నాలుక తెగిన పిచుక
జపాన్ జానపద కథ
నాలుక తెగిన పిచుక
జపాన్
జానపద కథ
ఒకప్పుడు ఒక
ముసలాయన ఒక ముసలావిడ ఉండేవారు. మంచి మనసున్న ముసలాయన, ఒక చిన్న పిచ్చుకని పెంచేవాడు, దానిని ఎంతో
ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆ ముసలావిడ చాలా కోపిష్టి; ఒక రోజు, ఆ పిచ్చుక ఆవిడ బట్టలకి గంజి పెట్టడానికి తయారు చేసిన పిండి
ముద్దను పొడిచి తినేసరికి, ఆవిడ చాలా కోపంతో, పిచ్చుక నాలుకని కోసేసి దానిని వదిలేసింది. ముసలాయన కొండల నుంచి ఇంటికి
వచ్చినప్పుడు పిచ్చుక ఎగిరిపోయిందని తెలుసుకుని, దానికి ఏమి
జరిగిందని అడిగాడు; అప్పుడు ముసలావిడ అతనికి తన పిండిముద్ద దొంగిలించినందుకు దాని నాలుక
కోసి వదిలేసినట్లు చెప్పింది. ఆ సంగతి విని, ముసలాయన చాలా
బాధపడ్డాడు, అయ్యో! నా పిచ్చుక ఎక్కడికి
పోయింది? పాపం! నాలుక తెగిన చిన్న
పిచ్చుక! నీ ఇల్లు ఇప్పుడు ఎక్కడ? అని అనుకొని, అతను తన పిట్ట కోసం దూర ప్రాంతాలు వెతుకుతూ, పిచుకా, నా పిచుకా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అని అరుస్తూ తిరిగాడు.
ఒక రోజు, ఒక కొండ పక్కన, ముసలాయనకి తప్పిపోయిన పిచ్చుక
కనిపించింది; వారు ఒకరినొకరు క్షేమంగా
ఉన్నందుకు పలకరించుకున్న తర్వాత, ఆ పిచ్చుక ముసలాయనని తన ఇంటికి
తీసుకెళ్లి, తన భార్యాపిల్లలను పరిచయం చేసి, రకరకాల రుచికరమైన ఆహారాన్ని వడ్డించి, ఆతిథ్యం
ఇచ్చింది.
"దయచేసి మా సాధారణ ఆహారాన్ని
స్వీకరించండి," అని పిచ్చుక అన్నది "ఇది
చాలా గొప్పగా లేకపోవచ్చుగానీ, మీరు చాలా తినితీరాలి అన్నది.
ఎంత మర్యాదగా ఉందీ
పిచ్చుక!" అని అనుకుని ఆ సలాయన, చాలా రోజులపాటు
పిచ్చుక దగ్గర ఉండి, ప్రతిరోజూ మంచి తిండి తింటూ
గడిపాడు. చివరికి ముసలాయన తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని, ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పాడు; ఆ పక్షి అతనికి
రెండు వెదురు బుట్టలను అందించి, వీడ్కోలు బహుమతిగా వాటిని తీసుకెళ్లమని అన్నది.
ఒక బుట్ట బరువుగా ఉంది, మరొకటి తేలికగా ఉంది కాబట్టి ముసలాయన, తాను బలహీనుడినని, వయసు మళ్లినవాణ్ణి కాబట్టి
తేలికైన దానిని మాత్రమే తీసుకుంటానని చెప్పి, దానిని భుజాన
వేసుకుని, ఇంటికి బయలుదేరాడు, అతని నుండి విడిపోవడం వలన పిచ్చుక కుటుంబం విచారంగా ఉండిపోయింది.
ముసలాయన ఇంటికి
చేరుకున్నప్పుడు, వాళ్లావిడ చాలా కోపంగా అతడిని తిట్టడం
మొదలుపెట్టింది, "సరే, మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? మీ వయసులో ఇలా
తిరగడం నిజంగా బాగుందంటారా" అంటూ కసిరింది.
అతను
జవాబిచ్చాడు, " ఓ! నేను పిచ్చుకల వద్దకు
వెళ్లాను. నేను వచ్చేటప్పుడు, వాళ్లు నాకు వీడ్కోలు బహుమతిగా ఈ వెదురు
బుట్టని ఇచ్చారు, అన్నాడు ." అప్పుడు వాళ్లు లోపల ఏముందో చూడటానికి బుట్టని తెరిచారు, ఆశ్చర్యం! అది బంగారం, వెండి మరియు విలువైన వస్తువులతో
నిండి ఉంది. ఆవిడ పిసినారి మరియు చిరచిరలాడే స్వభావం కలది, ఆమె ముందు ప్రదర్శించబడిన సంపదలన్నీ చూసినప్పుడు, ఆమె తిట్టే స్వరాన్ని మార్చి, ఆనందంతో తన్ను తాను అదుపు
చేసుకోలేకపోయింది.
నేను కూడా పిచ్చుకలను కలవడానికి
వెళ్తాను," అని "నేను వాటిని ఇక్కడికి
కూడా పిలవడానికి వెళతాను," అని అంది, నాకూ ఒక అందమైన బహుమతి దొరక్క పోతుందా అన్నది కూడా." ఇక ఆమె ఆ ముసలాయన్ని
పిచుకల ఇంటికి దారి అడిగి, బయలుదేరింది. అతని చెప్పిన ప్రకారం, ఆమె చివరికి నాలుక తెగిన
పిచ్చుకని కలిసి, ఇలా అంది—
"భలే,
భలే పిచుక గారూ,
ఎంత సంతోషం.
నిన్ను చూడాలని
నేను ఎంతకాలంగాఎదురు చూస్తున్నాను" అన్నది. ఆమె మంచి మాటలతో పిచుకను
పొగడటానికి, బుజ్జగించడానికి ప్రయత్నించింది.
ఆ పక్షి ఆవిడను
తన ఇంటికి ఆహ్వానించక తప్పలేదు; కానీ అది ఆమెకు విందు చేయడానికి
ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు, వీడ్కోలు బహుమతి గురించి ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ,
ఆమె వెనక్కి
తగ్గలేదు; కాబట్టి ఆమె తనకు వారి గుర్తుగా తీసుకెళ్ళడానికి ఏదైనా అడిగింది. అందుకు పక్షి
మునుపటిలాగే రెండు బుట్టలు ఇచ్చింది, ముసలావిడ ఆశగా,
రెండింటిలో
బరువైన దాన్ని ఎంచుకుని, తీసుకెళ్ళింది. కానీ లోపల ఏముందో చూడటానికి ఆమె బుట్ట తెరిచినప్పుడు, అన్ని రకాల దయ్యాలూ,
భూతాలూ బయటకు
దూకి, ఆమెను బాధించడం
మొదలుపెట్టాయి.
ఆ ముసలాయన
మాత్రం ఒక కొడుకును పెంచుకున్నాడు, ఎంత సంతోషంగా వాళ్లు కలకాలం
బతికారు.








