చెప్పలేదు ఎందుకని?’ అన్నాడు కుర్రవాడు. ముసలతను భుజాలెగరేసి ‘నెగెటివ్ రిజల్ట్స్‌ను ఎవరూ పట్టించుకోరుగద!’ అన్నాడు. (జోకును వివరించడం కన్నా జోకు మరోటి ఉండదు. సైన్సులో ప్రయోగాలు చేసి ఫలితాలను ప్రత్యేక పత్రికలలో ప్రచురించడం పరిశోధకులకు అలవాటు. అలాంటి పత్రికలలో మామూలుగా ‘పని చేయని ప్రయోగాలను’ గురించి అంతగా పట్టించుకోరు!).

ప్ర: ఒక లైటు బల్బును మార్చడానికి ఎంతమంది నాసా యింజినీర్లు అవసరం?


జ: పది మంది. ఒకరు బల్బు మార్చడానికి. తొమ్మిది మంది లెక్కలు కట్టడానికి! (మళ్లీ జోకుకు వివరణ! మరి జోకు పేలాలి గద! ఈ లైటు బల్బును మార్చడం గురించి లెక్కలేనన్ని జోకులున్నాయి. ఉదాహరణలు చూడండి. మీకే అర్థమవుతుంది).


ప్ర: లైట్ బల్బును మార్చడానికి ఎంతమంది పొలిటీషియన్స్ అవసరం?


జ-1: ఇద్దరు! ఒకరు బల్బు మార్చడానికి. ఇంకొకరు దాన్ని తీసేయడానికి!


జ-2: నలుగురు. ఒకరు బల్బు మార్చడానికి. మిగతావారు అసలేం మారలేదని స్టేట్‌మెంట్స్ యివ్వడానికి.


ప్ర: లైటు బల్బు మార్చడానికి ఎంతమంది ఎంపీలు అవసరం?


జ: 21 మంది. ఒకరు బల్బు మార్చడానికి. 20 మంది ఆ విషయంగా పార్లమెంటరీ కమిటీలో పని చేయడానికి!



వాతావరణంతో(లో) మార్పులు.December 6th, 2010

ప్రపంచ వాతావరణం వేడెక్కుతున్నందుకు అంతటా నష్టమే కలుగుతుందనడానికి లేదు. కొన్నిచోట్ల ఈ ప్రభావంవల్ల మంచి జరుగుతుందట! చూడండి!

బారతదేశంలోని పశ్చిమ భాగంలో, వాతావరణంలో తేమ తగ్గుతుంది. కనుక అక్కడ దోమలు తగ్గుతాయి.. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో బాటు మరికొన్ని వ్యాధులు కూడా తగ్గుతాయని సూచన.

ఉత్తర అమెరికా, యూరపులలోని స్కీ (మంచుమీద జారే ఆట) రిసార్ట్‌లు కొండలమీద మరింత ఎత్తులకు వెళ్లవలసి ఉంటుంది. దిగువ ప్రాంతాలలో మంచుకరుగుతుందన్నమాట! ఇప్పుడున్న రిసార్ట్‌లలో మంచులేక అవన్నీ స్పా లేక కెసనోలుగా మారుతాయి. భారతదేశంలో స్కీ రిసార్ట్‌లు మొదలవుతాయని గతంలోనే ఊహించారు. అంటే ఇక్కడ వాతావరణం ఈ ఆటకు అనుకూలంగా మారుతుందని అర్థం! ఇక మంచిదో చెడ్డదో చెప్పలేని పరిస్థితులు మరికొన్ని ఉన్నాయి.

భారతదేశంలో మాన్‌సూన్ అనే రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి. ఈ పవనాలు తీరు మారిపోయిందని ఇప్పటికే గుర్తించారు. పైగా హిమాలయాల మీద మంచు కరిగితే, ఉత్తర భారతపు నదుల తీరు కూడా మారుతుంది. మన దేశం, చైనాల చివరికి మంచి నీటి కోసం సముద్రం మీద ఆధారపడవలసి ఉంటుంది. అప్పుడు సముద్రం నీటి నుంచి మంచినీటిని తయారు చేసే డీసెలైనేషన్ కంపెనీలకు గిరాకీ పెరుగుతుంది!

చలి దేశాల వారికి ఇళ్ళను వేడిగా ఉంచుకోవడానికి ఎక్కువగా చమురు అవసరం. రష్యాలో నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి గనుక, యూరోపియన్ దేశాలు రష్యా బెదిరింపులకు తల ఒగ్గుతుంటారు. చలి తగ్గితే చమురు అవసరం తగ్గుతుంది. రష్యా బెదిరింపులకు తావుండదు.

ఈలోగా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ‘పొడి ప్రదేశాల’వుతాయి. అప్పుడు మంచినీరు ఎక్కువగా ఉన్న దేశాలకు గౌరవం, ఆదాయం పెరుగుతాయి. కెనడాకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం చమురు దేశాలున్న స్థితికి కెనడా చేరుతుంది.

కాలుష్యం కలిగించని ఇతనాల్‌కు ఇంధనంగా గిరాకీ పెరుగుతుంది. బ్రెజిల్ ప్రస్తుతం ఎక్కువగా ఇతనాల్‌ను తయారు చేస్తున్నది. వేడి కారణంగా కెనడా, రష్యా, గ్రీన్‌లాండ్‌లలో పంటపొలాల విస్తీర్ణం పెరిగిపోయి, అక్కడా చెరుకు పండిస్తారు. అక్కడా ఇతనాల్ తయారు చేస్తే వారికి ఆర్థికంగా మంచిరోజులు వస్తాయి.



అటుకుల రుచి చెడలేదు!.December 6th, 2010

వంటింట్లో వెతుకుతుంటే అప్పుడప్పుడూ చాలా కాలంగా అందరూ మరచిపోయిన తిండి వస్తువు ఏదో కనిపిస్తుంది. పాతది, కనుక, పనికిరాదని మనం అలాంటి వాటిని పడవేస్తాము. అలా పడవేయనవసరం లేదని, కొన్ని రకాల తిండి పదార్థాలు వాటి తేదీ ముగిసిన తర్వాత కూడా తినడానికి పనికివచ్చేవిగానే ఉంటాయని, సైంటిస్టులు అన్నారు. ఈ విషయం వండిన వస్తువుల గురించి మాత్రం కాదని వేరుగా చెప్పనవసరం లేదు!

సరిగ్గా సీల్ చేసి ఉంచిన తిండి పదార్థాలు, ముఖ్యంగా తడిలేనివి ఎంత కాలమయినా పాడుగాకుండా ఉంటాయని పరిశీలకులు గమనించారు.

‘తిండి వస్తువులు, మనం అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ కాలం ఉంటాయి’ అంటారు ప్రోవో విశ్వవిద్యాలం పరిశోధకులు ఆస్కార్ పైక్! కరువు కాలంతో తినవచ్చునని ఒక పండితుడెవరో తమిద (రాగి) పిండితో గోడలు కట్టి పెట్టారని, పిన్నవయసులో విన్న కథ ఈ సందర్భంగా గుర్తుకు వచ్చింది.

చక్కెర, ఉప్పు లాంటి పదార్థాలను ఎంతకాలయినా నిలువచేసి పెట్టుకోవ్చునని తెలుసు. కానీ కూరగాయలు, పళ్ళవరుగల లాంటివి కూడా ఎంతకాలమయినా దాన్ని తినవచ్చనే వారూ ఉన్నారు. అత్యవసర పరిస్థితులలో తినడానికి తిండి దొరకనప్పుడు, కొన్ని రకాల తిండి ఉపయోగపడుతుంది. అది తాజా తిండితో పోల్చదగినది కాకపోవచ్చు. కానీ పడవేయవలసిన అవసరం కూడా లేదు.

తిండి వస్తువులను తేమ తగలకుండా ఉంచితే, ఎంతకాలమయినా ఉంటాయి. ఇక రెండవ సంగతి - వెలుగు, వేడిమి తగలకుండా ఉంచగలగడం ఈ రకంగా తిండిని దాచితే వాటిలోని ఆహారపు, పోషక విలువలు తరగకుండా ఉంటాయంటారు పరిశోధకులు. గాలి తగలకుండా సీల్ చేసి ఉంచిన పదార్థాలకు పురుగులు, బూజులు సోకవని తెలుసు.

ఓట్స్‌తో తయారు చేసిన అటుకులను 28 సంవత్సరాలు దాచి ఆ తర్వాత టెస్టర్ల చేత తినిపించి, నాణ్యతను పరిశీలించారు. ముప్పావు వంతు టేస్టర్లు ‘తాజాగా లేకపోవచ్చు గానీ ఈ అటుకులను తినడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు’ అన్నారు. అలాగే 20 సంవత్సరాల నాటి పాలపొడి గురించి కూడా పరిశీలనలు జరిగాయి. అదీ తినడానికి ‘బాగానే’ ఉందని తెలిసింది.

ఉప్పు, చక్కెరల్లాగే కొన్ని రకాల గింజలు, గోధుమలు వంటి వాటిని ఎంతకాలమయినా నిలువ ఉంచవచ్చని పరిశోధకులు అంటూనే ఉన్నారు. గింజలు వేరు, అటుకుల వంటివి వేరు గనుక ప్రాసెస్ చేసిన తిండి వస్తువుల గురించి పరిశోధించాలన్న ఆలోచన ఆహార శాస్తవ్రేత్తలకు వచ్చింది. అప్పుడు ఈ 28 సంవత్సరాల నాటి అటుకుల పరిశోధన మొదలయింది.

అటుకుల వాసన, చేతికీ నోటికీ తగిలే తీరు, రుచి, నోట్లో మిగిలేరుచి మొత్తంమీద తినడానికి యోగ్యత అనే అంశాలను చెప్పవలసిందిగా ‘రుచి’ నిపుణులను అడిగారు. పదార్థంలోని పోషక విలువల స్థాయిని కూడా పరిశీలించారు. అటుకులకు 48 నుంచి 67 వరకు మార్కులు పడ్డాయి.

ఇంతకూ ఈ రకమయిన తిండి వస్తువులు ఎందుకు పాడవుతాయి అన్నది ప్రశ్న! వాటిని తయారు చేసిన పద్ధతి ఒక ఎత్తు నిలువ ఉంచిన తీరు మరొక ఎత్తు. తిండి వస్తువులకు వేడి, ప్రాణవాయవు ఎక్కువ తగిలితే వాటి నాణ్యత సులభంగా తరిగిపోతుంది. పండ్ల పదార్థాలను నిలువ ఉంచాలంటే చక్కెర పానకంలో పెడతారు. కొన్ని పదార్థాలను ఉప్పు కలిపి ఉంచుతారు. మన దేశంలో ఉప్పువరుగులు, ఉసిరి వడలు మొదలయినవి ఎంత కాలమయినా పాడవకుండా ఉండడం తెలుసు. కొత్త పద్ధతులు వచ్చిన తర్వాత ఫ్రిజర్వేటివ్స్, ఆంటి ఆక్సిదాంట్స్ అనే రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని వాడడం వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని నిర్ణయించి నిషేధించారు. కొన్నింటిని అనుమతించారు.

మన దేశంలో ఇంకా డబ్బాలలో సీల్‌చేసి తిండి పదార్థాలను దాచడం అంతగా అలవాటు కాలేదు. తేమ, వేడి ఎక్కువ గనుక మన దగ్గర తిండి త్వరగా పాడవుతుంది. ఇక సంవత్సరాల పాటు తిండి తాచడం గురించి మనకు ఆలోచనే రాదేమో!

Let us enjoy learning!
$$$$$

Friday, December 17, 2010

Cartoon again!

Here is another cartoon!
Laugh if you feel like!



what is it? Are you levitating or am I in hallucinations?

ఏమిటి కనుగొన్నావ్? నీవు ఎగరడమా? లేక నేను భ్రమ పడడమా?


Let us enjoy some funny stuff!

Faiz Ahmed Faiz

Janab Faiz is an exceptionally great poet from Pakistan.
Here is a poem of Faiz for your reading plaeasure.
This gives you an idea of what is Urdu poetry like, if you are not already eposed to it!

Faiz Ahmad Faiz




వలపులాటలోన వదిలెను ఇరు జగాల్
కరిగె దుఃఖరాత్రి కదిలెనొంటరియై

పానశాల రిత్త పానపాత్రలు చెత్త
వదిలి పోతివి నీవు, వసంతమును చనెను

పాపము సేయగా పట్టుమని పది దినాల్
పెట్టినాడు జేజ గట్టివాడే గదా

మదినుండి నీ మాట మలిపి వేసెను జగము
కదలవలెగద దినాల్ కడవరకదే ధ్యాస

తుదకు నేడామెయే తలపకనె చిరునవ్వె
ఎద చేతగానిదా ఎంతెతంత ఎగిరెనో

Many friends may not know that I read and write Urdu.
The translation into Telugu is a trail by yours sincerely!

English translation is courtesy Sri K C Kanda


Let us enjoy some good poetry!
()()()()

Monday, December 13, 2010

Haragopal on Telugu Short Story

Prof. Haragopal is an academician with difference.
He was asked to review the book of stories published by Vasireddy Naveen and Papineni Sivashankar.
On completing 20 volumes of story collections they brought out a collection of stories from the collections.
They got up a day long meeting of writers at the Telugu University.
Many stalwarts like Kalipatnam and others were present.
Haragopal made an eloquent speech.
In the beginning he spoke how the academic books are reviewed.
He tried to draw parallels and tell that reviewing creative works calls for more diligence.
The gentleman from The Hindu almost misquoted Haragopal in a write up later!

I bring here the initial few minutes of the talk.
The bit is an example of the speakers suitability to the task!
It is not the total lecture please!

I searched for an image of Prof Haragopal on the net!
Nope! None found!
That is Haragopal for you!



Let us enjoy some plain speaking!
!!!!!!!

Sunday, December 12, 2010

Vikasam December

Here is the link to the Yuva pull out in Andhra Bhoomi!

Yuva in Andhra Bhoomi

Here is the content from the Vikasam page in Yuva published on 1st December.

ఉత్సాహమే ఊఫిరి


- విజయగోపాల్ vijayagopalk@gmail.com

December 1st, 2010

ఏది సాధించాలన్నా ముందు మనసులో ఉత్సాహం ఉండాలి. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, పదిమందిలో గుర్తింపు, ప్రజలతో సంబంధాలు, మనం మరింత బాగుపడటం, ఇలా ఎన్నయినా సరే, అన్నింటికీ ఉత్సాహమే ఊపిరి.

ఏదో కావాలనుకుంటాం. బుద్ధిగానే బయలుదేరతాం. సహజంగానే కష్టాలు ఎదురవుతాయి. ఇదంతా కష్టం అనుకుంటాము. ఇదంతా అసాధ్యం అనే చోటికి చేరుకుంటాం. అప్పుడిక ఆ పని పూర్తి చేయడానికి అవసరమయిన ఉత్సాహం, పట్టుదల సడలిపోతాయి. కష్టమయిన పనులన్నీ అసాధ్యాలు కావు. కష్టమయినా సరే సాధించి తీరాలి అన్న పట్టుదల ఉంటే, పరిస్థితి మరోరకంగా ఉంటుంది. అది లేకుంటే మనుసలో ఒక ఖాళీ, ఒక నిస్సహాయత పరుచుకుంటాయి. అందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఈ రకమయిన పరిస్థితిని రుచిచూచిన వాళ్లమే!

అలాంటి సందర్భాల్లోనే ఉత్సాహాన్నీ, పట్టుదలనూ మరోసారి పైకెత్తాల్సి ఉంటుంది. అది అన్నంత, అనుకున్నంత సులభంకాదు. ఎలా, జరగాలది? ఎవరు చేయాలా పని? ప్రశ్నలు ఎదురవుతాయి.

ఇంట్లో వాళ్లు, ట్రెయినర్లు, పుస్తకాలు మనకు ఆ ఉత్సాహాన్ని అందించగలవా? ఎవరో వచ్చి మనకోసం ఏదయినా చేస్తారా?

ఇది జీవితంలో పరీక్ష. అన్ని పరీక్షలలాగే, ఈ పరీక్ష కూడా ఎవరికి వారే ఎదుర్కోవాలి. జయించాలి! మిగతా వాళ్లు ఏదోకొంత సాయం చేస్తారు. పరీక్ష మనవంతుపని! పరీక్ష సమయంలో ‘ఇక నావల్ల అయ్యేట్టు లేదు!’ అంటున్న నీవు ఒక భాగం. ‘లేదు ముందుకు సాగాలి’ అనే నీవు రెండో భాగం. ఈ రెండు నీవుల మధ్య పోరాటంలో రెండో నీవు గెలవాలి. అది ఒకసారి జరిగితేచాలదు. అవసరం వచ్చినప్పుడల్లా ఈ యుద్ధం తప్పదు! ఉత్సాహమే గెలవాలి!

1. జీవితానికి ఒక గమ్యం, ఒక దృష్టి, ఒక వ్యూహం అవసరం! నాకు ఏం కావాలి. పరిస్థితులేమిటి? ఈ పరిస్థితుల్లో నా గమ్యానికి సరైన త్రోవ ఏది అన్న అంశాలు మనసులో ముందే స్థిరంగా ఉండాలి. వాటిని ఒక కాగితం మీద రాసి పెట్టుకోగలిగితే మరీ బాగుంటుంది.

2. ఎంచుకున్న దారిలో ముందుకు కదలడానికి సరైన ఉత్సాహం అవసరం. గమ్యం ఉండగానే సరిపోదు. ముందు ఆ గమ్యం నాకెందుకు? అన్న ప్రశ్నకు జవాబు తెలిసి ఉండాలి. అది నీకు ఇష్టం గనుకనా? అవసరమా? కేవలం మానసిక ప్రశాంతత కొరకా? గమ్యం చేరిన తర్వాత మనకు ఏమి మిగులుతుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలిస్తే ఉత్సాహం నిలబడుతుంది.

3. మంచి ప్రయత్నాలు కూడా తప్పదన్నట్లు, అదేపనిగా చేస్తుంటే ఉత్సాహం తగ్గుతుంది. అప్పుడప్పుడు నిలబడి విశ్రాంతిగా ఆలోచించడం మంచిది. అప్పుడు ఉత్సాహం మరింత పెరుగుతుంది.

4. ఫలితాలు అందుతుంటే ఉత్సాహం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో ఫలితం కోసం చేసే ప్రయత్నాలే ఎంతో ఉత్సాహకరంగా ఉంటాయి. ‘ప్రయాణమే నా గమ్యం’ అని ఒక చక్కని మాట ఉంది.

5. ప్రయత్నించాలని నిశ్చయించడం మనకు అందే తొలి ఫలితం! ఉత్సాహం లేనిదే జీవితం లేదు. జీవితమంటేనే ఉత్సాహం! ఆ ఉత్సాహమే జీవితానికి ఊపిరి.

=========================

రాక్షస బలం

భలే! భలే బాగుంటుంది! రాక్షసుడికున్నంత బలం ఉంటే భలే బాగుంటుంది. కానీ దాన్ని రాక్షసుడిలాగే వాడితే మాత్రం బాగుండదు.


- షేక్స్‌పియర్


- అవును! నేను నాపట్ల నేనుగాని, ఇతరుల పట్ల గానీ రాక్షసంగా ఉండను. నాలోని వెలుగే నా బలం. నాగురించి నేను తెలుసుకోవడమే నా ప్రయత్నం.


పని: పని ఎక్కువయిందని బాధపడి లాభం లేదు. పరిస్థితి మరీ దుర్భరమయితే ఆ విషయాన్నీ, పనినీ అర్థం చేసుకునే వారి కోసం వెదకాలి.

=======================

భలేవాదూ.. బాసూ..

అధికారం కలవారికి, దాన్ని అతిగా వాడటం అలవాటవుతుంది. అలాంటి వారి తీరు మిగతా వారందరినీ మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. మీరు బాగా పని చేస్తారు. అయినా అనవసరంగా చివాట్లు తింటున్నారు. అవమానాలూ జరుగుతున్నాయి. అక్కడ తప్పు మీది కాదు. ‘బాసు’లది!


బాసు తీరు ఒకే లాగుండదు:


వారు ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటారో తెలీదు. ఏంచెబితే ఏమంటారో? దేన్ని మెచ్చుకుంటారో? దేనికి అరుస్తారో తెలియదు. నూరు సంగతులు ఆలోచించుకుని వెళితే 101వ ప్రశ్న అడిగే బాసులుంటారు.


అవమాన పరచడం హాబీ:


అందరినీ తప్పులు పట్టడం, అందరిలోనూ అవమానపర్చడం, అదొక రాక్షస ప్రవృత్తి. మంచిపని అని తెలిసి కూడా మెచ్చుకోక పోవడం ఒక రుగ్మత. పైగా ఆ ‘మంచి’ అంతా తమవల్లనే జరిగిందని ప్రచారం చేసుకునే బాసులూ ఉన్నారు.


వాళ్ళు గెలవాలి, మిగతావాళ్ళు ఓడాలి:


అందరూ గెలిస్తే కొందరు అధికారులకు నచ్చదు. ఎదుటివారు చెబుతున్నదే నిజమనే పరిస్థితి వస్తే దాటవేసే ప్రయత్నాలు చేస్తారు కూడా.


ఎవరికీ స్ఫూర్తినిచ్చే ప్రసక్తి లేదు:


‘ఏం చేస్తారో తెలియదు. ఈ పని అయిపోవాలి!’ అనేది వారి నుంచి వచ్చే మామూలు మాట! వాళ్ళకే తెలియకపోతే, వారి నుంచి నేర్చుకోవలసిన మనకు తెలిసేది ఎట్లా?


ఆఫీసులో అధికారి పద్ధతి ఇదయితే మనం మన పిల్లలతో, తోటివారితో, బంధువులతో ఇదేరకంగా ఉంటున్నామా? అని ఆలోచించవలసిన అవసరం ఉంది. మనదీ ఇదే పద్ధతి గనుక అయితే, చివరకు మిత్రులు కూడా మిగలరు మరి! అధికారులు మారాలి. మరి మనమూ మారాలా? ఆలోచించాలి గదూ?

=======================

మనలోనే ఉంది

ఒకప్పుడు ప్రపంచంలోని తెలివంతా అందరికీ అందుబాటులో ఉండేదట. అయినా ఎవరూ దాన్ని అంతగా పట్టించుకోలేదు. దేవతలకు ఈ పరిస్థితి నచ్చలేదు. తెలివి నిజంగా కష్టపడి ప్రయత్నించే వారికి మాత్రమే అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. అప్పుడయినా తెలివిని బాగా వాడుకుంటారని వారి అభిప్రాయం.


మరి తెలివినంతా ఎక్కడ దాచాలి?


‘నేలలో లోతుగా పాతితే సరి’ అన్నారొకరు.


‘లేదు. మనుషులు తవ్వి తెలుసుకుంటార’ని జవాబు వచ్చింది.


‘సముద్రం లోతుల్లో దాచవచ్చు’


‘లేదు అక్కడికీ చేరగలడు మనిషి’


ఎత్తయిన కొండకొమ్మున పెడితే?’


‘అదీ అందని చోటేమీ కాదు!’


‘ఇదంతా కాదు. మనిషిలోనే ఆ తెలివిని దాచితే సరి. తనలో వెదకాలని మనిషికి తోచదు!’ అన్నాడు నిజంగా తెలివిగల దేవుడొకాయన.


అలాగే జరిగింది! ఇవాళ్టికీ అలాగే ఉంది!

=================

ఆలోచించండి

‘మనల్ని మనం మన భావాల ఆధారంగా బేరీజు వేసుకుంటాం. ఎదుటివారిని మాత్రం వారి పనులు, మాటల ఆధారంగా బేరీజు వేస్తాం!’


ఎవరో మన పొరపాటును ఎత్తి చూపుతారు. ‘నిజానికి నేను అలా చేయాలని అనుకోలేదు! ఏదో జరిగిపోయింది!’ అంటాం. అందరూ అంతేనేమో?


Let us enjoy readimg some fine ideas!
()()()()()()()()()

Saturday, December 11, 2010

Medha - 6

Another instalment of content from my page Medha in Andhra Bhoomi!

The link for the latest edition of Medha

మరో ప్రపంచం


November 21st, 2010

పట్టణాల్లో వాళ్ళకు పట్టదు గానీ, వర్షాలొచ్చాయంటే చాలు పురుగులు, తేళ్లు, పాములు, రకరకాల జీవుల కదలిక ఎక్కువవుతుంది. అంటే వర్షాలు లేని సమయంలో కూడా వీటి కదలిక ఉండనే ఉంటుందని అర్థం చేసుకోవాలి.

భూమిమీదా, నీటిలో, అడవిలో, ఎక్కడయినా సరే, మనకు ముందు పెద్దపెద్ద ప్రాణులు మాత్రమే కంటబడతాయి. పక్షులు, పశువులు, చేపలు మరెన్నో రకాలను మనం చూస్తాం. ఇవన్నీ కలిసి వాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే సన్నజీవులను వెనక్కు నెడుతుంటాయనవచ్చు. సన్నటి పురుగులు, కనీకనిపించని కీటకాలు ఎన్నో పట్నంలోనయినా సరే మట్టిలో కదులుతూనే ఉంటాయి. మొక్కనాటడానికని తోడబోతే చీమలదండు బయటపడుతుంది. లుకలుకలాడుతూ మరేవో పురుగులూ ఉంటాయి. సాలీళ్లు, బీటిల్స్ (పేడ పురుగులు), జెర్రులు మొదలు తేళ్లు, పాములదాకా ఎన్నెన్ని ప్రాణులో! అన్ని వాటంతటవి బతుకుతుంటాయి.

నిజానికి ఈ పురుగుల ప్రపంచానికీ, మనిషి ప్రపంచానికీ సంబంధం లేదని అనిపించవచ్చు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదని, అనుభవం ఒకవేపు, పరిశోధకులు మరోవేపు చెపుతున్నా మనం పట్టించుకోవడం లేదు. మట్టిలోని అణువులకు అంటుకుని, కంటికి కనిపించని బాక్టీరియా మొదలు మరెన్నో ప్రాణులు, మొక్కలు ఉంటేనే మన బతుకు ఈ రకంగా సాగుతుంది. అవి మనం అనుకున్నట్లు చెత్త, మురికి కావు. వాటితోనే మట్టి కూడా జీవంతమవుతుంది.

మన యింటిముందు మట్టిలోని (మట్టి ఉంటే!) ఈ జీవులన్నీ ఒక్కసారిగా మాయమయినాయనుకుందాం! ఆలోచనే భయంకరంగా ఉంది. ఒక్కసారి మట్టి తగ్గిపోతుంది. గాలిలో ప్రాణవాయువు, కార్బన్ డయాక్సైడ్, మిగతా రకరకాల వాయువుల మోతాదు మారిపోతుంది. వాతావరణ సమతూకం ఒక్కసారి కొత్త తీరుకు చేరుకుంటుంది. అదేదో అంగారకగ్రహం మీద నేలలాగ తయారవుతుంది.

నిజం! ఒక్క భూమిమీద మాత్రమే ఈ రకమయిన జీవావరణం ఉంది. ఈ పలుచుని పొరలోనే మనం కూడా ఒక భాగంగా ఉన్నాము. మనం బతకడానికి అవసరమయిన పరిసరాలు, పరిస్థితులు ఈ జీవావరణం వల్లనే వీలవుతున్నాయి.

జీవావరణంలోని ఎక్కువ శాతం ప్రాణులు. వాటిలోని జాతులు అన్నీ ఈ పైపొరలోనే ఉంటాయి. మొత్తం జీవం మనుగడకు అవసరమయిన రసాయన చర్యలన్నీ వాటి శరీరాల ద్వారానే జరుగుతుంటాయి. వాటి పనితనాన్ని వర్ణించడం ధైర్యమే అవుతుంది. చనిపోయి పడుతున్న జంతువృక్ష శరీరాలను తిరిగి రసాయనాలుగా మార్చే పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. పనికిరాని పదార్థాలను తినే ప్రాణులు కొన్ని. ప్రమాదకరమయిన వాటిని తినేవి మరికొన్ని. అది ఒక వలయం. చావు బతుకుల చక్రనేమి క్రమం. అందులో నుంచి, బతికిఉన్న చెట్లు, జంతువులకు తిండి పుట్టే పద్ధతి మరింత ఆశ్చర్యకరం! ఈ వరుస కొనసాగకపోతే జీవం లేదు, మనం లేము! అందుకే లుకలకలు, వికారాలతో సహా జీవులన్నీ ఉంటేనే మనకు మనుగడ!

ఇంత విచిత్రమయిన జీవులు, వాటి వైవిధ్యం గురించి పరిశోధకులకు కూడా తెలిసింది తక్కువ! ఉదాహరణకు బూజులని చెప్పుకునే ఫంజీ జాతిలో 60వేల రకాలను యిప్పటికి గుర్తించారు. ఇందులోనే కుక్కగొడుగులు, పుట్టగొగులు కూడా చేరతాయి. అవన్ని కలిసి 15 లక్షల రకాలవుతాయి. మట్టిలో వాటితోబాటు నులిపురుగులుంటాయి. మట్టితోడగానే కనిపించే పురుగులు, మనుషుల కళ్లలోకి కడుపులోకి చేరుతుంటాయి కూడా! అవి ఎన్ని లక్షల రకాలున్నాయో లెక్క తెగలేదు. వీటిని మించిన సంఖ్యలో మరెన్నో సన్నప్రాణులుంటాయి. ఒక గ్రాము మట్టిలో పదిలక్షలకు పైగా సంఖ్యలో కొన్నివేల రకాల బ్యాక్టీరియాలుంటాయి. వాటిలో చాలా రకాలు పరిశోధకులు కూడా ఎరుగనవి. ఇక కీటకాల సంగతి సరేసరి!

మట్టిలో, బూజులు, బ్యాక్టీరియా, నులిపురుగులు, చీమలు గజిబిజిగా ఉంటాయనుకుంటే తప్పే. మనుషుల సమాజంలో లాగే మట్టిలోని, సమాజంలో లోతును బట్టి పరిస్థితులు మారుతుంటాయి. అక్కడి మట్టి, గాలీ, నీరు, తిండీ, అన్ని మారుతుంటాయి. అదే ఆధారంగా జీవజాతులూ మారుతుంటాయి. ప్రతిరకం ఒక ప్రత్యేకమయిన పరిస్థితిలో మాత్రమే మనలుగుతుంది.

మట్టిలోని ప్రాణులన్నింటి వివరాలను చేతయినంతగా, ఒక చోటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ళ్య.్య అనే వెభ్‌సైట్‌లో ఆ వివరాలు చూడవచ్చు. అది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లైఫ్! ‘జీవసర్వస్వం’ అంటే అర్థం కుదురుతుందో లేదో!

ఈ జంతు వృక్షాల పరిశీలన ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెడుతున్నది. పర్యావరణం అంటే మనిషి, పశువులే కాదు! ఈ ప్రాణులన్నీ అందులో భాగమే!

పట్టణాల్లో వాళ్ళకు పట్టదు గానీ, వర్షాలొచ్చాయంటే చాలు పురుగులు, తేళ్లు, పాములు, రకరకాల జీవుల కదలిక ఎక్కువవుతుంది. అంటే వర్షాలు లేని సమయంలో కూడా వీటి కదలిక ఉండనే ఉంటుందని అర్థం చేసుకోవాలి.

భూమిమీదా, నీటిలో, అడవిలో, ఎక్కడయినా సరే, మనకు ముందు పెద్దపెద్ద ప్రాణులు మాత్రమే కంటబడతాయి. పక్షులు, పశువులు, చేపలు మరెన్నో రకాలను మనం చూస్తాం. ఇవన్నీ కలిసి వాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే సన్నజీవులను వెనక్కు నెడుతుంటాయనవచ్చు. సన్నటి పురుగులు, కనీకనిపించని కీటకాలు ఎన్నో పట్నంలోనయినా సరే మట్టిలో కదులుతూనే ఉంటాయి. మొక్కనాటడానికని తోడబోతే చీమలదండు బయటపడుతుంది. లుకలుకలాడుతూ మరేవో పురుగులూ ఉంటాయి. సాలీళ్లు, బీటిల్స్ (పేడ పురుగులు), జెర్రులు మొదలు తేళ్లు, పాములదాకా ఎనె్నన్ని ప్రాణులో! అన్ని వాటంతటవి బతుకుతుంటాయి.

నిజానికి ఈ పురుగుల ప్రపంచానికీ, మనిషి ప్రపంచానికీ సంబంధం లేదని అనిపించవచ్చు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదని, అనుభవం ఒకవేపు, పరిశోధకులు మరోవేపు చెపుతున్నా మనం పట్టించుకోవడం లేదు. మట్టిలోని అణువులకు అంటుకుని, కంటికి కనిపించని బాక్టీరియా మొదలు మరెన్నో ప్రాణులు, మొక్కలు ఉంటేనే మన బతుకు ఈ రకంగా సాగుతుంది. అవి మనం అనుకున్నట్లు చెత్త, మురికి కావు. వాటితోనే మట్టి కూడా జీవంతమవుతుంది.

మన యింటిముందు మట్టిలోని (మట్టి ఉంటే!) ఈ జీవులన్నీ ఒక్కసారిగా మాయమయినాయనుకుందాం! ఆలోచనే భయంకరంగా ఉంది. ఒక్కసారి మట్టి తగ్గిపోతుంది. గాలిలో ప్రాణవాయువు, కార్బన్ డయాక్సైడ్, మిగతా రకరకాల వాయువుల మోతాదు మారిపోతుంది. వాతావరణ సమతూకం ఒక్కసారి కొత్త తీరుకు చేరుకుంటుంది. అదేదో అంగారకగ్రహం మీద నేలలాగ తయారవుతుంది.

నిజం! ఒక్క భూమిమీద మాత్రమే ఈ రకమయిన జీవావరణం ఉంది. ఈ పలుచుని పొరలోనే మనం కూడా ఒక భాగంగా ఉన్నాము. మనం బతకడానికి అవసరమయిన పరిసరాలు, పరిస్థితులు ఈ జీవావరణం వల్లనే వీలవుతున్నాయి.

జీవావరణంలోని ఎక్కువ శాతం ప్రాణులు. వాటిలోని జాతులు అన్నీ ఈ పైపొరలోనే ఉంటాయి. మొత్తం జీవం మనుగడకు అవసరమయిన రసాయన చర్యలన్నీ వాటి శరీరాల ద్వారానే జరుగుతుంటాయి. వాటి పనితనాన్ని వర్ణించడం ధైర్యమే అవుతుంది. చనిపోయి పడుతున్న జంతువృక్ష శరీరాలను తిరిగి రసాయనాలుగా మార్చే పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. పనికిరాని పదార్థాలను తినే ప్రాణులు కొన్ని. ప్రమాదకరమయిన వాటిని తినేవి మరికొన్ని. అది ఒక వలయం. చావు బతుకుల చక్రనేమి క్రమం. అందులో నుంచి, బతికిఉన్న చెట్లు, జంతువులకు తిండి పుట్టే పద్ధతి మరింత ఆశ్చర్యకరం! ఈ వరుస కొనసాగకపోతే జీవం లేదు, మనం లేము! అందుకే లుకలకలు, వికారాలతో సహా జీవులన్నీ ఉంటేనే మనకు మనుగడ!

ఇంత విచిత్రమయిన జీవులు, వాటి వైవిధ్యం గురించి పరిశోధకులకు కూడా తెలిసింది తక్కువ! ఉదాహరణకు బూజులని చెప్పుకునే ఫంజీ జాతిలో 60వేల రకాలను యిప్పటికి గుర్తించారు. ఇందులోనే కుక్కగొడుగులు, పుట్టగొగులు కూడా చేరతాయి. అవన్ని కలిసి 15 లక్షల రకాలవుతాయి. మట్టిలో వాటితోబాటు నులిపురుగులుంటాయి. మట్టితోడగానే కనిపించే పురుగులు, మనుషుల కళ్లలోకి కడుపులోకి చేరుతుంటాయి కూడా! అవి ఎన్ని లక్షల రకాలున్నాయో లెక్క తెగలేదు. వీటిని మించిన సంఖ్యలో మరెన్నో సన్నప్రాణులుంటాయి. ఒక గ్రాము మట్టిలో పదిలక్షలకు పైగా సంఖ్యలో కొన్నివేల రకాల బ్యాక్టీరియాలుంటాయి. వాటిలో చాలా రకాలు పరిశోధకులు కూడా ఎరుగనవి. ఇక కీటకాల సంగతి సరేసరి!

మట్టిలో, బూజులు, బ్యాక్టీరియా, నులిపురుగులు, చీమలు గజిబిజిగా ఉంటాయనుకుంటే తప్పే. మనుషుల సమాజంలో లాగే మట్టిలోని, సమాజంలో లోతును బట్టి పరిస్థితులు మారుతుంటాయి. అక్కడి మట్టి, గాలీ, నీరు, తిండీ, అన్ని మారుతుంటాయి. అదే ఆధారంగా జీవజాతులూ మారుతుంటాయి. ప్రతిరకం ఒక ప్రత్యేకమయిన పరిస్థితిలో మాత్రమే మనలుగుతుంది.

మట్టిలోని ప్రాణులన్నింటి వివరాలను చేతయినంతగా, ఒక చోటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ళ్య.్య అనే వెభ్‌సైట్‌లో ఆ వివరాలు చూడవచ్చు. అది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లైఫ్! ‘జీవసర్వస్వం’ అంటే అర్థం కుదురుతుందో లేదో!

ఈ జంతు వృక్షాల పరిశీలన ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెడుతున్నది. పర్యావరణం అంటే మనిషి, పశువులే కాదు! ఈ ప్రాణులన్నీ అందులో భాగమే!

సాలెపురుగు తన గూట్లో తానెందుకు చిక్కుకోదు?
గోపాలం కెబి, November 21st, 2010

ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. విషజంతువుల శరీరంలోని విషం, ఆ జంతువుకు మాత్రం హానీ కలిగించదు. మన కడుపులో మాంసంతో సహా ఏం చిన్నా అరుగుతుంది. ఆ కడుపు మాత్రం అరగకుండా అట్లాగే ఉంటుంది. ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి గనుకనే జీవులు కొనసాగుతున్నాయి.


సాలె పురుగు ప్రశ్నకు మూడురకాల జవాబులు కనిపించాయి. వాటిల్లో మొదటిది - ఒక రకం చమురు గురించి చెపుతున్నది. సాలె పురుగు కాళ్ళలో ఒక రకం చమురు ఉంటుందనీ, అందుకే దారాలు వాటికి అంటుకోవని కొందరు అన్నారు. కానీ ఈ రకం చమురు గురించి ఎవరూ వివరాలు కనుగొన్నట్లు లేదు. కనుక అది ఊహ మాత్రమే అనవచ్చు. రెండవది - సాలె పురుగు తయారు చేసే దారాలు అన్నీ ఒకే రకంగా ఉండవు. ఒక్కోరకం దారం లావు, తీరు వేరుగా ఉంటుంది. అన్నిటికన్నా లావుగా ఉండేది వేలాడే తాడు. అదీ ఆధారంగా ఉండే విలువ తాళ్లూ అంటుకునే రకం కావు. పురుగులు ఎక్కువగా వీటి మీదనే తిరుగుతాయనీ, అందుకే తమ గూట్లో తాము చిక్కకుండా ఉంటాయని కొందరన్నారు. ఇది కొంతవరకు నిజం. సాలెపురుగులు ఎక్కువగా నిలువు తాళ్ళ మీదనే తిరుగుతాయి. అయినా గుండ్రంగా అల్లిన తాళ్ళమీదకు పోవని చెప్పడానికి లేదు. అట్లా పోయినప్పుడు కూడా అవి చిక్కకుండా వచ్చేస్తాయి! ఇక మూడవ జవాబుతో చిక్కుముడి విడిపోతుంది. ఇది సిసిలయిన సైంటిస్టుల జవాబు. పెద్ద భూతద్దాల కింద సాలెపురుగు కాళ్లను పరిశీలిస్తే వాటిలో కొక్కాలు ఉన్నట్లు తెలిసింది. నడిచేందుకు పట్టునిచ్చే రెండు కొక్కాలు ప్రతికాలు చివరనా ఉంటాయి. మూడవది కూడా ఒకటి ఉండి గూటిమీద నడిచేటప్పుడు పోగులు తెగకుండా జాగ్రత్తగా వాటి నుండి కాళ్లు వదిలిస్తూ ఉంటుందని పరిశోధకులు చూడగలిగారు. దారాలకు సాగే లక్షణం ఉంటుంది. కనుక కొక్కెం దారాన్ని లాగి, కాలి నుంచి వేరు చేస్తుంది. వీణ తీగెను లాగినప్పుడులాగే, ఈ తీగెలు కూడా కంపిస్తాయట గూడా! సాలె పురుగు తయారుచేసే పట్టుదారానికి, అసలు పట్టుకన్నా గట్టి గిరాకీ ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ దారం గట్టిదనం రహస్యం తెలిస్తే బులెట్ ఫ్రూఫ్ దుస్తుల తయారీలో ఆ పద్ధతిని వాడవచ్చునని కొందరు పరిశోధిస్తున్నారు. శరీర భాగాలలో వాడాలని వైద్యపరిశోధకులు, చేప గాలల నుంచి మొదలు రాళ్ళమీద పాకేందుకు వాడే తాళ్ళ కోసం, విమానాల్లో వాడకం కోసం మరిన్ని పరిశీలనలు జరుగుతున్నాయి. తయారయిన దారాలను అవసరమయినంతగా సేకరించడం కుదరదని తెలీదు. అందుకే బయోటెక్నాలజీ వారు రంగంలోకి దిగి దారాలను తమ పద్ధతిలో తయారు చేస్తామంటున్నారు.

జీవం - అంకెల్లో..!

November 21st, 2010

మొట్టమొదట జీవం ఏకకణజీవుల రూపంలో పుట్టింది 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం. అయినా ప్రాణం యొక్క అవశేషాలు మాత్రం 600 మిలియన్ సంవత్సరాలు నాటివి మాత్రమే దొరికాయి.


ఒక మిలియన్ బిలియన్ల చీమలు ప్రస్తుతం భూమిమీద ఉన్నాయని ఒక లెక్క.


కనీసం పదికోట్ల రకాల బహుకణ జీవులు ప్రస్తుతం భూమిమీద ఉన్నట్లు మరో లెక్క.


క్రీ.పూర్వం 10,000 సంవత్సరాలప్పుడు మానవ జనాభా కోటికి మించలేదు.


1974 నుంచి 1999 మధ్య అంటే 25 సంవత్సరాల్లో మనుషుల సంఖ్య నాలుగు బిలియన్ల నుంచి ఆరు మిలియన్లకు పెరిగింది.

అంకెలు అబద్ధమాడవా?

November 22nd, 2010

అమెరికాలో ఒకప్పుడు మెక్ కార్తీ అనే ఒక సెనేటర్‌కు ఒక్క దెబ్బతో గొప్పపేరు వచ్చేసింది. అతను చేసిన ఘనకార్యం, అంకెలను వాడుకోవడం, అంకెలతో ఆడుకోవడం. ఒకానొకనాడు అతను చట్టసభలో లేచి నిలబడి, చేతిలో ఒక కాయితాల కట్టను ఎత్తి ఊపుతూ ‘అమెరికన్ ప్రభుత్వపు అతి కీలకమయిన స్టేట్ శాఖలో 205గురు కమ్యూనిస్టులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదుగో వాళ్ళ వివరాలు!’ అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అవాక్కయ్యారు. రెండు రోజుల తర్వాత ఆ అంకె 207 అయింది. ఒక్కసారిగా అది 57కు దిగింది. అధ్యక్షుడు ట్రామన్‌కు రాసిన లేఖలో మెక్ కార్తీ ఈ అంకెను వాడాడు. ఆ తర్వాత 81 మంది వివరాలు నాదగ్గర ఖచ్చితంగా ఉన్నాయన్నాడు.


ఇంతకూ స్టేట్‌శాఖ ఉద్యోగుల్లోకి కమ్యూనిస్టులు నిజంగా దూరి ఉన్నారా? ఈ ప్రశ్నకు జవాబు ఎవరికీ తెలియదు. చివరకు మెక్ కార్తీకే తెలియదు. అతను సభ ముందు చేసిన ప్రసంగం అంతా ఒక కల్పన!


మెక్ కార్తీకి ఒక సంగతి మాత్రం బాగా తెలుసు! అంకెలంటే అందరికీ తాను చెప్పే సంగతి మీద సులభంగా నమ్మకం కుదురుతుందని అతను అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాడు. అప్పట్లో వైట్‌హౌస్ అధికారులకు, అతను చెపుతున్నదంతా కట్టుకథ అన్న అనుమానం రానే వచ్చింది. కానీ అతను అంకెలతో బాటు చెపుతున్నందుకు వారు కూడా అనుమానంలో పడ్డారు.


అంకెల సాయంతో చాలాసార్లు, చాలా మంది అందరినీ మోసపుచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఛార్ట్స్ సెయిఫ్ అనే గణిత పరిశీలకుడు ఈ మధ్యన ‘ఫ్రూఫినెస్ - ద డార్క్ ఆర్ట్స్ ఆఫ్ మాతమాటికల్ డిసెష్షన్’ అన్న పేరుతో ఒక పుస్తకం రాశారు. అంకెలను అందంగా వాడుకోవడం గురించి ఈ పుస్తకంలో ఆయన ఎన్నో ఆసక్తికరమయిన అంశాలను ప్రస్తావించారు. పుస్తకంలో తాను మెక్ కార్తీ గురించి రాసానని, అంకెలను వాడడం అన్న ట్రిక్‌కు అది గొప్ప ఉదాహరణ అనీ సెయిఫ్ అంటున్నారు.


‘అంకెలతో బాగా నమ్మకం కుదురుతుంది. అందునా, సుమారు ఉజ్జాయింపు కాకుండా ఖచ్చితమయిన అంకెలు చూపిస్తే ఎవరయినా ఆ సంగతిని సులభంగా నమ్ముతారు. నేను అంకెల గురించి పరిశోధిస్తాను అని చెప్పడంలో మాత్రం అంకెలు లేవు’ అంటూ సెయిఫ్ చమత్కరించారు. అదే మరి మెక్ కార్తీ చెప్పిన 205ను మాత్రం అందరూ సులభంగా నమ్ముతారు అంకెను చూడగానే లేదా వినగానే.


అవి అసలు సిసలయిన నిజం లాగా తోస్తుంది. అంకెలంటేనే వాస్తవం గదా మరి’ అంటారాయన.


కానీ అంకెలను సులభంగానూ, మరీ సీరియస్‌గానూ నమ్మితే ప్రమాదాలు ఎదురవుతాయి. అది ఉజ్జాయింపు అనే మాటకు వ్యతిరేకపదంగా మారుతుందని ఆయన అభిప్రాయం. ఇందుకు ఉదాహరణగా సెయిఫ్ ఒక చిత్రమయిన కథను చెప్పారు.


న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో ఒక డైనోసార్ నమూనా ఉంది. వచ్చిన వాళ్ళకు ప్రదర్శనలోని అంశాలను వివరించే ఒక ఉద్యోగి ‘ఈ రాక్షసిబల్లి వయసు 6,50,000,038 సంవత్సరాలు!’ అని చెప్పాడట. ‘అంత సరిగ్గా ఎట్లా చెపుతున్నావు?’ అని అడిగితే నేనిక్కడ గైడ్‌గా చేరి 30 సంవత్సరాలయింది. మొదట్లో నేను చేరినప్పుడు ఈ రాక్షసి బల్లి వయసు 65 మిలియన్ సంవత్సరాలని చెప్పారు!’ అన్నాడతను! నిజమే ఒక రకంగా అతని మాటను నమ్మవలసిన అవసరం ఉంది.


ఇక్కడ అరవై అయిదు మిలియనులు లేదా ఆరుకోట్ల యాభయి లక్షలు అన్న అంకెను అతను మరీమరీ సీరియస్‌గా తీసుకున్నాడు. నిజానికి రాక్షసి బల్లులు అరవై అయిదు మిలియన్ సంవత్సరాల నాటివి అన్న లెక్క ఒక ఉజ్జాయింపు. అది ఒక లక్షసంవత్సరాలు అటూ, ఇటూ అయినా తప్పులేదు. అందులో 38 సంవత్సరాలు అనగా నెంత? అందుకే కార్టూన్ బొమ్మలోని కల్పితపాత్రల వయసులాగ, ఈ 65 మిలియనులు అన్న అంకె ఎంతకామయినా అట్లాగే ఉంటుంది మరి!


ఈ మధ్యన ఎన్నికలు, మిగతా కొన్ని సందర్భాలలో ‘ఒపీనియన్ పోల్’ అనే పద్ధతిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, అంకెల రూపంలో చెప్పడం బాగా సాగుతున్నది. ‘ఇలాంటి చోట్ల వారు చెప్పే అంకెలు, జయాపజయాల అవకాశాలు కూడా సీరియస్‌గా తీసుకోవలసిన అంకెలు కావు’ అంటారు చార్ల్స్ సెయిఫ్! అసలు ఎంతమంది నుంచి అభిప్రాయాలు సేకరించారు అన్న చోట అంకె విలువ, దానిమీద నమ్మకం మొదలవుతాయి. ఇద్దరిని అభిప్రాయం అడిగి, అందులో ఒకరి పక్షాన్ని లెక్కలోకి తీసుకుని 50 శాతం మంది ఇలా అంటున్నారు అంటే ఎలా ఉంటుంది?


ఇదంతా కూడా ఉజ్జాయింపుకు వ్యతిరేకమయిన ‘ప్రూఫినెస్’ కిందకే వస్తుంది!

కుక్కలు!

November 22nd, 2010

ఈ ప్రపంచంలో ప్రస్తుతం నలభయి కోట్ల కుక్కలు ఉన్నాయని అంచనా. అమెరికా, మెక్సికోలను కలిపితే జనాభా కూడా అంతే ఉంది!


ఒక కుక్క ముక్కులో వాసన పసిగట్టే రిసెస్టర్లు 22కోట్లు ఉంటాయి. మనిషి ముక్కులో అందులో నలభయ్యవ వంతు మాత్రమే ఉంటాయి.


కుక్క ముక్కును ఆధారంగా, వాసనలు పసిగట్టగల యంత్రాన్ని తయారుచేసే ప్రయత్నాలు పెన్‌స్టేట్ యూనివర్శిటీలో జరుగుతున్నాయి.


కుక్కలు 45,000 హెర్ట్జ్‌ల పౌనఃపున్యం వరకూ ధ్వనులను వినగలుగుతాయి. మనిషి వినికిడి శక్తి అందులో సగానికి సగం! నిజానికి కుక్కలకన్నా మంచి వినికిడి శక్తిగల జంతువు పార్పాయిస్. అది 1,50,000 వరకు వినగలుగుతుంది.


బెల్జియం, రష్యా, జెర్మనీ దేశాలలో 31,000 సంవత్సరాల నాటి కుక్కల అవశేషాలు దొరికాయి.


సిడో అనే కుక్క, కంప్యూటర్ స్క్రీన్ మీద కుక్క కనిపిస్తే దాన్ని ముక్కుతో ముట్టుకుంటంది. అదే మరో దృశ్యం కనిపిస్తే మాత్రం దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని వియెన్నా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు!


కుక్కల్లో ‘అసూయ’ ఉందని పరిశోధకులు గమనించారు. తోటి కుక్కకు మంచి బహుమతి అందితే అవి మరింత శ్రమపడి యజమానిని మెప్పించే ప్రయత్నం చేస్తాయట



......అలలు......

November 22nd, 2010

(Save the picture to use as a desktop wallpaper)

అలలోనుంచి శక్తి వస్తుంది. తీరం తీరుకు అలలే కారణం! అలలు భయంకరమైనవి..

అయినా అందంగా ఉంటాయి!
Let us enjoy sceince!!


Friday, December 10, 2010

Malladi Brothers - Dhanyasi

Shravanam with young artists!

Malladi Brothers Sri Sriram Prasad and Sri Ravikumar
Ramabhirama - Dhanyasi


Let us enjoy some fine music!
@@@@@hr

Thursday, December 9, 2010

Dr. Dilavar - Book

Here is a review of a fine book by Dr. Dilavar of Paloncha, Khammam.
Yes, I have written this review!
And it was published in Andhra Bhoomi Sunday!
దూరాల చేరువలో మనం! -వి.జి

దూరాల చేరువలో... ప్రపంచ సాహిత్యం- కొన్ని పుటలు: - డా.దిలావర్,
వెల: రూ.100/-లు,
ప్రతులకు: డాక్టర్ దిలావర్,
ఎఐఐఎల్ క్యాంపస్, గాంధీనగర్, పాల్వంచ, ఖమ్మం జిల్లా- 507514.
--------------------------

దేశంలో ఎన్నారయ్ తలిదండ్రులు ఎక్కువయ్యారు. వాళ్లందరూ ఎప్పుడో ఒకసారి విదేశాలకు వెళతారు. తమ పిల్లలకు సాయపడి (ముఖ్యంగా పురుళ్లలో) నాలుగు ప్రదేశాలను చూచి తిరిగి వస్తారు. డా.దిలావర్ కూడా రెండుసార్లు అమెరికా వెళ్లారు. ఆయన అక్కడ గోళ్లుగిల్లుతూ కూచోలేదు. పుస్తకాల దుకాణాలు (బ్యార్నెస్ అండ్ నోబుల్ అనాలేమో?) లైబ్రరీలను ఆశ్రయించారు. ఆయన మాటల్లో ‘‘పరీక్షకు కూచునే విద్యార్థిలా, మిక్కిలి శ్రద్ధగా, పుస్తకాల్లో పూర్తిగా నిమగ్నమై’’ చదివారు.

దిలావర్ తెలుగు పండితులు, పరిశోధకులు, స్వతహాగా కవి. కనుక ఆయన అక్కడ ఉన్న సంవత్సర కాలంలోనూ ‘ప్రపంచ కవితను’ అందునా సమకాలీన కవితను బాగా చదివారు. పరీక్షకు గదా చదివింది! కనుక నోట్స్ రాసుకున్నారు. తిరిగి వచ్చి తెలుగులో వ్యాసాలు రాసి, వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఇప్పుడు అలాంటి 18 వ్యాసాలను ఒకచోట చేర్చి పుస్తకంగా అందించారు. పుస్తకం పేరు ‘దూరాల చేరువలో...’ ప్రపంచ సాహిత్యం, కొన్ని పుటలు అని మరో చిన్న పేరు. సాహిత్యప్రియులు, అందునా కవితా పిపాసువులకు ప్రపంచంలోని వివిధ దేశాలు కవిత ఈ పుస్తకంతో చేరువయింది.

ఇలాంటి వ్యాసాలు, ఇంత మంచి వ్యాసాలు, పుస్తకంగా వచ్చినందుకు సాహిత్యప్రియులందరూ సంతోషిస్తారు.

‘ననె్నందుకు ముందుమాట రాయమన్నాడు?’ అంటూనే ప్రఖ్యాత కవి వరవరరావుగారు ‘ప్రపంచ సాహిత్య వీధుల్లో..’అనే శీర్షికతో చాలా మంచి ముందుమాట రాశారు. అది పుస్తకం విలువను మరింత పెంచేదిగా ఉంది. వరవరరావుగారు కొన్ని మాటలు చాలు, పుస్తకం గురించి తెలుసుకోవడానికి.

‘‘ఆయన ప్రపంచ సాహిత్యాలన్నిటినీ ఒక సమాహారంగా చూసాడు. దేశ భాషా విభిన్నత్వమే తప్ప మానుష, భావ భిన్నత్వాలు లేవు.’’

‘‘సార్వజనీనమయిన మానవాంశాలు అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఇంచుమించు ఒకే తీరుగా ఉండడాన్ని ఆయన పట్టుకోగలిగాడు.

‘ఫలానా దేశంలో, ఫలానా కాలంలో మన అనుభవం వంటిదే ఉన్నదే, అనుకోవడమే దూరాలు చేరువ కావడం!’

‘వ్యాసాల్లో కవిత్వ పరిచయం కాకుండా ఉన్నవి రెండే’’

ఇక గమనించవలసిన విషయాలు మరిన్ని ఉన్నాయి. పరిచయం చేస్తున్న వివిధ భాషా కవితలను చక్కగా తెలుగులో రాసి అందించడం దిలావర్‌గారి కవితా శక్తికి ఒక నిదర్శనం.

‘ఓ క్షితిజరేఖా, ఓ కష్టతరమయిన స్వప్నమా!

అవిశ్రాంతంగా ముందుకు వెళుతూనే ఉంటావా? అన్నా

అది నా కళ్లలోని జ్వాల,

నా పలువరుసలోని మెరుపు,

నా నడుములోని వూపు,

నా పాదాలలోని సొగసు,

నేను స్త్రీ...

అన్నా, మనకు ఒక తెలుగు కవిత చదువుతున్న అనుభూతి కలుగుతుంది.

దిలావర్ మంచి కవి మాత్రమే కాదు. అనువాదకులు కూడా.

ఇక దిలావర్ స్ర్తి జన పక్షపాతి. బలహీన పక్షాల వకీలు, వేదన తెలిసిన మనిషి. స్ర్తిల సమస్యల గురించిన కవితలు ఎంచి అందించిన తీరుతో, అట్టమీద బొమ్మ అందుకు మరో ఉదాహరణ. ఆయనలోని వినయం, నిబద్ధత ‘ఆగుమాగుము తెరువరీ!’ అంటూ పుస్తకం చివరలో తన పరిచయాన్ని అందించడంతో తెలిసిపోతుంది. జపాను కవితలను గురించిన వ్యాసంలో ఆయన అలవోకగా ‘మనువులకు దేశకాలాదులతో పనిలేదు’. అని రాశారు. ‘అన్ని కాలాలలోనూ మనువులంటారని ఎంత సులభంగా, ఎంత బలంగా చెప్పారీయన’ అనిపించింది.

పాలస్తీనా, ఆఫ్రికాల కవిత, వియత్నాం, ఇరాక్, మెక్సికో, చైనా, అరబ్ మధ్యలో మవులాలీ జలాలుద్దీన్ రూమీ! ఎన్ని దూరాలు, ఈ పుస్తకంలో మనకు చేరువయ్యాయి.

అక్కడక్కడ అచ్చుతప్పులు ‘యానోభద్రా’, ‘తీన్‌మెయిన్’ తప్పలేదు. మొత్తానికి ‘దూరాల చేరువలో...’ అందరూ జాగ్రత్తగా చదవవలసిన పుస్తకం. దాంతో మనకు, ప్రపంచంతో పరిచయం పెరుగుతుంది.

Let us enjoy some good books!
&&&&&

Wednesday, December 8, 2010

Cartoon again!

Here is a cartoon after a long time!
I like these things a lot!
Can anyone tell me where the cartoon appeared originally?


Let us enjoy good works of art!
%%%%%

Monday, December 6, 2010

Ajanta Caves - A Presentation

Here is a wonderful prsentation shared by Sri Thiagarajan!
Hope you will like it!



Let us enjoy great works of Art!

Pagal Shayar - Raja Hyderabadi

Asharaju has turned into Raja Hyderabadi!
His latest volume of poems on Hyderabad is really a masterpiece!
I have written a mail with the following lines to Raju when I read the book lovingly sent by him!
Typically an old timer, Raju never saw the mail!


This is the title page of Raju's latest book.
He has perfected the art of producing lovly books!


I really do not want to translate the featured poem "I am from the old City!"!

Lest it loses it's flavour!


This is an uncorked
Bottle of perfume
Tread cautiously
Walk with love
If your foot touches it
My Hyderabad
Would spill off
Poetry would spill off
*****

Let us enjoy fine writings!
!!!!!

Sunday, December 5, 2010

Vikasam again

The Yuva suppliment of Andhra Bhoomi carries a page contributed by me.

http://www.andhrabhoomi.net/features/yuva

Here is the material from the third edition!

Vikasam!

వికాసం

నిర్వహణ : విజయగోపాల్ vijayagopalk@gmail.com

మీరు ఎటు వైపు?

November 23rd, 2010


చాలాసార్లు మనం కొన్ని విషయాలను గురించి ‘ఇది ఇలా ఉంటే ఎంత బాగుంటుంది’ అనుకుంటాము. కొందరు మాత్రం ‘అలా’ ఉంటే ఉండే పరిస్థితిని కలలుగంటూ ఊహాగానాలు, పథకాలు మొదలు పెడతారు. అలాంటి వారిని భావిజీవులు అనవచ్చు. మరోకోవకు చెందిన వారయితే భవిష్యత్తు మీకొక స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులోని అంశాలను ‘సినిమా’లాగా మీరు మనోఫలకం మీద చూడగలుగుతారు. ఆ రేపటి రూపం మిమ్మల్ని బలంగా ముందుకు కదిలేలా చేస్తుంది. కనిపించే చిత్రంలో, అంటే మీ భవిష్యత్తులో ఏముంటుంది? అన్న వివరాలు మీ శక్తి యువక్తుల మీద ఆధారపడతాయి. ఊరికే కలలుగంటే కుదరదు. మీకున్న బలమేమిటి? ఆసక్తి ఎంత? అనే ప్రశ్నలను ముందుగా గుర్తుంచుకోవాలి. ఆలోచన ఆచరణగా మారాలి. అప్పుడే అనుకున్న మంచి ప్రపంచం, మంచి జీవితం, మంచి మనుషులు, మంచి హంగులు సమకూరే వీలు ఉంటుంది. భావి జీవిని ఈ హంగులన్నీ ముందుకు కదిలిస్తాయి. కనుకనే అవన్నీ సమకూరుతాయి. కూడా!


రానున్న కాలం గురించిన కలలకన్నా, కావలసిన పరిస్థితుల గురించి వివరాలతో సహా ఒక దృష్టి ఉండడం అవసరం. అప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం బాగులేక పోయినా సరే ఫరవాలేదు. తోడుగా ఉండవలసిన వాళ్ళు ఎంత నిరాశపరులు ‘ఆఁ! ఏముందిలే!’ అనే వాళ్ళూ అయినా ఫరవాలేదు. మీరు మాత్రం మీ భవిష్యత్తు గురించిన వివరాలను చూడగలుగుతారు. ఆ వివరాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ ఉత్సాహం, పట్టుదల మరింత మందికి ఉత్సాహాన్ని, పట్టుదలనూ పంచగలుగుతుంది.


అంటువ్యాధులకన్నా సులభంగా ఇతరులకు సోకే శక్తి ఉత్సాహానికి ఉంది: మిగతా వాళ్ళంతా మీరు కలగన్న వివరాలను వినాలని ముందుకు వస్తారు. అందరికీ ఆలోచనలు రావు! ‘హద్దులను మరింత ముందుకు నెట్టడం అందరికీ చేతగాదు. మీ ఆశలతో ఒక చిక్కుంది. మీరు వాటిని సులభంగా సాధించగలరు. ఆ తర్వాత మరేమీ లేదనుకుంటారు! అదే చిక్కు!’ అంటారొక పెద్ద మనిషి.


భవిష్యత్తు గురించిన మీ చిత్రాన్ని మరింత మందికి మీరు చూపించగలిగాలి. ఆ వివరాలను వర్ణించి చెప్పే శక్తి మీలో ఉండాలి. మీ నమ్మకం, ఉత్సాహం మరింత మందికి అంటుతుంది.


‘ఆపని వీలు కాదంటే నేను నమ్మలేను. అయితే ఆ పని ఇదివరకు ఎవరూ చేసి ఉండకపోవచ్చు. మనం ప్రయత్నించి చూస్తే పోతుంది’ అనగలిగి ఉండాలి.


ఒక పనిని గురించి అదికష్టం, కనుక అసాధ్యం అనడం ఒక పద్ధతి. అదే పని గురించి ‘అది కష్టం కావచ్చు. కానీ అసాధ్యమని ఇప్పుడే అనడంలో అర్థం లేదు!’ అనడం భావిజీవి పద్ధతి! అటో, ఇటో తేల్చుకోవాలి. ఒకేచోట ఉండిపోకూడదు. ఏదో ఒక వేపు కదలాలి! ఎటు కదలుతారు? భావిజీవితం వైపే కదూ...

====================

అదీ కళే!

ఎపిక్టెస్ మొదటి శతాబ్దిలో రోమ్ నగరంలో ‘వెట్టి’ పని చేశాడు. తరువాత విముక్తి పొందాడు. తన చుట్టు చేరిన వారికి తత్వం గురించి బోధించేవాడు.

ఒకతను ఆయ దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీ మాటలను వినాలని ఎన్నోసార్లు వచ్చాను. ఫలితం అందలేదు. దయచేసి ఏమయినా చెప్పండి’ అని అడిగాడు.

‘మాట్లాడడమంటే, అన్ని పనులలాగే అంత సులభం అనుకున్నావా? ఆ మాటలు సరిగా ఉండాలి. ఎదుటివారికి పనికిరావాలి కదా!’ అన్నాడు ఎపిక్టెటస్.

‘అవున’న్నాడు ఆగంతకుడు.

‘అందరూ విన్న విషయాలతో లాభం పొందుతారా? లేక కొందరేనా? మాట్లాడడం ఎంతటి కళనో, వినడమూ అంతే కళగా తోస్తుంది నాకు. ఒక విగ్రహానికి రూపు పోయాలంటే నైపుణ్యం ఉండాలి. ఆ విగ్రహాన్ని సరిగా చూచి ఆనందించడానికీ నైపుణ్యం ఉండాలి మరి!’ అన్నాడు ఎపిక్టెటస్ జవాబుగా!

-గోల్డెన్ సేయింగ్స్ ఆఫ్ ఎపిక్టిటస్ నుంచి

======================

భయం...

‘పడిపోతామని, విఫలులవుతామని, దొరికిపోతామని


భయపడుతూ బతుకుతుంటే


ఆ బతుకు మోయలేని బరువవుతుంది’

==============================

అందరూ గెలవాలి

అమెరికాలోని మరీన్ కౌంటీ, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల మధ్యన, ‘గోల్డెన్ గేట్’ అనే వంతెన నిర్మించారు. వంతెన నిర్మాణం ముగిస్తే ప్రయాణాలు సులభంగా జరుగుతాయని రెండు వేపులవారూ ఎదురు చూశారు. మరో రెండు వర్గాలు కూడా వంతెన నిర్మాణంలో ఆసక్తి కనబరిచారు. వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నవారు ఒక వర్గమయితే, వారిలో ఎవరయినా ప్రమాదానికి గురయి చనిపోతే, ఆ చోట తమకు పని దొరుకుతుందని వేచి చూసిన వారు మరో వర్గం! ఈ రెండవ వర్గంవారి ఎదురు చూపులు సులభంగానే ఫలించినట్లున్నాయి. గోల్డెన్ గేట్ వంతెన మొదటి దఫా నిర్మాణంలో భద్రత ఏర్పాట్లు ఏవీ చేసినట్లు కనబడదు. కనుక ఇరవై ముగ్గురు పనివారు ప్రమాదవశాత్తు పడిపోయి మరణించారు. చివరకు తేరుకున్న అధికారులు లక్ష డాలర్ల ఖర్చుతో వంతెన కింద ఒక పెద్ద వలను ఏర్పాటు చేశారు. ఆ వల కారణంగా కనీసం పదిమంది ప్రాణాలు నిలిచాయి. 24 శాతం పని ఎక్కువ జరిగినట్లు కూడా లెక్క తేలింది. అది వల ఖరీదుకన్నా ఎన్నో రెట్లని కూడా లెక్కవేశారు. ఎవరో చనిపోవాలని చూసిన వారికి తప్ప, అందరికీ సంతృప్తి కలిగింది. అనుకున్నదానికన్నా తక్కువ ఖర్చుతో వంతెన తయారైంది. పనివాళ్లూ బాగా పనిచేసి జీవనం సాగించగలిగారు!

==============================

నిర్మొహమాటంగా..

మంచివారు అనిపించుకోవాలంటే, ఎవరు ఏం చెప్పినా ‘అవును’ అనాలని కొందరు అనుకుంటారు. కాదు, లేదు అని జవాబు చెప్పవలసిన ప్రశ్నలకు ఆ రకంగా చెప్పడం మొరటుతనమని కూడా చాలామందికి అభిప్రాయం ఉంటుంది.

ఇంట్లో, సమాజంలో, పనిచేసే చోటా, మనకు అనుకూలం కాని పరిస్థితులు చాలా ఎదురవుతాయి. మొహమాటం కొద్దీ అన్నింటికీ అవునంటుంటే మనమీద ఒత్తిడి ఎక్కువవుతుంది!

‘అవును, కాదు’ అంటూ మన స్వంత భావాలను చెప్పగల స్వతంత్రం మనకుంది. అప్పుడే మన హక్కులు మనకు మిగులుతాయి. మన భావాలు పదిమందికీ తెలుస్తాయి. మన అవసరాలు మనకు అందే వీలు కలుగుతుంది. మన దృక్పథం అందరికీ అర్ధమవుతుంది. మన సినిమా కథల తీరు ఒక్కసారి మనసులో విశే్లషించి చూడండి. నిత్య జీవితంలో మనం గురవుతున్న ఒత్తిడికి కారణాలను వెదికి చూడండి. చెప్పవలసిన ‘ఒక్క’ విషయాన్ని చెప్పకపోవడంవల్ల అంత కథ నడుస్తుంది. ఇంత అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి, చెప్పవలసిన విషయాన్ని వినయంగానే చెప్పగలగాలి. మీకు ఇప్పటికే ఆఫీసులో పని ఎక్కువయింది. బాగా పనిచేసే వారికే మరింత పని చెపుతారన్నది అందరికీ తెలిసిన సంగతే. మీకూ అదే జరిగింది. మరింత పని తలమీద వేశారు. మంచితనం పేరిట, ఆ భారాన్ని కూడా తలకెత్తుకుని సతమతమవుతారా? అలా చేస్తే ఏ పనినీ సక్రమంగా చేయలేకపోతారేమో?

మీకు తీపి తినడం ఇష్టంలేదు. వాళ్లేమో అదేపనిగా తీపి వడ్డిస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ మీరు మీ మనసును గౌరవంగా బయటపెట్టగలగాలి. అందులో ఏరకమయిన అపరాధ భావన అవసరంలేదు. అవతలివాళ్లు ఏమనుకుంటారోనన్న అనుమానం అవసరంలేదు! ఏమో? అర్ధం చేసుకుంటారేమో? ఆ అవకాశం కూడా ఉందిగదా?

మీ నిర్ణయాలు మీరు నిర్మొహమాటంగా చేయండి.
మీ దగ్గర పనిచేసే వారికీ, పిల్లలకూ నిజం చెప్పడం అవసరం.
మీపై అధికారులకు పెద్దలకూ మీ మనసు విప్పి చెప్పండి.
మీతోపాటు పనిచేసే వారికీ మీ మనసు తెలిస్తే మంచిది.
మీ సాయం కోరి వచ్చేవారితో మొహమాటం పెట్టుకోవద్దు!

మిత్రులు, కుటుంబంలోని వారితో కూడా అసలయిన భావాలను తేల్చి చెప్పగలగాలి! మనుషులందరిలోను మంచి ఉంది. ఆ మంచి పెంచే అవకాశాలను మనం చేజేతులా వదులు కోకూడదు. **

Let us enjoy some good thoughts!
$$$$$$

Friday, December 3, 2010

Medha -5

Visit the Medha page in Andhrabhoomi.

Medha Page

Here is the contnt form the fifth edition.

వేడి, వెలుగు, కదలిక


November 14th, 2010

స్విచ్ వేస్తే లైటు వెలుగుతుంది. ఇస్ర్తి వేడెక్కుతుంది. టీవీలో బొమ్మ వస్తుంది. మరోటి పాడుతుంది. ఎలెక్ట్రిసిటీ, (మనకు అలవాటయిన పేరు కరెంటు) లేకుంటే జగము చీకటి, బ్రతుకు భారం! కానీ యింతకూ కరెంటు ఎట్లా పని చేస్తుందో తెలుసా? విద్యుత్తుతో పనిచేసే ఏ పరికరమయినా సరే, స్విచ్ వేయగానే ఒకటి మాత్రం తప్పకుండా జరుగుతుంది. తీగల్లోని ఎలక్ట్రానులన్నీ వరసలో ఆడడం మొదలు పెడతాయి. అందుకే దానికి కరెంటు, విద్యుత్తు ప్రవాహం అని పేరు. ఆ రకంగా ఎలక్ట్రానులు వరుసగా ఆడుతుంటే అక్కడ వేడి పుడుతుంది. అంతకన్నా ఆశ్చర్యంగా తీగ, అయస్కాంతంగా మారుతుంది. వేడితో బల్బులు వెలుగుతాయి. ఇస్ర్తి, గీజరు వేడెక్కుతాయి. ఇక అయస్కాంతం కారణంగా రకరకాల కదలికలు వీలవుతాయి. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని రకరకాల పరికరాలన్నీ విద్యుత్తుతో పనిచేస్తాయి. తీగలన్నీ లోహాలతో తయారవుతాయి. లోహాలలో వేడి ఎలక్ట్రానులుంటాయి. ఆ ఎలక్ట్రానులను ఒక క్రమంలో పెట్టగలిగితే అది కరెంటు అవుతుంది. ఈ పని బ్యాటరీతో జరిగే కదలిక నెగెటివ్ నుంచి పాజిటివ్ ధృవం వేపు ఒకేరకంగా జరుగుతుంది. కనుక దాన్ని డైరెక్ట్ కరెంట్ (డీసీ) అంటారు. మామూలు కరెంటులో ఈ దిశ సెకండుకు వందసార్లుగా అటుయిటుగా మారుతూ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు పరుగు పెట్టనవసరం లేదు. ఒకే చోట ఉండి, అటుయిటు కదులుతుంటే చాలు. అన్ని ఎలక్ట్రానులు, కవాతు సైనికుల లాగ ఒకడుగు ముందుకు, ఒకడుగు వెనక్కు వేస్తుంటాయి. (కవాతు సైనికులకు ఈ వెనకడుగు ఉండదు లెండి!) అందుకే దీన్ని ఆల్టర్నేట్ కరెంట్ (ఎసీ) అంటారు. తీగను ఒక క్రమంలో ఏర్పాటు చేసిన వలయాన్ని సర్క్యూట్ అంటారు. అందులో ఎలక్ట్రానులను ఒక క్రమంలో పనిచేయించడమే కరెంట్. అయితే మరి రకరకాల పనులెట్లా జరుగతాయి? వేడి: కరెంటు కదులుతుంటే ఏ తీగలయినా కొంత వేడుక్కుతాయి. ఎలక్ట్రానులు మిగతా అణువులతో గుద్దుకోవడమే యిందుకు కారణం. రాగి తీగలో ఈ వేడి తక్కువ. పరుగులెక్కువ. ఇక పరికరంలో వేడి కావాలంటే రాగితో బాటు నికిల్ లాంటి లోహాలను వాడితే సరి. గుద్దులాట, వేడి! కావలసినంత ఏర్పాటవుతుంది. టోస్టర్లు, హేర్ డ్రయర్లతో నికెల్, క్రోమియం కలిపిన తీగలను వాడుకుంటారు. బల్బుల్లో తీగ వెలుగుతుంది కూడా! తక్కువ వేడిమిలో ఎక్కువ వెలుగునిచ్చే వాయువులను వాడి ట్యూబ్ లైట్లను పనిచేయిస్తారు. అది వెలుగు విషయం. విద్యుత్తు పరికరాలతో వేడి, వెలుగు పుట్టించడం ఒక పద్ధతయితే, కదలికను పుట్టించడం మరో పద్ధతి. అందులో ‘మోటార్’ అనే మరో భాగం ఉంటుంది. వీటితో వేలాది రకాల యంత్రాలను పనిచేయిస్తుంటారు. కానీ, వాటిల్లో విద్యుత్తువల్ల జరిగేది ఒకే పని. అది ‘మోటార్’ తిరగడం. ఆ తిరిగే మోటార్‌కు రెక్కలు బిగిస్తే ఫ్యాను, మరోటి బిగిస్తే పిండిమర, వాషింగ్ మిషన్, ఎన్నయినా!


మరి కదిలే ఎలెక్ట్రానులే మోటార్‌ను తిప్పుతాయా? అసలు తిప్పవు! అవి తీగలను అయస్కాంతాలుగా మారుస్తాయి.


ప్రతి ఎలక్ట్రానూ ఒక అయస్కాంతమే. అవి జంటలుగా ఉండేసరికి తత్వం తెలియకుండా పోతుంది. ఇనుములాంటి లోహాల్లో, జంటలు పోగా, విడిగా కొన్ని ఎలక్ట్రాన్లుంటాయి. అవన్నీ ఒక దిక్కుకు తిరిగే సరకి, ఆ యినప ముక్క అయస్కాంతం అవుతుంది. దాంతో సూదిని ఆకర్షించడం అంటే సూదిలోని ఎలక్ట్రాన్లను ఆకర్షించడమని అర్థం! మొత్తానికి ఎలక్ట్రానుల వల్ల అయస్కాంతాలు పుడతాయి. ఒక లోహంలోకి విద్యుత్తు కరెంటును పంపితే అది తాత్కాలికంగా విద్యుదయస్కాంతగా మారుతుంది. అయస్కాంతంగా మారిన తీగను ఒక యినుప ముక్కకు చుడితే గట్టి అయస్కాంతం తయారవుతుంది.


రెండు అయస్కాంతాల చివరలను ఒకచోట పెడితే అవి దూరం జరుగుతాయి. సరిగ్గా ఈ అంశాన్ని ఆధారం చేసుకునే మోటార్లను పనిచేయిస్తారు. అక్కడ అయస్కాంతాలు ఒకదాని నుంచి మరోటి దూరంగా పోయే వీలు లేదు. కరెంటు ప్రవాహం మొదలవగానే అంటే స్విచ్ వేయగానే తీగ అయస్కాంతం అవుతుంది. లోపలి ఏర్పాటు కారణంగా కరెంటు ఆగేవరకు, ఎలక్ట్రో మాగ్నెట్ గిరగిరా తిరుగుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయగానే తిరగడం ఆగిపోతుంది. తోసేందుకు విద్యుత్ ఉంటేనే గాలి, తీగల్లో, లోహం ముక్కల్లో ఎలక్ట్రానులు కదలవు. కరెంటు లేకుంటే అవి అయస్కాంతాలు కావు. అయస్కాంతం లేకుంటే కదలికా లేదు. మోటార్ తిరగదు. మోటార్‌కు బెల్టులు, గేర్లు పెట్టి రకరకాల యంత్రాలను పనిచేయిస్తారు. ఫ్యాన్‌గానీ, విద్యుత్తు రైలుగానీ, పెద్ద ఫ్యాక్టరీలో యంత్రాలు గానీ, అంతటా ఇదే పద్ధతి. కొంతకాలం కండరాల శక్తి యంత్రశక్తి అయింది. తరువాత ఆవిరితో యంత్రాలు కదిలాయి. ప్రస్తుతం కరెంటుతో కదులుతున్నాయి. అందుకే కరెంటు లేకుంటే వేడీ, వెలుగూ, కదలికా వుండవు. జగము చీకటి, బతుకు భారం అవుతుంది మరి!

వజ్రం అంటే ఏమిటి?

November 14th, 2010

ఈ ప్రశ్నకు ఒక్కమాటలో జవాబు చెపితే, విషయం తెలియని వారికి ముందు చిత్రంగా తోస్తుంది. కార్బన్ అనే రసాయనం ఒకటి ఉంది. అది రకరకాల రూపాలలో ఉంటుంది. చాలా కొన్ని రసాయనాలు మాత్రమే అలా రకరకాల రూపాలలో ఉంటాయి. మనకు బాగా తెలిసిన కార్బన్ రూపం బొగ్గు. రెండవది పెన్సిళ్ళలోనూ, బ్యాటరీ సెల్స్ మధ్యలోనూ ఉండే గ్రాఫైట్. ఇక మూడవది వజ్రం. బొగ్గు, వజ్రం ఒకటేనంటే ఎవరికయినా చిత్రంగానే అనిపిస్తుంది. కానీ వాటి అణువుల ఏర్పాటులో తేడా కారణంగా ఈ వస్తువుల భౌతిక లక్షణాలు పూర్తి వేరువేరుగా ఉంటాయి. బొగ్గుకు ఉండే ఏ ఒక్క లక్షణమూ వజ్రానికి లేదు. గ్రాఫైటు సంగతి కూడా అంతే. ఇది రసాయన ప్రపంచంలోనే ఒక విచిత్రం!


వజ్రాలు వాటి గట్టిదనానికి పెట్టింది పేరు. అందుకే నగలు, అలంకరణలతో బాటు, కొన్ని రకాల వజ్రాలను పరిశ్రమల్లో కూడా వాడతారు. ఉదాహరణకు గాజుపలకలు, అద్దాలను ముక్కలుగా కోసేందుకు వాడేది ఒకరకం వజ్రం ముక్క. అది ఉంగరాలలోకి చేరగల మేలిమి జాతి వజ్రం కాదు. యంత్రాలలో, గడియారాలలో కదిలే భాగాలు అరిగిపోకుండా చేతి గడియారాలలో కొన్ని జ్యుయెల్ వాడుతున్నామని ప్రకటించేవారు కదిలే భాగాల క్రింద ఎన్ని జ్యుయెల్స్ ఉంటే గడియారం అంత బాగా మన్నుతుందని లెక్క. ఆ జ్యుయెల్స్ కూడా చవకరకం వజ్రాలే. మొత్తానికి మనిషికి తెలిసిన పదార్థాల్లో అన్నిటికన్నా గట్టిది వజ్రం. ఈ ప్రపంచానికి వజ్రాలను పరిచయం చేసింది భారతదేశమని చెపితే మరింత చిత్రంగా తోస్తుంది. గోల్కొండ, ప్రపంచంలోనే పేరు పొందిన వజ్రాల మార్కెట్‌గా గుర్తింపు పొందిందంటే మరింత చిత్రంగా ఉంటుంది. 18వ శతాబ్ది తర్వాత మాత్రమే మిగతా ప్రపంచంలో వజ్రాలు దొరకడం మొదలవుతుంది. దక్షిణ ఆఫ్రికాలో, 1866లో ఆరెంజ్ నది పక్కన ఒక బాబుకు ఒక మెరిసే రాయి దొరికింది. తర్వాత అది 21 కేరట్ల మేలిమి వజ్రమని తెలిసింది. ఇక ఆ ప్రాంతంలో వజ్రాల వేట మొదలయింది. మెరుపు, పరిమాణం ప్రకారం ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వజ్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కులినాన్, కోహినూర్ అన్నవి ముఖ్యమయినవి. గ్రేట్ మొగల్ అనే పేరుగల 240 క్యారెట్ల వజ్రం ఒకటి ఉండేదట. అదిప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. 106 క్యారట్ల బరువు ఉండే కోహినూర్ వజ్రం అందులోని భాగమే నంటారు కొందరు. వజ్రాల కొలత క్యారెట్ 0.2 గ్రాములకు సమానం.

కాంతి - కొన్ని సంగతులు

November 14th, 2010

కాంతి వేగం సెకండుకు 1,86,2824 మైళ్ళు. కానీ ఆ వేగంతో కదల గలిగేది శూన్యంలో మాత్రమే. వజ్రంలో ప్రవేశించిన కాంతి వేగం సెకండుకు 77,500 మైళ్ళకు పడిపోతుంది.


మన కళ్ళ నుంచి వెలుగు పుడుతుంది. అందుకే మనకు వస్తువులు కనబడతాయి అనుకున్నాడు తత్వవేత్త ప్లేటో!


ప్లేటో ఆలోచనల్లో కొంత నిజం ఉంది. మానవశరీరాలలో వెలుగు ఉంది. అది మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అన్నిటికన్నా బాగా వెలిగే భాగాలు, బుగ్గలు పెదవులు, ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు ఈ వెలుగుకు కారణం.


సముద్రంలో 1500 అడుగులకన్నా లోతున జీవించే జంతువులలో 90 శాతానికి స్వయంగా వెలిగే లక్షణం ఉంటుంది. అక్కడ ఇదొక్కటే వెలుగు ఉంటుంది మరి!


కాంతికి ద్రవ్యరాశి లేదు. కానీ కదలిక ఉంది!


అపోలో వ్యోమగాములు చంద్రుని మీద కొన్ని అద్దాలను వదిలి వచ్చారు. వాటి నుంచి తిరిగి వస్తున్న లేజర్ కిరణాల ఆధారంగా, చంద్రుడు భూమి నుంచి ఏటా ఒకటిన్నర అంగుళం దూరం కదలుతున్నాడని లెక్క చేల్చారు.



భూమి - అంకెల్లో!

భూమి వయసు: 4.6 బిలియన్ సంవత్సరాలు


ద్రవ్యరాశి: 13, పక్కన 24 సున్నాలు వేసినన్ని పౌండ్లు


భూగోళం దగ్గర చుట్టు కొలత: 24,901 మైళ్ళు


ధృవాల మీదుగా చుట్టు కొలత: 24,818 మైళ్ళు


నేలమీద అన్నిటికన్నా లోతుగా తవ్విన గుంట లోతు:


40,226 అడుగులు


(దీన్ని రష్యాలోని కోలా పెనిన్సులా తవ్వారు)


భూమి లోపల ఉందనుకుంటున్న వేడి:


12,600 డిగ్రీలు ఫారన్ హైట్


(ఇది సూర్యుని ఉపరితలం వేడికన్నా ఎక్కువ!)



నాభి.. గరిమనాభి

November 14th, 2010

నారీస్తనభర నాభీదేశం, మెహావేశం కలిగిస్తుందని హెచ్చరించారు ఆది శంకరులు. పరిశోధకులు మాత్రం, నాభికి, గరిమనాభికి, పరుగు పందాలు, ఈత పోటీల్లో గెలుపులకు సంబంధాలు ఉన్నాయంటున్నారు.


పరుగుల పోటీల్లో, ఈతపోటీల్లో గెలిచే వాళ్ల శరీర నిర్మాణం గురించి వంద సంవత్సరాల రికార్డులన్నీ తవ్వి తీసిన పరిశోధకులు, ఒక కొత్త సంగతి తెలుసుకున్నారు. పోటీలో పాల్గొనే వాళ్ళ ఒడ్డూ పొడుగులతో బాటు వాళ్ళ శరీరంలో ‘బొడ్డు’కు ముఖ్యపాత్ర ఉందంటున్నారు. బొడ్డులోతుగా ఉందా, ఉబ్బెత్తుగా ఉందా అన్నది కాదు ఇక్కడి సమస్య. మొత్తం శరీరంతో పోలిస్తే బొడ్డు ఎక్కడ, ఎంత ఎత్తుదగ్గర ఉందన్నది ముఖ్యమట. ఇంటర్‌నేషనల్ జర్నల్ ఆఫ్ డివిజన్ అండ్ నేచర్ అండ్ ఈకోడైనమిక్స్ అన్న పత్రికలో ఈ విషయం ప్రచురించారు.


శరీరం గరిమనాభి. నాభిదగ్గర ఉంటుంది. పరుగు పోటీలో, ఈత పోటీలో ఒకే ఎత్తుగల ఇద్దరు వ్యక్తులు పాల్గొంటున్నారు అనుకుందాం. అందులో ఒకరు ఆఫ్రికా, మరొకరు యూరపు నుంచి వచ్చిన వారు అనుకుందాం. అసలు వాళ్ళ ఎత్తు గురించి పట్టించుకోనవసరం లేదు. వాళ్ళ బొడ్డు నేల నుంచి ఎంత ఎత్తున ఉందన్నది పట్టించుకోవాలి. అది శరీరం తాలూకు గరిమనాభిని నిర్ణయిస్తుంది. శరీర నిర్మాణం పద్ధతులను బట్టి, యారపువాళ్ళు కన్నా ఆఫ్రికన్ వారిలో బొడ్డు కొంచెం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అందుకే ఆఫ్రికావాసులు పరుగుల పోటీల్లో ఎక్కువగా గెలుస్తుంటారు. (ఆఫ్రికావాసులు అనడం కన్నా ఆఫ్రికన్ జాతివారు అనడం సమంజసంగా ఉంటుంది).


యూరోపియన్ క్రీడాకారులకన్నా, ఆఫ్రికన్ వారికి కాళ్ళు ఎక్కువ పొడుగ్గా ఉంటాయి. అంటే వాళ్ళ బొడ్డు కనీసం మూడు సెంటిమీటర్లు ఎక్కువ ఎత్తున ఉంటుంది. ఆ రకంగా ఆఫ్రికావారికి కనబడని ఎత్తు శరీరానికి కలిసినట్టు లెక్క. అది 3 శాతం ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. దానివల్ల వాళ్ళకు అదనంగా వేగం వీలవుతుందట. ‘ముందుకు కదలడమంటే, ముందుకు పడిపోవడమే. మరి ఎంత ఎత్తు నుంచి పడితే అంత వేగంగా పడతాం కనుక ఎత్తయినవారు వేగంగా ముందుకు కదులుతారు’ అంటారు డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రొ. ఆంద్రే బెజాన్. ఆఫ్రికా జాతుల వారి పరుగుల రహస్యం అదన్నమాట.


ఇక ఈత కొలనులో పోటీ మరోరకంగా ఉంటుంది. అక్కడ యూరోపియన్ రకం శరీరాలకు అడ్వాంటేజ్ ఉందంటున్నారు బొడ్డుకన్నా పైభాగం శరీరం ఎక్కువ పొడవుండడం. అందుకు కారణం అంటే శరీరంలో బొడ్డు, తక్కువ ఎత్తులో ఉంటే ఈత బాగా కుదురుతుందని అర్థం! ‘శరీరంతో అలలను పుట్టించి, ఆ అలలమీద తేలుతు ముందుకు వెళ్ళడమే ఈత’ అంటారు బేజన్. అంటే, ఎంత పెద్ద అలను పుట్టించగలిగితే అంత వేగంగా, నీటిమీద ముందుకు సాగవచ్చునని అర్థం! శరీరంలో పై భాగం ఎంత పెద్దదయితే అంత పెద్ద అలను పుట్టించవచ్చు. ఇందాకటి లెక్కల ప్రకారం యూరోపియనుల శరీరంలో పైభాగం మూడు శాతం ఎక్కువ. అంటే వాళ్లవేగం కూడా అంత ఎక్కువేగదా! ఒకే ఎత్తున్నా, బొడ్డు తక్కువ ఎత్తున ఉన్న వాళ్ళు బాగా ఈదగలుగుతారని తేలింది.


ఆఫ్రికన్‌లు పరుగు పందాలలో, యూరోపియనులు ఈతకొలనులో విజయం సాధించడం వెనుక ఇంతటి రసహ్యం ఉందన్నమాట. ఇక మరి ఆసియావాసుల సంగతేమిటి? ఆసియావారికి కూడా యూరపు వారికి లాగే కాళ్ళకన్నా, శరీరంలో పై భాగమే ఎక్కువట. ఆ రకంగా ఇక్కడి వారు ఈతలకు బాగా పనికివస్తారని చెప్పవచ్చు. కానీ యూరోపియనులు సాధారణంగా ఎత్తరులు. గనుక ఆసియనులు వాళ్ళతో పోటీలో గెలవడం లేదు. ఇంతకాలం ఈ ‘బొడ్డు’ విషయం ఎందుకు రహస్యంగా ఉండిపోయిందో తెలుసా? నల్లజాతివారు పరుగులకు, తెల్లజాతివారు ఈతకు అంటూ జాతి గురించి చెప్పవలసి వస్తుందని, పరిశోధకులంతా ఈ అంశానే్న ఎత్తుకోలేదంట.


‘‘మేము క్రీడాకారుల ప్రాంతం. శరీర నిర్మాణం గురించి పట్టించుకున్నాము. వారి జాతి గురించి కానే కాదు’’ అంటున్నారు. బేజన్ బృందంవారు. వాషింగ్టన్‌లని హోవర్డ్ యూనివర్శిటీ ప్రొఫెర్ ఎడ్వర్డ్ జోన్స్, మరొక విద్యార్థి జోర్డన్ ఛార్ల్స్ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.

Let us enjoy Science!
!!!!!


Sukumar Prasad - Guitar

Shravanam with a western touch!

Sri Sukumar Prasad on Guitar


Let us enjoy great music!
@@@@@

Thursday, December 2, 2010

Photographs

Bad photos no doubt!
But people are so good!



Turaga Janakirani Garu at her birthday party!


Siva Reddy Garu


Padma, Kodavatiganti Varudhini garu and Abburi Chayadevi Garu and Kalipatnam Rama Rao Garu


Arani Neelakantha Jagannadha Sharma

Photos are photos, good or bad!
%%%%%