కవి దాశరథి తమ కవితలో
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
అన్న తరువాత ఏమన్నరు?
ఎంత మందికి ఈ కవిత గురించి తెలుసు?
వినండి.
చదవండి.
ముస్సీ తటము
దాశరథి కృష్ణమాచార్య కవిత
అగ్ని ధార కావ్యం నుండి
అచట ప్రాక్పశ్చిమాకాశమావలించి
నెత్తురులు కక్కుకొన్నది; కుత్తుకలకు
కత్తులను కట్టి ఊరేగు కాలరాణి
మానభంగాల జెండాలతో నదించె.
అచట, పాపము, దౌర్జన్య
మావరించి
తెలుగుదేశాన నెత్తురుల్
చిలికి వేసె
మతపిశాచము పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి, లోకమ్ము
మీద.
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
తీవియలు తెగి, విరిగి నదించకుండె
నా తెలుగుజాణ ప్రాణ మానాలు
దోచి
ఈ నిజాము పిశాచి కన్నెర్ర
చేసె.
మా నరాల నెత్తురు ప్రవాహాన
కలిసి
"ముస్సి"లో పారినది బుద్ధమూర్తివోలె
మా స్థిరీ భూత భావసమాధి వృక్ష
మట్లె నిలిచిన దీనాటికైన
గాని.
గెలిచినది గడ్డిపోచ" ముక్క లయిపోయి
మన్ను కరిచెను గొడ్డలి; కన్నులోని
వేడి అశ్రువు గెలిచెను; వాడికత్తి
ఓడిపోయెను; 'ముస్సి' పారాడిపోయె
No comments:
Post a Comment