I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Sunday, June 7, 2026
లోకాభిరామం : తోలుబొమ్మలాట
లోకాభిరామం : తోలుబొమ్మలాట
తోలుబొమ్మలాట మా ఊరు పాలమూరు అనే మహబూబ్ నగరానికి
దగ్గరగ ఉన్నది. కనుక మా దగ్గర పోరగాండ్లకంత సీన్మ చూడడం బాగ అలవాటు. సీన్మకు వోదమా
అన్నది ప్రశ్న అయితే నాతానైతే దుడ్లులేవు.
ఇయాల నీవు వెట్టు. మల్ల వొయినప్పుడు నేను వెడుత,
అంటూ సాగేవి. అయినా ఆ సినిమాలు అందరికీ
అర్ధ్థమవుతయి కనుకనా. లవకుశ లేదంటే ఓ మైరావణ వంటి సినిమా వస్తే అందరికీ అర్థమవుతుంది.
రాము అని ఒక సీన్మ వచ్చింది. అందులో ఒక తండ్రి, తల్లిలేని పిల్లగాణ్ణి పెంచునేందుకు
నానా యాతన వడతడు. ఎద్దులబండ్లు కట్టుకుని వల్లెలనుంచి కూడ మనుషులు వచ్చి ఆ
సినిమాను చూసి చేతనైనంత ఏడ్చి ఎళ్లిపొయినరు. అంతేగాని మరేవో పిచ్చి సీన్మలు వస్తే
అవి అర్ధం అయి చావవు గద! కనుకనే వల్లెలో చిరుతల రామాయణం అంటాని
ప్రతిరాత్రి కాలక్షేపం కొంతకాలం గడిచింది. బైండ్ల కథలు, జముకుల కథలు లాంటి వినోద కార్యక్రమాలు గూడ
పల్లెలో వుష్కలంగ ఉండేటివి. ఇక ఏనుగొండ అనే మా వల్లెకు మరింత ప్రత్యేకత ఉంది. బోగమాట
అనే వీధినాటకం మాపల్లెలో
బాగ పెరిగింది. కేశవయ్యగారు అనే ఒక పెద్దమనిషి వీధి నాటకాలు రాసేవాడు. వాటికి వరుసలు
కట్టేవాడు. అవసరమైన దుస్తులు కుట్టేవాడు. కిరీటాలు,
భుజకీర్తులు తయారు చేసేవాడు. ఈ రకంగా ఆయన
ఒకే మనిషి అన్ని కళలకు కేంద్రంగా ఉండి, ఊళ్లో
పిల్లలను, పిల్లలేనేమి
పెద్దలను గూడ చేరదీసి బోగమాట నేర్పించెటోడు. మూడున్నర వజ్రం అని ఒగ ఆట ఉండేది.
దాని అస్సలు పేరు కృష్ణగారడీ. అటువంటి ఆట నుంచి మొదలు మా ఊర్లె గూడ లవకుశ ఆడేవాండ్లు.
బబ్రువాహన ఆడేవాండ్లు. ఎన్నెన్నో కథలు ఆడేవాండ్లు. పండుగ లేక ఎవరన్న పెద్దఇంట్లో
పెండ్లిగాని వచ్చిందంటే ఊళ్లో కేంద్రంలో బోగమాట ఏర్పాటు అవుతుంది. దానికి కావలసిన
ఖర్చును ఎవరో ఒకరు భరిస్తరు. ఫలానివాండ్లు ఆట చెప్పినరు అని ఊరంతా పాకి పోయేది. ఇక
రాత్రంతా కూసోని ఆట చూచేందుకు అందరు సిద్ధం. ఇది ఇట్లుండంగ చిన్నప్పుడు నేను అప్పుడో
ఇప్పుడో తోలుబొమ్మలాట చూసిన గుర్తు. ఈ
తోలుబొమ్మలాట వాండ్లు స్థానికులు కాదు. రాయలసీమ నుంచి వస్తరని
తరువాత తరువాత తెలిసింది. ఈ ఆటకు పెద్ద గుడారం అవసరం లేదు. ఆడేవాళ్లు మాత్రం గుడ్డలతోటి తడుకలతోటి ఒక
గది వంటిది కడతరు. దానికి ఒక వైపున బట్టతో తెర ఏర్పాటు చేస్తరు. ఆ లోపల కళాకారులు ఉంటరు. వాళ్ల దగ్గర
ఇంచుమించు మనిషి ఉండేటంత ఆకారంలో ఉండే బొమ్మలుంటయి. ఆ బొమ్మలను కర్రల సాయంతోని తెరమీద
అదిమివట్టుకుని వెనకనుంచి పడే ఎలుతురులో ఆ బొమ్మలు తెర మీద కనిపించేటు చేసి ఆట
సాగించేవాండ్లు. చక్కగ పాటలు డైలాగులు గూడ ఉంటయి. తోలుబొమ్మలాటలో భారతం కన్న
రామాయణం ఎక్కువ చూసినట్లు గుర్తు ఉంది. హనుమంతుడు వస్తడు. దశకంఠుడు వస్తడు. అతని
ముందు ఆంజనేయుడు తోక చుట్టుకోని అల్లంత ఎత్తున ఎక్కి కూర్చుంటాడు. రావణునికి పది
తలలు ఉంటయి. తెరమీద సగం వెడల్పు అతనే కనిపిస్తడు. అంత ఎత్తు కూడా ఉంటడు. వెనుక వాండ్లు
పాటలు పాడుకుంటు కింద పెట్టిన సానరాళ్ళ మీద కాలితోటి దరువులు ఏసుకుంటు చక్కగ కథను
రక్తి కట్టించేవాండ్లు. హనుమంతుడు ఏసిన కుప్పిగంతులు వాళ్లు తెర మీద చూపించిన తీరు
ఏంతో ప్రత్యేకంగ ఉండేది. నాకు నిజానికి వాళ్లు పాడిన పాటలు జ్ఞాపకం లేవు. అయితే తోలుబొమ్మలాట
లోని ఒక అంశం మాత్రం గట్టిగ గుర్తు ఉన్నది. హాస్యం పేరిట తోలుబొమ్మలాటలో మధ్యన అత్త, పిల్లోడు అని రెండు పాత్రలు వస్తయి.
పిల్లోడు అనే అల్లుని చేత అత్త పని చేయించాలంటని ప్రయత్నిస్తుంది. గడ్డి
తీసుకు రమ్మంటది. తిండి ఆశ పెడుతది. తాటి బెల్లం,
తమిద రొట్టెలు పెడత అయ్య పోరా గడ్డికి, మా అయ్య పోరా గడ్డికి అంటుంది. వాడు
ఆమెకు అయ్య కాదు. వాని ద్వారా నాటకంలో బండ బూతులు పలికించేవాండ్లు. ఆ కాలంలో హాస్యం అంటే
బూతు లేకుండ గడిచేది కాదేమో. మూడు రొట్టెలు ముడ్డికి, నా మొ.... పోత గడ్డికి,
అంటూ వాడు పాడతడు. ఇక చూడవచ్చిన వాళ్ళ
ఆనందానికి అంతు ఉండదు. నాకు కూడా ఈ ఒక్క పాట జ్ఞాపకం. అంతటితో ఆగకుండా పిల్లోని
పాత్రకు పొడుగాటి బెల్లకాయ కూడ ఉన్నట్టు చూపించేవారు. అప్పట్లో అది బూతుగా అనిపించలేదేమో? నాకు ఇవ్వాళటికి ఆ నంగతి అర్థం గాదు. ఈ మధ్యన ఎక్కడ తోలుబొమ్మలాట వాండ్లు కనిపిస్తున్న
జాడ లేదు. సురభి వాండ్ల నాటకం కంపని హైదరాబాద్ కు చేరింది గాని రాయలసీమలోనే ఉన్న
తోలుబొమ్మల వాండ్లు మాత్రం పట్నం చేరినట్టు లేదు. అక్కడనో ఇక్కడనో తోలుబొమ్మలాట
పద్ధతిలోనే మరేమో వస్తువులను తయారు చేసి అమ్ముతున్నట్టు కనిపించింది. చిన్న చిన్న
బొమ్మలు కూడా అమ్మకానికి కనిపించినయి. మొత్తం నాటకం జరగాలంటే పెద్ద జట్టు ఉండాలె గద? అది బహుశా వీలవుతున్నట్టు లేదు. నిజానికి తోలు బొమ్మలు తయారు చేయాలంటే, అదొక పెద్ద తతంగం. దాని గురించి ఎక్కడనో
చదివే అవకాశం కూడా దొరికింది. చాలాకాలంపాటు బొమ్మల కోస్రం జింక చర్చం వాడేవాండ్లట.
జింకలను వేటాడడం ఇప్పుడు కుదరదు. అసలు అవి ఉన్నాయో లేదో గూడ తెలువదు. కనుక ఆ మధ్యన
బొమ్మల కోస్రం మేక చర్మాన్ని వాడడం మొదలయిందట. పెద్ద సైజు బొమ్మలను తయారు చేయాలంటే ఒక
మేక చర్మం సరిపోదు. రావణానురుని బొమ్మకు మూడు మేకల చర్మం అవుసరం అవుతుందట. అందుట్లో
ఒక మేక పది తలకాయలకు పోతే, ఒకటి కాళ్లకు పోతే,
మరొకటి శరీరానికి సరిపోతుంది. ముందు ఆ
చర్చాన్ని పారదర్శకంగ వచ్చేట్టు తయారు చేయాలె. ఆ తరువాత దానిమీద
బొమ్మ ఆకారం కత్తిరించాలె. దుస్తుల ప్రకారం బొమ్మ గీసి అందుట్లోనుంచి వెలుగు బయటకు
కనిపించేటట్టు రంధ్రాలు వేయాలె. ఆ రంధ్రాల వెంట గీతలు గీసి రంగులు వూయాలె. నిజంగనే
పాత కాలంలో రంగులు కూడా వాండ్లే తయారు చేసుకునేవారు. ఉదాహరణకు మోదుగు వువ్వులనుంచి
అవసరమైన పనువు, ఎరుపు రంగును తయారు చేసే వాండ్లట. ఇప్పుడు అదంతా కుదిరే పరిస్థితి
కాదు. కనుక రసాయనం రంగులను వాడక తప్పదు. అసలు ముందు చర్మాన్ని బొమ్మలకు అనుగుణంగ
పారదర్శకంగ తయారు చేయడమే పెద్ద కళ. దాన్ని బొమ్మలు ఆడించే వాండ్లే చేసుకుంటరు అంటే
అంతకంటే ఆశ్చర్యం లేదు. కనుకనే ఈ కళ రానురాను మరుగున వడుతున్నది. కొన్ని బొమ్మలు
కేవలం నలుపు తెలుపు రంగులో ఉండడం కూడా నేను చూసిన. అటువంటి బొమ్మలు ఆడించినవుడు
అంత ఆకర్షణీయంగా ఉ౦డవేమో. నేను ఆ మధ్యన కాకిపడిగెలు అనే ఇంకో రకం
బొమ్మలాట చూసిన. ఇందులో తెర, దీవం
నీడలు మరో రకంగా ఉంటయి. కథ పటాల వలే చిత్రించి ఉంటుంది. దీవం
వట్టుకొని పటాలముందు బొమ్మలు చూపిస్తూ కథలు చెబుతంటరు. జానపద కళలు మరుగున పడుతున్నయి. ఈ విషయం
నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాస్త్రీయ సంగీతం లాంటివి
కూడ కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నయి. అందరికీ అందుబాటులో ఉన్నయి అనుకున్న పనులు
కూడా లేకుండ పోతే ఇక చివరికి మిగిలేది ఏమిలేదు. ఆ సినిమా ఎవరికి కావాలె? చాలామందికే గావాలె. వాండ్లుకు మరి పాతకాలపు
కళల గురించి తెలియదు. బైండ్ల కథలు, జముకుల కథలు, బుర్రకథ మొదలైనవి ఆయా పద్ధతులను
వృత్తిగా చెప్పేవాండ్లు మాత్రమే నేర్చుకుని మిగతా వారికి అందిస్తారు. ఔత్సాహికులు వీటిని
నేర్చుకోని అందరిముందు ప్రదర్శించడం కుదిరేదికాదు. చుక్క సత్తయ్య లాంటివారు ఒకతను అందరికీ నేర్పించే ప్రయత్నం
చేసినట్టు ఉన్నరు. మిగతావాటి గురించి ఈ రకమైన ప్రయత్నాలు కనిపించవు. కానీ మా చిన్నతనంలో మా ఊరికి ఒక పంతులు
వచ్చి ఉండిపోయినడు. అతను పల్లెలోని యువకులందరినీ ఒక చోటచేర్చి చిరుతల రామాయణం అనే
ఒక పద్ధతి జానపద ప్రదర్శనను నేర్పించినడు. అందులో సుమారు 50 మంది పాత్రధారులు. రామాయణం కథ ఈ చివరి
నుంచి ఆ చివరి వరకు పాడినట్టు గుర్తుంది. ప్రదర్శన వారం రోజులపాటు సాగినట్టు
గుర్తుంది. యువకులందరూ ఒకటికి రెండు పాత్రలు నేర్చుకుని రోజు రోజుంతా ఆ పాటలను
కూనిరాగాలుగా తీయడము నాకు ఇవ్వాళటికి గుర్తుంది. మొత్తానికి చిరుతల రామాయణం ప్రదర్శన
చాలా బాగ జరిగింది. దీనికి ఒక వేదిక అంటని లేదు. కళాకారులు చుట్టూ గుండ్రంగా
నిలబడతరు. చేతులలో చిరుతలు అనే వాయిద్యాన్ని వట్టుకోని దానితో లయబద్ధంగా వాయిస్తూ
పాటలు పాడుతుంటరు. ఆ సందర్భంలో కథ జరుగుతున్న పాత్రలు మధ్యలోకి వచ్చి తమతమ
సంభాషణలను వినిపించినట్టు గుర్తున్నది. కళాప్రదర్శనలలో ఈ రకంగా పాల్గొన్న యువత
నిజంగ గొప్ప ప్రేరణ పొందిన భావం నాకు మిగిలి ఉంది. ఇప్పుడు పల్లెల్లో ఎవరికైనా ఇటువంటి పనులు గుర్తున్నయా?అడగడానికి నేనెవరిని? నేను కనీసం చూడడానికి కూడా పల్లెకు పోవడం
లేదు. పల్లె పట్టణానికి వచ్చే అవకాశం లేనే లేదు. ఆ మధ్యన ఆయనెవరో ఒక 12 తీగల వాయిద్యం వాయిస్తడని పాలమూరు
నుంచి వచ్చినడు. అతని గురించి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో దుమారం రేగింది. అంతేగాని
అతని ప్రదర్శన వలుచోట్ల పెట్టి చూసినవాళ్లు ఎంత మందో నాకు తెలియదు. కథలు మారిపోతున్నయి. కళలు
మారిపోతున్నయి. కాలాలు మారిపోతున్నయి. పాత పద్ధతులు ఎవరికి వట్టవు. అవి పరిశోధన పుస్తకాలలో
మాత్రమే మిగిలి పోతయేమో. జానపద నంగీతం పరిస్థితి కూడ ఇంచుమించు అట్లగే ఉంది. ఈ
మధ్యన జానపద శైలిలో వచ్చే సంగీతాన్ని జానపదం అనుకుని అందరూ ఆనందంగ వింటున్నరు.
అసలు జానపదుల పాటలు ఏమయ్యినయి అర్ధం గాదు. ఆ సంగతి చెప్పినా ఎవరికీ వట్టదు. నేనిక్కడ
ఒక విషయం గురించి ఏడవాలని ప్రయత్నించడం లేదు. గుర్తుకు వచ్చిన కొన్ని అంశాలు
ఎక్కడైనా మిగిలి ఉన్నయేమో తెలుసుకుందం అని ఒకటే నా ఆశ.
No comments:
Post a Comment