Friday, January 2, 2026

పెరుగు సైన్స్ - curds and Science : An article in Telugu

పెరుగు - సైన్స్

How much do you know about the curds that you eat?

పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం తరుగుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలైంది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్య పడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లిపోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మ జీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. విపరీతంగా సంఖ్యలో పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వీగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మనముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుక లుక లాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

 పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాలగిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!

 ఈ వ్యాసం రాసి చాలా కాలమయింది, గమనించాలి.

Thursday, January 1, 2026

Panda : A Story in Telugu Translated to English

Panda

A Story in Telugu Translated to English


Panda

 A N Jagannatha Sharma


Summer night….

Cold night ….

Rainy night ….

Any night the song of Panda would be heard. Not just the poets, even Panda would be awake at midnight.

His voice is not good. There would not be any rhyme or rhythm in it. Since he belongs to Orissa there would even be faults in his pronunciation of Telugu. Even then his singing would sound good.

“Ravoyi chandamama

Ma vinta gadha vinuma”

(A very popular old film melody in Telugu asking the moon to come and listen to a strange story)

When he sings wherever the moon is, he must come there! He must listen to Panda’s song! On the threshold of the thatched house, in the rickety cot woven with the thread, in the tatters of a quilt, Panda would be sleeping. With his song he wakes everyone.

From the eves of the house a hurricane lantern from one side and a parrot’s cage from the other would be hanging. In the middle Panda would be struggling with the song.

He has no father. It is long since he died. Mother is there. She makes leaf plates. That is her profession.

Panda was alright till he was twenty-five. Like all the others with his visage he was handsome only. Later that ailment came up. It started with spots and started shedding skin and made Panda an ugly duckling. It made him a leper.

With that, no more handshakes. No embraces either. Friends are not there. Panda turned into a loner.

All the while he stays home. During the day he is in the backyard. Plants saplings. Tends them. Waters them. When a flower or a fruit appears he takes them into the hands with love.

They would not slip off saying ‘Don’t!’ They settle snugly there. He touches them to his eyes. Holds them to the heart.

When it is dark ….

He stays indoors with parrot. He trains it with words. Teaches it singing.

Parrot likes him a lot. It feels as if it’s life is hidden in him. It goes round him in circles. It flies within and out of reach. In a moment comes and lands on the shoulder. It scratches his tattered nose. It scratches his rotten cheek.

In the night –

Panda relaxes on the threshold in the rickety thread woven cot.

At some point he goes into sleep. If he sleeps it is as if the whole vicinity slipped into sleep.

That morning the merchant of the leaf plates came. On looking at Panda at the doorsteps he was sunk. He called out his mother and called all kinds of names. He put down the leaf plate bundles from the rickshaw and threw them.

“Do something else if unable to live. But don’t ever mix this disease in the leaf plates from which people eat” he said. He looked at Panda’s disease cautiously. He went away in a huff.

Selling leaf plates cannot go on in the village where they stay. On seeing Panda no one would buy the plates of that household. Merchant is from Ponnur. He used to pick up the plates in the shanty. Somehow, he came to know that she had a son with leprosy. He was afraid of even touching the plates he bought the other day. He brought and threw them back.

No one calls Panda’s mother even for the home maid work. How else to live? How to make the son live?

She cried hoarse.

“Go and die! Why do you kill me along” she said. She was angry with Panda.

It was two in the night. Panda till then sang all pathetic songs only. Cannot tell whether with sleep or sorrow, every song was heard heavy. There were no more songs later. Everyone thought Panda was asleep.

Day broke.

Panda was not there at the door front. The parrot’s cage was not there on the awning. Both were seen floating on the village tank. The parrot flew away.

Flowers never rejected Panda.

Birds neither.

The air or water never rejected.

Who then rejected him?

You and me!!

(Life being kept in a parrot is a folklore paradigm. And the parrot flew away means life is gone!)


Wednesday, December 31, 2025

శోకనాయిక మీనాకుమారి - 2 : Tragedy Queen Meena Kumari Part 2

శోకనాయిక మీనాకుమారి - 2 

2

చంద్రుడు ఒంటరి అన్న కవితలో ఆమె చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు. ఆమె చివరి సినిమా పాకీజా మహత్తరమైన విజయాలను సాధించింది. దాన్ని భర్త కమాల్‌ తీశాడు. దానికి ఆమె మనసులోని భావాలను దాచుకుని అతనితో సహకరించి చిత్ర నిర్మాణానికి చేతనైనంత ఊతం ఇచ్చింది. ఆ సినిమాలో సాహెబ్‌ జాన్‌ అనే పాత్ర నిజంగా మీనా కుమారి నిజజీవితానికి అద్దం పడుతున్నట్టు ఉంటుంది. చిత్రం ఈనాటికీ అందరికీ అభిమానపాత్రంగా ఉండిపోయింది. ఆ చిత్రం ఘన విజయాన్ని చూడకుండానే 40 ఏళ్ల వయసులోనే మీనాకుమారి కన్ను మూసింది. ప్రేక్షక ప్రపంచం ఇవ్వాళటి వరకు ఆమెను తలచుకుని కుములుతూనే ఉంది. ఆమెకు నివాళి అర్పిస్తూనే ఉన్నది. అటువంటి మరొక నటి కోసం ఎదురు చూస్తున్నది. బతుకు బరువులోని బాధను మనకు సరదాగా అందించడానికి మళ్లీ మరొకరు రావాలి అనుకోవడం మన అత్యాశ.

మీనా కుమారి సినిమాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒక చిత్రమైన క్రమం కనిపిస్తుంది. ఆమె 40 దశకంలో ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో నటించింది. గణేశ్‌, హనుమాన్‌ పాతాల్‌ వంటి సినిమాలలో కనిపిస్తున్న అమ్మాయి హైందవి కాదని ఎవరికీ తోచనే లేదు. నటిగా ఆమెకు గుర్తింపు వచ్చినది మాత్రం విజయ్‌ భట్‌ 1952లో తీసిన బైజూ బావరా అనే చిత్రంతోనే. అందులో అప్పటికే ప్రసిద్ధిగాంచిన నటుడు భరత్‌ భూషణ్‌ హీరోగా వేశాడు. బైజూ బావరా వంటి వ్యక్తి చరిత్రలో ఉన్నాడు కాని సినిమా కథ మాత్రం ఇంచుమించు కల్పితం బైజూ అంటే బైద్యనాథ్‌. అతను మామూలు మనిషి కాదు. బావరా అంటే వెర్రివాడు అని అర్థం. బైజూకు తెలిసింది సంగీతం మాత్రమే. అతను నేరుగా సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజు, అక్బర్‌ పాదుషా ఆస్థానంలోని పండితుడు మియా తాన్సేన్‌ తో పోటీ పడతాడు. అతనికి ఒక చిన్ననాటి స్నేహితురాలు ఉన్నట్టు కథ కల్పించారు. బైజూను పెంచిన జాలరి కూతురు ఆమె అని సినిమాలో చూపించారు. పిల్లలు ఇద్దరు పెరిగి పెద్దవాళ్లు అవుతారు. చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది. రాధాకృష్ణుల పద్ధతిలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇక్కడ మీనాకుమారి వేసిన పాత్ర పేరు గౌరీ. ఈ గౌరి హైందవి కాదన్న సంగతి ఎవరికీ పట్టలేదు. అప్పటికి పిన్నవయసులో ఉన్న మీనాకుమారి ఈ పాత్రలో చాలా సహజంగా కనిపించింది. కథ కూడా సరదాగా నడుస్తుంది కానీ చివరికి దుఖం మొదలవుతుంది. బైజూ పల్లె వదిలి వెళ్ళిపోతాడు. సంగీతం గురువు కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఇక్కడ గౌరీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయి మోహే భూల్‌ గయే సావరియా (నన్ను మరచితివి ప్రియతమా) అంటూ పాటలు పాడుతూ ఉంటుంది. బైజూ నిజానికి తన ప్రియురాలిని మరవలేదు. అతను తిరిగి పల్లెకు వస్తాడు. కానీ అప్పటికే ఆమెకు బలవంతంగా పెళ్లి కుదిర్చి ఉంటారు. బైజూ వస్తున్న బోటు నదిలో మునుగుతుంది.  ఇక శోకానికి కరువే లేదు. ఈ చిత్రంలో పాటలు నేటికీ అందరి మనసులలో నిలిచి ఉన్నాయి. మీనాకుమారి శోకదేవత అవతారానికి ఇక్కడే బీజం పడింది.

పరిణీత అనే సినిమాను ఈ మధ్యన మళ్లీ తీశారు. దాన్ని మొదటిసారి తీసినప్పుడు నాయికగా మీనాకుమారి  నటించిందని ఇప్పటివారికి తెలియకపోవచ్చు. ఇక్కడ కథలోనే కావలసినంత ఏడుపు కలగలిసి ఉంది. ఇక మీనా నటనతో అది మరింత పండింది.ఆ తరువాత కమాల్‌ అమ్రోహీ, దాయరా అనే సినిమా తీశాడు. దానితో మీనా శోకనాయికగా స్థిరపడిపోయింది.

అరవై దశకంలో శారద, ఆర్తి, దిల్‌ అప్నా ఔర్‌ ప్రీత్‌ పరాయి, మజిలీ దీది లాంటి సినిమాలు వరుసపెట్టి వచ్చాయి. వీటన్నిటిలోనూ మీనా కుమారి ఏడుపు హీరోయిన్‌ గానే కనిపించింది. ఆ తరువాత ముస్లిం సంస్కృతి కథలతో సినిమాలు కొన్ని వచ్చాయి. చాందిని చౌక్‌, నూర్జహాన్‌, బహూ బేగం, బేనజీర్‌ లాంటి సినిమాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

 ఇంతకూ హిందీ సినిమారంగం మీనా కుమారి లోని శోకదేవతను మాత్రమే గుర్తించిందా? ఆమెకు వివిధ పాత్రలలో నటించడం వీలుకాదు అనుకున్నారా? అదేమీ లేదు. నిజానికి మీనా కుమారి కొన్ని సరదా సినిమాలలో కూడా నాయికగా వేసింది. శరత్‌, నిజాం లాంటి సినిమాలను ఆ వరసలో చెప్పుకోవచ్చు. ఆజాద్‌ అన్నది అటువంటి మరొక సినిమా నయా అందాజ్‌, కోహినూర్‌ అన్నవి తరువాత వచ్చిన మామూలు సినిమాలు. వీటిలో పెద్దగా ఏడుపులు లేవు.

మీనాకుమారి ఏడుపు పద్ధతి గురించి ఆలోచిస్తే గురుదత్‌ నిర్మించిన సాహిబ్‌, బీవీ ఔర్‌ గులాం అనే సినిమాను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇది బెంగాలీ కథ. అందులో మీనాకుమారి పాత్ర ఛోటీ బహూ. అంటే చిన్న కోడలు. జమీందారీ వ్యవస్థ దిగజారిపోతున్న రోజుల కథ అది. భర్త పట్టించుకోడు. సానివాడల వెంట తిరిగి తన మగతనాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడు. చిన్నకోడలు అన్ని రకాల కుమిలిపోతూ ఉంటుంది. ఏడుపు పాటలు పాడుతూ ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో చాలా పేరుతెచ్చుకున్నది. న జావొ సయ్యా, ఛుడాకె బయ్యా, భవర బడా నాదాన్‌ హై లాంటి పాటలు నేటికీ పాడుకునే వాళ్లు ఉన్నారు.

చెపుతూపోతే ఇటువంటి సినిమాల వరుస పాకీజాతో తారస్థాయికి చేరుతుంది. అదే ఆమె నటించిన చివరి చిత్రం. మీనా కుమారి 1952లో కమాల్‌ అమ్రోహీని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. అతను అప్పటికే మంచి పేరుగల దర్శకుడు. జంట మధ్యన ఎంతో ప్రేమ పండింది. కానీ కమాల్‌ ఆమెను ఎప్పుడు తనతో సమానురాలు అనుకోలేదు అంటారు. వాళ్లు విడిపోయారు. కొంతకాలం తరువాత మళ్ళీ కలిశారు. అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా పాడయింది. మరొకసారి వాళ్లు విడిపోయారు. ఆ తరువాత ఆమెకు ఆనందం పూర్తిగా కరువైంది. పట్టించుకోకుండా వదిలేసిన భర్త కొరకు ఆమె పాకీజాలో నటించింది. పాపం మీనాకుమారి 1972లో మార్చి 31న గతించింది. తన చివరి సినిమా విజయం గురించి ఆమె చూడలేకపోయింది. ఇటు జీవితంలోను అటు సినిమా పాత్రలలోనూ శోకం నిండిన ఆ ఆడకూతురు కవిత్వాన్ని ఆలంబనగా చేసుకుని బ్రతికింది అంటే ఆశ్చర్యం లేదు. మీనా కుమారి బతుకు ఒక్కసారిగా దిగజారిన పద్ధతి కనిపించదు. ఆమె బాధలు క్రమంగా పెరిగినట్టు తోస్తుంది. పాకీజా నాటికి ఆమె ఆరోగ్యం పూర్తి అన్యాయంగా ఉంది. అయినా ఆమె నటించడానికి  ముందుకు వచ్చింది.

Tuesday, December 30, 2025

Monday, December 29, 2025

లోకాభిరామం - నాణానికి అటు ఇటు : ఆర్వీయార్ గురించి Lokabhiramam - Two sid...

లోకాభిరామం - నాణానికి అటు ఇటు

ఆర్వీయార్ గురించి

ఆర్వీయార్‌

నాకు ముగ్గురు ఆర్వీయార్‌లతో మంచి పరిచయమైంది. ముగ్గురి గురించీ చెప్పవలసింది శాననే ఉంది. ఈ ముగ్గురిలో ఒకాయన నిజానికి ఉట్టి ఆర్వీయార్‌ కాదు. ఆయన పూర్తి పేరు ఆర్వీయార్‌ చంద్రశేఖరరావు. ఆయన గురించి నా బ్లాగు లోకాభిరామంలో 2007లోనే రాశాను. ఆయనతో నిజానికి నాకు అంతగా పరిచయం లేదు. పరిచయం కలగడం అదొక అనుభూతి. అనుభవం. అప్పట్లో చంద్రశేఖరరావు గారు ఎ.పి. ఓపెన్‌ యూనివర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా ఉన్నారు. ఆ యూనివర్సిటీ వారు, నన్ను ఒక పాఠం చెప్పమని పిలిచారు. నేను జంతుశాస్త్రం చదువుకున్నాను. రెండేండ్లు పాఠాలు చెప్పడానికి చేసిన ప్రయత్నం నిజానికి చేదు అనుభవంగా మిగిలింది. అయినా సరే మిత్రులను నొప్పించలేక పాఠం చెప్పడానికి వెళ్లాను. అక్కడ విద్యార్థులుండరు. పాఠం రికార్డు చేసి, అవసరమైన చోట వినిపిస్తారు. రికార్డింగ్‌ ముగిసింది. మిత్రులు ఉమాపతి వర్మ, మా వీసీ గారిని కలుద్దాం. ఆయన సంతోషిస్తారు అన్నాడు. ఆయన మరీ పెద్ద మనిషి. జగమెరిగిన వ్యక్తి. నేనొక కుర్ర ఆఫీసరును మాత్రమే. ఆయనను కలవడానికి కొంచెం జంకినట్లే గుర్తు. ఆశ్చర్యంగా ఆయనకు నా గురించి అప్పటికే తెలుసు! అదీ పెద్దవాళ్ల పద్ధతి! అనిపించింది.

మాటల్లో పడ్డాము. వర్మగారు లేరక్కడ. పెద్దాయన, నేను ఇద్దరమే మిగిలాము. కాసేపు తరువాత ఆయన తన టేబుల్‌ దగ్గర కుర్చీలోంచి లేచి వచ్చి సోఫాలో కూర్చున్నారు. నేనూ అక్కడికే చేరాను. ఆ తరువాత మరెవరూ ఆ గదిలోకి రాలేదు. ఏ కాయితాలు, ఫైళ్లు తేలేదు. అది ఆయన పద్ధతి అయ్యుంటుందని అనుకున్నాను. చాలాసేపు మాట్లాడుకున్నాము. చాలా సంగతులు మాట్లాడుకున్నాము. నాకు నా వయసు పెరిగిన భావం కలిగింది. చివరికి వెళ్లిపోయే సమయం వచ్చింది. ‘మీ విలువైన సమయం పాడు చేసినట్లున్నాను’ అన్నాను

వినయంగా, ‘కాదు. సత్సంగం. మళ్లీమళ్లీ దొరకదు’ అన్నారాయన. నా నోట మాట రాలేదు.

ఆ తరువాత నేను వారి ఆఫీసుకు వెళ్లినట్టు గుర్తు లేదు. ఆయన మాత్రం ఎప్పుడు మా ఆఫీసుకు, ఆఫీసు వేపు వచ్చినా నా దగ్గరకు వచ్చి కూచునేవారు. ఆయన అన్ని రకాల పెద్దమనిషి. తమ్ముని వలె నన్ను అభిమానించారు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు నా ముందర, ఒక సీడీ ఎన్‌సైక్లోపిడియా ఉంది. పాతకాలం మనిషి గనుక ఆయనకు అది కొత్తగా కనిపించింది. ఆయన చిన్నపిల్ల వాడయిపోయి, ప్రశ్నలడగడం మొదలు పెట్టారు. వంద ప్రశ్నలడిగారు. అంతటి వ్యక్తికి నేనేదో కొత్తగా చూపుతున్నానన్న సంతోషం నన్ను ముంచె త్తింది. ఇద్దరమూ కంప్యూటర్‌ ముందర ఎంతో కాలం గడిపాము.

ఆయన ఉన్నట్టుండి ‘లాస్ట్‌ సప్పర్‌’ అనే పెయింటింగ్‌ ఉంటుందా, ఇందులో?’ అని అడిగారు. అది నిజంగా ఉంది. రావుగారికి చిత్రకళ మీద చాలా అభిమానం, ఆసక్తి ఉన్నట్లున్నాయి. ఆయన ఒక సర్వస్వంగా మారిపోయి, జీసస్‌ లాస్ట్‌ సప్పర్‌ గురించి చెప్పసాగారు. (ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికాలో ఆంధ్ర ప్రదేశ్‌ గురించిన వ్యాసం ఆయన రాశారని నాకు తరువాత తెలిసింది) లాస్ట్‌ సప్పర్‌ పెయింటింగ్‌లో ఒక మనిషి బొమ్మను తుడిపేశారని రావుగారు చూపిస్తుంటే, ఆశ్చర్యం నావంతయింది. ఆ తరువాత ఆ విషయం గురించి చాలానే చదివాను. పెయింటింగ్‌ సంగతేమో గానీ, చంద్రశేఖరరావుగారిలోని ఆ కుతూహలం, ప్రశ్నలడిగిన తీరు, నన్ను ఎంతగా ప్రభావితుడిని చేసినయో చెప్పలేను.

నేను కొంతకాలం హైదరాబాద్‌ వదిలి వెళ్లవలసి వచ్చింది. రావుగారు కెనడాలో కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ అనే అంతర్జాతీయ సంస్థలో పెద్ద హోదాలో వెళ్లి పని చేశారు. నేను తిరిగి హైదరాబాద్‌ వచ్చాను. ఆయన కూడా వచ్చారు. నాకాయన గుర్తుండడంలో గొప్ప లేదు. కానీ ఆయన నన్ను గుర్తుంచుకున్నారు. చెప్పాపెట్టకుండా మా ఆఫీసుకు వచ్చారు. నా పి.ఎ. దగ్గరకు వెళ్లి నా గదిలోకి రావడానికి అనుమతి అడుగుతున్నారు. నా గుండె గొంతుకలోకి వచ్చింది. లేచి ఎదురెళ్లి లోనికి తెచ్చాను. ఆయన అదే ఉత్సాహంతో పిల్లవానివలె ముచ్చట సాగించారు. ‘ఏం చదువుతున్నావు?’ అని అడిగారు. తాము చదువుతున్న పుస్తకం చూపించి, నీవూ చదువు, నేను ముగించిన తరువాత ఇస్తాను’ అన్నారు. నేను పుస్తకాలు చదువు తానని ఆయన గుర్తుంచుకున్నారు. అంతటి మహానుభావుడు నన్ను వెతుకుతూ వచ్చినందుకు నాకు కలిగిన భావాలను వర్ణించలేను. తరువాత ఆ లాస్ట్‌ సప్పర్‌ పెయింటింగ్‌ను మరెక్కడో చూచిన వెంటనే, ఆయన గుర్తొచ్చారు. బ్లాగు ఎంట్రీ రాశాను. అది చదివి, ఆయన విద్యార్థి ఒకరు మంచి కామెంటు రాశారు. ఇంకా కాలం గడిచింది. నేనే పనికిరాని వాణ్ణి. ఆయన ఎక్కడున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.

కూలి పని - కథ: 

బ్లాగులోకి పోతే చిత్రమైన కథ ఒకటి గుర్తొచ్చింది. మీరూ చదవండి. ఈ కథను ఆనా మారియా అనే ఆర్జెంటీనా రచయిత్రి రాసింది!!

మామూలు మనుషులు మా పనిని గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ మా పని మాత్రం చాలా మామూలు రకం. అది, మీరు సినిమాల్లో చూచినట్టు మాత్రం ఉండదు. మా మొదటి అవకాశాలు మాత్రం మాకు బాగా గుర్తుండిపోతాయి. అందరూ అనుకున్నట్లు గాక, మాలో కూడా, అనుభవం గలవాళ్లు, అనుకూలం గాని పనులను, కష్టమైన వాటిని, అంతగా నచ్చని వాటిని ఒప్పుకోరు. అది మామూలుగానే కొత్త వారికి అందుతాయి. ఓ వంద డాలర్లిస్తే, ముసలాడి గొంతు పిసికేందుకు సిద్ధంగా ఉండే కుర్రవాళ్లు ఎప్పుడూ దొరుకుతారు మరి.

నేను నా మొదటి క్లయంట్‌, శ్రీమతి మెర్సిడస్‌ ఉల్లోవా గారి ముందు కూచున్నప్పుడు నిజంగా పనిలోకి కొత్తగా వచ్చినవాణ్ణి. నాకు కాస్త జంకుగా ఉందింకా. అంతకు ముందు కొంతమంది ప్రాణాలు తీశాను. నిజమే. కానీ అది దొంగతనాలు, కొట్లాటలలో భాగంగా మాత్రమే. ఈ వృత్తిలోకి దిగడంలో నాకు మరో గొప్ప వెసులుబాటుంది. నేనెప్పుడూ పట్టుబడింది లేదు.

నేనావిడను, వాళ్లింట్లో రాత్రిపూట కలిశాను. క్లయంట్లు సాధారణంగా మాతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ, ఈ డిజిటల్‌ యుగంలో, సాక్ష్యాలు మిగలకుండా ఉండడానికి, నేరుగా కలవడం కన్నా మంచి మార్గం ఇంకొకటి లేదు. నేను ఇంట్లోకి రావడం, ఎవరూ చూచే అవకాశమే లేదు. ఆవిడ నా కోసం తలుపు తెరిచే ఉంచింది. గంట మోగించాల్సిన అవసరం కూడా రాలేదు.

ఇంట్లో ఒక జంటకు సంబంధించిన కథలు చెపుతున్నట్లు బోలెడు ఫోటోలున్నాయి. మెర్సిడిస్‌ నీడగా ఉన్న తన గదిలో బల్ల ముందు కూచుని ఉంది. బొమ్మల్లో ఉన్న మనిషి ఆవిడేనని గుర్తించడం కష్టం కాదు. ఆవిడ ముసలిగా, వాచిపోయినట్టు ముతకగా ఉంది. కంపు గొడుతున్నది కూడా. ఆవిడ ఏ మాత్రం కాలయాపన చేయలేదు. సగం డబ్బు అప్పటికే బల్ల మీద పెట్టి ఉంది. ఆ గదినిండా వికారమయిన తీపి వాసన నిండి ఉంది. ‘నువ్వు నా భర్తను చంపేయాలి. బాత్‌ టబ్‌లో ముంచేయాలి.’ నేను అడ్డు తగిలాను. కారణాలతో నాకు పనిలేదు. ‘సరే! మరో రెండు రోజుల్లో...!’ ‘ఇప్పుడే!’ ‘అదిగో బాత్‌రూమ్‌’ ‘పిచ్చి ఆడది!’ అనుకున్నాను నేను. ఒకర్ని బాత్‌ టబ్‌లో చంపడమంటే, మురికి, కష్టంతో కూడుకున్న పని. కాళ్లను పాదాల దగ్గర పట్టుకుని మనిషిని చేతయినంతగా పైకి ఎత్తాలి. తల నీళ్లలో మునుగుతుంది. అలా మునిగిపోతున్న మనుషులు కాళ్లు చేతులు గట్టిగా కొట్టుకోవడం మామూలే. కానీ ఈ మనిషి ముసలతను. నాకదే బాధ. ఇక ఆలోచించకుండా, డబ్బులు జేబులో ఉంచుకుని పనిలోకి దిగాను. నా అనుమానం మాట అటుంచి పని అలా అలా ముగిసిపోయింది. బయటికి వచ్చేసరికి నా దుస్తులు తడిసి ఉన్నాయి. మిగతా డబ్బులు సిద్ధంగా బల్ల మీద ఉన్నాయి. నేను నా క్లయంట్‌ కోసం అటుయిటు చూచాను. కానీ ఆవిడ వెళ్లిపోయింది. బాత్‌రూం చప్పుళ్లు వినదలచుకోలేదేమో! ముసలతను ప్రమాదవశాత్తు చచ్చాడని నిర్ణయించడం కష్టం కాలేదు. వార్తాపత్రికల్లో రావడానికి అదేమంత ఆసక్తికరమయిన సంగతి కాదు. ప్రమాదవశాత్తు ఒక ముసలతను చచ్చాడని చాలా రోజుల తరువాత రాశారు. అతను కనిపించకపోయే సరికి పక్కింటి వాళ్లు పోలీసులకు ఫోన్‌ చేశారు. కుళ్లిన శవం దొరికింది. అతను ఒంటరి మనిషి. పిల్లలూ లేరు.

ఉల్లోవా కంపు గొట్టిందంటే ఆశ్చర్యం లేదు మరి-

అదీ కథ! - ఇంతకూ నాకు ఈ కథ ఎందుకు నచ్చింది? మీకు నచ్చిందా? నచ్చితే ఎందుకని?

కవిత: 

కఠినతర తర్క వాక్ప్రసంగముల వలన

కావ్య నిర్వచనము, సేయ పరుగుటెల్ల 

గడ్డపారలు, గొడ్డండ్లు, గదలు దెచ్చి

ముక్కుపోగు నమర్చెడు ముచ్చటగను

 - విద్వాన్‌ విశ్వం.



ఇసుక నురుగ 1 - ఖలిల్ జిబ్రాన్ కవితలు : Kahlil Gibran - Sand and Foam 1


ఇసుక   నురుగ 1 

ఖలిల్ జిబ్రాన్ కవితలు


Sand and Foam - ఇసుక నురగ

by Kahlil Gibran - ఖలిల్ జిబ్రాన్

 

I AM FOREVER walking upon these shores,

Betwixt the sand and the foam,

The high tide will erase my foot-prints,

And the wind will blow away the foam.

But the sea and the shore will remain

Forever.

 

నేను నిరంతంరం తీరాల మీద నడుస్తున్నాను

ఇసుక నురగల మధ్యన

అలలు పోటెత్తి నా అడుగుజాడలను తుడిపేస్తాయి.
ఇక గాలి నురగను ఊదేస్తుంది.
కానీ, సముద్రం తీరం మాత్రం ఉండిపోతాయి.

కలకాలమూనూ.

 

Once I filled my hand with mist.

Then I opened it and lo, the mist was a worm.

And I closed and opened my hand again

and behold there was a bird.

And again, I closed and opened my hand,

and in its hollow stood a man with a sad face, turned upward.

And again, I closed my hand, and

when I opened it there was naught but mist.

But I heard a song of exceeding sweetness

 

ఒకప్పుడు నా చేతిని తుహినజలంతో నింపుకున్నాను.చెయ్యి తెరిస్తే ఆశ్చర్యం,

నీరంతా ఒక పురుగయింది.ఇక మరో సారి నేను నా చేతిని మూసి తెరిచాను,

చూస్తే అందులో ఒక పక్షి ఉంది.
ఇక మరో సారి నేను నా చేతిని మూసి తెరిచాను,

  ఖాళీలో ఒక మనిషి ఏడుపుముఖంతో నిలుచున్నాడు, పైకి చూస్తూ.
ఇక మరో సారి నేను నా చేతిని మూశాను, దాన్ని

తెరిచినప్పుడు అందులో నీరు తప్ప మరేమీలేదు..

కానీ అంతులోని మాధుర్యంగల పాటవినబడింది.


It was but yesterday I thought myself

a fragment quivering without

rhythm in the sphere of life.
Now I know that I am the sphere, and all life in

rhythmic fragments moves within me.

 

నిన్ననేగదా నన్నునేను, జీవనగోళంలో

లయలేకుండా కదులుతున్న

శకలం అనుకున్నాను.ఇప్పుడు

నాకు, నేనే గోళాన్నని తెలుసు.

జీవమంతా లయబద్ధ శకలాలుగా

నాలోనే కదులుతుందనీ తెలుసు.


They say to me in their awakening, "You and the world you live

in are but a grain of sand upon the infinite shore of an infinite sea."

And in my dream I say to them, "I am the infinite sea, and

all worlds are but grains of sand upon my shore."

 

వాళ్లంతా మెలుకువగా ఉన్నప్పుడు నాతో చెపుతారు, నీవు, నీవుంటున్న ప్రపంచం,

అంతులేని సముద్రపు అంతులేని తీరం మీద ఒక్క ఇసుకరేణువు మాత్రమేనని.
ఇక నేను నా కలలో వారికి చెపుతాను, నేనే అంతులేని సముద్రాన్నని,

ప్రపంచాలన్నీ నా తీరం మీద ఇసుకరేణువులు మాత్రమేననీ.


 

Only once have I been made mute.

It was when a man asked me, "Who are you?"

 

నేనొక్కసారి మాత్రమే అవాక్కయ్యాను.

ఒక మనిషి నన్ను నీవెవరు అని అడిగినప్పుడు.


 

The first thought of God was an angel.

The first word of God was a man.

దేవుని మొదటి ఆలోచన ఒక దేవదూత.

దేవుని మొదటి పలుకు ఒక మనిషి.

 

We were fluttering, wandering, longing creatures

a thousand thousand years before the sea and

the wind in the forest gave us words.

Now how can we express the ancient of days in us

with only the sounds of our yesterdays?

 

 

మనమంతా, వేలవేల సంవత్సరాల క్రితం, సముద్రం, గాలీ, అడవి మనకు

మాటలు నేర్పక ముందు, కొట్టుమిట్టాడుతూ, తిరుగాడుతూ,

కోరికలు గల జీవులుగా ఉన్నాం.
ఇక మనం ఇప్పుడు, మనలోని దినాల పాతదనాన్ని,

నిన్నటి మాటలతో ఎట్లా తెలుపగలుగుతాం


 

The Sphinx spoke only once, and the Sphinx said,

"A grain of sand is a desert, and a desert is a grain of sand;

and now let us all be silent again."

I heard the Sphinx, but I did not understand.

 

స్ఫింక్స్ ఒకేసారి మాటాడింది, స్ఫింక్స్ అన్నదిగదా, ఒక్క ఇసుకరేణువే

ఎడారి, ఇక ఎడారి అంటే ఒక్క ఇసుకరేణువు మాత్రమే,

ఇక ఇప్పుడు మనం మళ్లా మౌనంగా ఉందాం అని.
నేను స్ఫింక్స్ మాటలు విన్నాను, కానీ నాకు అర్థంకాలేదు.