Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Saturday, March 14, 2026
ఈ గాలి ఈ నేల : వాతావరణం - మేఘాలు మరెన్నో సంగతులు
మనమంతా గాలి మనుషులం. నేల మీద ఉంటున్నాం! నిజమే. నీటిని వాడుకుంటున్నాం. అంతకన్నా నిజమే. కానీ, గాలి మీద ఆధారపడినంతగా మన బతుకులు ఈ రెంటి మీదగానీ, వెలుగు మీదగానీ ఆధారపడ లేదనిపిస్తుంది. ఎక్కడ ఉన్నాసరే, గాలి మనలను అంటిపెట్టుకుని ఉంటుంది. మనం వాతావరణంలో, అంటే గాలిలో మునిగి ఉంటాము. బతుకు కొనసాగడ మంటే, అనుక్షణం ఊపిరి కొనసాగడమే. గాలి చేసే గమ్మత్తుల ప్రభావం అనుక్షణం మనమీద ఉంటూనే ఉంది. అయినా, గాలి గురించి, వాతావరణం గురించి మనకు అర్థమయింది మాత్రం చాలా తక్కువే. గాలిలో వింతలెన్నో దాగి ఉన్నాయి. అందులో వెలుగులున్నాయి. నీరుంది. అల్లంత ఎత్తున మబ్బుల్లో కూడా జీవం ఉంది. ఆ జీవం ప్రభావం మన మీద కూడా ఉంటుంది.
Friday, March 13, 2026
గ్లాస్ - యసునారి కవాబాటా జపనీస్ కథకు నా తెలుగు అనువాదం
గ్లాస్ - యసునారి కవాబాటా
జపనీస్ కథకు
నా తెలుగు అనువాదం
I
అతని
పదిహేనేళ్ల భార్య యోకో బుగ్గలు పాలిపోయి ఇంటికి వచ్చింది. తల నొప్పిగా ఉంది, ఒక ఘోరం చూచాను’ అన్నది.
సాకే
సీసాలు తయారుచేసే గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్ రక్తం కక్కుకున్నాడు. ఒళ్లు
కాల్చుకున్నాడు. ఆమె అదంతా జరుగు తుండగా చూచింది.
వాళ్లాయనకు
గ్లాస్ ఫ్యాక్టరీ గురించి తెలుసు. అక్కడంతా వేడితో పని. సంవత్సరమంతా కిటికీలు
తీసే ఉంటాయి. కిటికీ దగ్గర ఇద్దరు ముగ్గురు బయటవాళ్లు నిలబడి చూస్తూ ఉంటారు. ఆ
పక్కన ఉండే కాలువలో ప్రవాహముండదు. దానిమీద నూనె మెరుస్తూ ఉంటుంది. అది మురుగుకాలువ
లాంటిది.
ఫ్యాక్టరీలో
తేమగా ఉంటుంది. లోపలికి ఎండ తగలదు. పనివాళ్లు పొడుగాటి పోల్స్ చివరన అగ్గి
బంతులతో ఆడుతుంటారు. వాళ్ల చొక్కాలనుంచి, ముఖాలనుంచి మాదిరే, చెమట ఓడుతూ ఉంటుంది.
వాళ్ల చొక్కాలు కూడా ముఖాలలాగే మకిలిగా ఉంటాయి. పోల్ చివరన ఉన్న అగ్గి ముద్ద,
చూస్తుండగానే సీసా ఆకారానికి మారుతుంది. వాళ్లు దాన్ని నీళ్లలో పెడతారు. కాసేపు
తరువాత బయటకు తీస్తారు. ఒక్క ఊపుతో విరిచి పక్కన పెడతారు. గూనిగా ఉన్న ఒక
కుర్రవెధవ పటకారుతో వాటిని పట్టుకుంటాడు. ఫినిషింగ్ ఫర్నేస్కు చేరుస్తాడు. పది
నిమిషాలలోగా కిటికీ పక్కన నిలబడి చూచే వాళ్లకు తల బరువెక్కు తుంది. గాజు
ముక్కమాదిరే గట్టి పడుతుంది.
యోకో
చూస్తూ ఉండగానే సీసాలు మోస్తున్న కుర్రవాడు రక్తం కక్కి అలసటతో పడిపోయాడు. అప్పుడే
ఎగురుతున్న ఒక
అగ్గిముద్ద
వాడి భుజానికి తగిలింది. రక్తం కారుతున్న నోటిని తెరిచి వాడు అరిచాడు. ఎగిరి లేచి
చుట్టూ పరిగెత్తి మళ్లీ పడి పోయాడు.
‘జాగ్రత్త, మొద్దు భడవా!’
వాడి
భుజంమీద కొంచెం నీళ్లు పోశారు. కుర్రవాడు మూర్ఛపోయాడు.
II
‘ఆసుపత్రికి వెళ్లడానికి వాడి
దగ్గర డబ్బుల్లేవు. నేను వెళ్లి చూస్తాను’ అన్నది భార్య.
‘తప్పకుండా వెళ్లాలి, కానీ అలాంటి వాళ్లు ఎంతమందో’
‘బాగానే ఉంది, అయినా నాకు సంతోషమే.’
ఇరవయి
రోజులు గడిచాయి. కుర్రపనివాడు ఆమెకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడు. ‘చిన్న
అమ్మాయిగారి’తో మాట్లాడాల న్నాడు. యోకో బయటకు వచ్చింది. కుర్రవాడు తోటలో నిలబడి
ఉన్నాడు. ఆమె కనిపించగానే, ద్వారం పట్టుకుని తలవంచి
నమస్కరించాడు.
‘ఇప్పుడు కాస్త బాగుందా?’
‘ఏమిటి?’ కుర్రవాడు ఉలిక్కిపడ్డాడు. యోకో ఏడుస్తుందేమో అనిపించింది.
‘నీ గాయాలు నయమయ్యాయా?’
‘అవును’ కుర్రవాడు చొక్కా
గుండీలు తీయడం మొదలుపెట్టాడు.
‘అదేమీ అవసరం లేదు...’
యోకో
లోపలికి పరుగుగా వచ్చింది. భర్తతో ఏదో అనబోయింది. ఆయన కొంత డబ్బు ఇచ్చాడు. ‘ఇది
వాడికివ్వు’ అన్నాడు.
‘నేను వెళ్లను, పనమ్మాయిని పంపించండి’
III
పది
సంవత్సరాల తరువాత ...
అతను
ఒక సాహిత్య పత్రికలో ‘గ్లాస్’ అనే కథ చదివాడు. అందులో తమ పరిసరాల వర్ణన ఉంది.
ప్రవహించని ఒక నది ఉంది. దానిమీద మెరిసే నూనె ఉంది. ఇక అగ్గిగోళాలు ఎగిరే నరకం
ఉంది. కక్కిన రక్తం ఉంది, కాలడం ఉంది. మధ్యతరగతి అమ్మాయి
మన్నన కూడా ఉంది.
‘హే, యోకో, యోకో!’
‘ఏమిటది’
‘గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక
కుర్రవాడు మూర్ఛపోవడం చూచావ్. వాడికి డబ్బులిచ్చావు, కదూ? అది చాలాకాలం నాటి మాట’
‘అవునవును, అదే జరిగింది’
‘ఆ అబ్బాయి రచయిత అయ్యాడు. సంఘటన గురించి
రాశాడు’
‘ఏమిటి? నన్ను చూడనీ. ’
యోకో
పత్రికను లాక్కున్నది. కానీ అతను కూడా పైనుంచి చదువుతూ, కథను ఆమెకు చూపించడం తప్పుగా భావించసాగాడు.
అందులో
ఆ అబ్బాయి ఆ తరువాత ఒక ఫ్లవర్
వేజ్
ఫ్యాక్టరీకి మారినట్టు రాసి ఉంది. అక్కడ అతను రకరకాల రంగులు, నమూనాలలో డిజైన్లు తయారు చేసి గొప్ప పనితనం చూపించాడు.
అతని శరీరానికి, అంతకు ముందులాగ కష్టాలు లేవు.
తాను తయారు చేసిన అన్నిటికన్నా అందమయిన వేజ్ను ఆ అమ్మాయికి పంపించానని కూడా అక్కడ
ఉంది.
‘లేదు, నాలుగయిదు సంవత్సరాల పాటు ఆగకుండా నేను వేజ్లు తయారు
చేశాను. దానికంతా ఆ అమ్మాయే ప్రేరణ’ `
అక్కడ రాసిన
సంగతుల సారాంశం ఇది ` ‘నాలో సామాజిక వర్గాల గురించిన
జాగరూకత కలగడానికి కూలీగా నా అనుభవం కారణమా లేక మధ్యతరగతి అమ్మాయి పట్ల ప్రేమ
కారణమా? రక్తం కక్కుకోవడం అప్పట్లో చాలా
సాధారణం ` మొత్తం రక్తంకక్కి చచ్చినా
సాధారణమే. అది తరుముతున్న ఒక శత్రువు దీవెన. ఒక అవమానం. చాలాకాలం క్రితం ఒక యోధుని
కూతురు, పోయిన అతని కోటను, శత్రువు దయతో
సంపాదించింది. అయితే చివరికి ఆ కూతురు తన తండ్రిని చంపిన మనిషికి ఉంపుడుగత్తెగా
మారవలసి వచ్చింది. ఆమె నా బతుకును కాపాడడం ఆ అమ్మాయి అందించిన మొదటి దీవెన. కొత్త
ఉద్యోగం వెతకడానికి అవకాశం కల్పించడం రెండవ దీవెన. కానీ నా కొత్త ఉద్యోగం గురించి
ఆలోచించండి ` నేను ఏ వర్గం కొరకు వేజ్లు
తయారు చేస్తున్నానో, నేను నా శత్రువుకు
ఉంపుడుగత్తెనయ్యాను. ఆమె అంత అందంగా ఎందుకుందో తెలిసింది. నాకు దీవెనలు ఎందుకు
తెలిసింది. ఒకమనిషి సింహంలాగ నాలుగు కాళ్లమీద నడవలేనట్టే, నేను కూడా ఆ అమ్మాయి గురించిన కలను కడిగివేయలేను. ఆ అమ్మాయి
అందం నాశనమయినట్టు భావించాను. వర్గపోరాటంలో ముందు నిలిచినా, నేను ఒక గాజు పలకను
మాత్రమే. ఒకేఒక్క గాజు ముద్దను. అయినా ఈ కొత్తకాలంలో గాజును మోయనివారెవరు? ముందు మన శత్రువులు ఆ బరువును మోసేలా చూడాలి’ అలా సాగుతుంది
కథ.
కథ
చదివిన తరువాత యోకో ఏదో ఆలోచిస్తూ దూరాలకు చూడసాగింది. ‘వేజ్ ఏమయిందో’ అన్నది.
భార్య
ముఖంలో అటువంటి భావన అతను ఎప్పుడూ చూడలేదు. ‘అయినా అప్పటికి నేను చిన్నపాపను’
అతని
రంగు మారింది. ‘నిజమే, నీవు మరొక వర్గంతో పోరాడుతున్నా,
లేదా ఆ మరొక వర్గం స్థానంలోకి మారి నీతో నీవు పోరాడుతున్నా, అన్నిటికన్నా ముందు,
ఒక వ్యక్తిగా
త్వరలోనే నీవు నాశనం చేయబడతావని గుర్తించి తీరాలి.’
అది
సాధారణం. కథలోని అమ్మాయిలో అతనికి కనిపించిన అందం, తాజాతనం
ఇన్ని సంవత్సరాలలో ఒకసారి కూడా అతనికి తోచలేదు. మరి ఆ గూని, పాలిపోయిన ఆరోగ్యంలేని కుర్రవాడికి ఆ శక్తి ఎక్కడినుంచి
వచ్చింది?
Thursday, March 12, 2026
అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....
అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....
ఆ సాయంకాలం సభలో పరమేశ్వరుడు
మాట్లాడినాడు. నారాయణరావు కంఠముకన్న బరమేశ్వరుని కంఠము ఉపన్యాసములిచ్చుటలో నెక్కువ
గంభీరత దాల్చును. అతడు వేలకొలది జనమును దన వాగ్ధారలో ముంచి మెత్తుకొని పోగలడు.
నారాయణరావు గొంతుక యుపన్యాసములో మధురముగా నుండును. ధారాశుద్ధిగలది.
ప్రతివిషయమును గూర్చిలెక్కలు మున్సగు వివరములు చెప్పుచు శ్రోతల హృదయమును
చూరగొనును. బరమేశ్వరుడు లేచి “మానవుని హృదయం విశాలం అవ్వాలంటే దేశాలు
తిరగడం ఒక మార్గం. (ప్రతివిద్యార్థినీ, ప్రతిరైతుకుర్ర వాణ్ణి చివరకు
ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగి రమ్మనాలి, ఆంధ్రదేశం మాత్రం తక్కువ ఉందా! బుషి కుల్యానదికడనుండి
కంచివరకు, సముద్రం, ఇటు, అటు ముచికుందనది, భీమనది మొదలైనవి ఎల్లలు. మన దేశం
ఏలినవాళ్ళు ఆంధ్రులు. మొదట్ల తనకు చరిత్రలో తెలిసివున్నంత మట్టుకు ఆంధ్రులు ఆఖరి
కాణ్వాయణచక్రవర్తిని చంపి తాము చక్రవర్తులై రాజ్యం చేశారు. ఆరువందల సంవత్సరాలు.
తర్వాత ఇక్ష్యాకులు, సాలంకాయనులు, బృహత్పాలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోను, తర్వాత గాంగులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు. ఆంధ్రమహారాజ్యము యొక్క
చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటశాల, నాగార్జునమెట్ట
ముఖ్యమైనవి. ఆంధ్రశిల్ప మత్యంత ప్రాభవము పొందినది. అంత ఉత్తమ శిల్పము నాటికి
నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పాలరాతిలో చెక్కారు.
ఆంధ్రశిల్పం యొక్క గొప్పంతా
చెన్నపురి, లండను, బెర్లిను వస్తు ప్రదర్శనశాలలో ఉన్నది. “పల్లవులున్నూ తమయొక్క చివ్నోలు
కాంచీపురంలో, మహాబలిపురంలో
అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణ ఒడ్డునే
కొండమీద ఉన్నది.”
అతని ఉపన్యాసం వరదలనాటి గోదావరి
నదివలె ప్రవహించుచున్నది.
“మహాబలిపుర
శిల్పంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతులగుంపు, యేనుగుల శిల్పవిన్యాసం మాధుర్యం
వెదజల్లుచుండును. అచ్చట రాతిరథములు, ఒకేరాతిలో దొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, (ద్రౌపదిరథము నున్నవి. ఆ పట్టణమంతయు
సముద్రమున మునిగిపోవుచున్నది.“చాళుక్యుల శిల్పము దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, (ధ్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో ఇంకా అనేక దేవాలయములలో విగ్రహములలో చాళుక్యుల శిల్పచమతృతి
కనబడుతుంది. చాళుక్యదేవాలయములు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవికావు.
“కాకతీయ
శిల్పకళాప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీనటేశ్వరుని
నాట్యామహదానందము చూపించుకొన్నారు. వారి శిల్పములో,
విజయనగర సామ్రాజ్యము, హంపీ, తాడిపత్రి, పెనుగొండ, గుత్తి, మాచెర్ల, లేపాక్షులలో జూడగలము. హంపీ దృశ్యములు జూచిన యే మానవుని
గుండెలు తరుగుకొని పోవు?
“మనహృదయములు
విశాలత నొంది సర్వమానవ (పేమవిలాసితాలు కావలెనంటే కళాపూజకన్న ఇంకోటిలేదు. ఇంతమందిలో
భద్రాచలము ఎంత మంది వెళ్ళారు? భద్రాచలము వెళ్ళుటే ఒకచక్కనియాత్ర. గోదావరిలో పడవలలో ఒక
వారమురో జులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ
పాపికొండల్లో
పడవ మీద ప్రయాణంచేస్తూ
తిప్పలమీద పండుకుంటూ, వెన్నెల్లో తిప్పలమీద పరవశిస్తూ కొండలు, అడవులు, గోదావరీ నీలపు లోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము
చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి.
“అజంతా లోయలో
జలజల ప్రవహించే భోగీరానది ఒడ్డున నిలుచుండి, ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ గోడల్లా పైకెగసి ఉన్న ఆ
కొండలమధ్య కనబడే ఆకాశంచూస్తూ అర్థచంద్రాకృతిగా ఉన్న ఆ విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణకాంతులు ఆకాశాన (ప్రసరిస్తూ కొండ
శిఖరాన్ని ఎరుపు చేస్తూంటే, ఆ దివ్యప్రపంచంలో పూరాతన శిల్పి చెక్కిన విగ్రహాలకుమల్లే అలా నిలుచుండిపోయాము.
“వాతాపినగరములో
పశ్చిమచాళుక్యుల శిల్పచమత్ఫతి ఉన్నది. 50 గుహలు గ్రీకుల లేబ్రినులవలె ఉంటవి. కార్లేగుహలు
అతిపురాతనమగు ఆంధ్ర బౌద్ధగుహలు. రెండువేల రెండువందల సంవత్సరాల క్రితమా గుహలలో
నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కు చెదరకుండా ఉన్నవి.
నాసికలోని గుహలలో ఆంధ్రరాజుల
శాసనములు చెక్కించినారు. బెరంగాబాదు గుహలలో గూడ మంచి విగ్రహములు, చిత్రలేఖనములున్నవి. నానా ఘట్టములలో
ఆంధ్రశాతవాహన (ప్రభువుల శిల్పాలున్నవి. నొకటి. “బీజపురములో గోలు గుంబాజ్ అనేది
ప్రపంచమేలో నున్న పెద్ద గుమ్మటములలో నొకటి. ఆ గుమ్మటములో పెకెక్కి గుమ్మటమున కావల
నీవల నిద్ధరు మనుష్యులుండి ఎంత కేక వేసినా వినబడదు. గుమ్మటము గోడపై పెదవి యొకరూ, చెవి యొకరూ ఆన్చి రహస్యములు, గుసగుసలు సల్పినచో గూడ స్పష్టముగ వినబడును.
దౌలతాబాదు కోట అజేయము.
తినుబండారములు చేరనీయక మాడ్చవలసినదేగాని మానవమాత్రుడా దుర్గమును శౌర్యముచే
చేరలేడు. ధాన్యపురాశివలె అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న కొండను, వరికుప్పవలె చెక్కినారు. కొండచుట్టూ
సమతలానికి నూరడుగుల లతు కందకం నూరడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన
కొండభాగం ఎత్తు నూ ఏభయి అడుగులు. కొండంతా కోటగోడలు,
కొండశిఖరంపై చిన్నకోట, కోటమధ్య రాజభవనం, భవనం శిఖరం మీద ఫిరంగి.
“త్ర్యంబకంలో
గోదావరి పుట్టింది. కోట్లకొలది సంవత్సరాల యీడున్న ఆ కొండ నాలుగువేలు, అయిదువేలు అడుగుల ఎత్తు. సగంఎత్తువరకూ
కంకరా, అడవులూ ఆవరించి ఉంటాయి.
తక్కినభాగం అంతా నల్లటిరాయి. అట్లాంటి ఒక కొండ వెయ్యి, పదిహేనువందల అడుగుల ఎత్తు ఎక్కాము. ఆపైన
ఒక చిన్న గుహ, కోనేరున్ను కోనేటిప్రక్కను
ఒక గోముఖ విగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కలా గోదావరినది పడుతోంది. అసలు అక్కడ అన్నీ కొండలలోంచి ప్రవహించే
జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్నయేటితో కలుస్తాయి. అక్కడి
నుంచి ఇరువది ఐదు మైళ్ళు దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికి గోదావరి రెండువందల
అడుగుల వెడల్పున గొప్ప నదియైనది. ప్రతిష్టానంలో నాలుగువందల అడుగుల వెడల్పు, నిజామాబాదులో ఆరువందల అడుగుల వెడల్పు, భద్రాచలము దగ్గర మైలు, రాజమహేంద్రవరముకడ రెండు మైళ్ళు, ధవళేశ్వరముకడ నాలుగు మైళ్ళు, డెల్హా ముఖమున ముప్పది మైళ్ళు
వెడల్పున్నది.”
పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోలుకొండ, ఒరంగల్లు మొదలగు (ప్రదేశముల వింతలన్నియు కనులకు గట్టునట్లు
పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.
Tuesday, March 10, 2026
నగరం మండుతున్నది - హాల్ మార్ షోడెర్ బెర్గ్ (స్వీడన్) కథ
నగరం మండుతున్నది
హాల్ మార్ షోడెర్ బెర్గ్ (స్వీడన్) కథ
కథ