Tuesday, February 3, 2026

సర్వజ్ఞుని వచనములు : Vachanas of Sarvagna

సర్వజ్ఞుని వచనములు


కన్నడ సాహిత్య రంగంలో 
సర్వజ్ఞ
 (16వ శతాబ్దం) అత్యంత ప్రజాదరణ పొందిన కవి మరియు సమాజ సంస్కర్త. తెలుగులో వేమన ఎలాగో, కన్నడలో సర్వజ్ఞ కూడా అలాగే సామాన్య ప్రజల కవిగా గుర్తింపు పొందారు.
సర్వజ్ఞ వచనాలు (త్రిపదులు)
సర్వజ్ఞుడు తన జీవిత సత్యాలను '
త్రిపది
'
 (మూడు పాదాల పద్యం) రూపంలో అందించారు. ఈ వచనాలు సరళంగా ఉంటూనే లోతైన తాత్విక చింతనను కలిగి ఉంటాయి.
  • నిరాడంబర శైలి: ఆయన తన పద్యాల్లో జటిలమైన భాషను కాకుండా, సామాన్యులకు అర్థమయ్యే వాడుక భాషను ఉపయోగించారు.
  • సామాజిక సంస్కరణ: కుల వివక్షను ఎండగట్టడం, మూఢనమ్మకాలను వ్యతిరేకించడం మరియు నీతి నియమాలను బోధించడం ఆయన వచనాల ప్రధాన ఉద్దేశ్యం.
  • అంకితనామం: ప్రతి పద్యం చివర "సర్వజ్ఞ" అనే పేరుతో ముగుస్తుంది, ఇది ఆయన సంతకం లాంటిది.
  • ముఖ్యమైన ఇతివృత్తాలు: విద్య, గురు భక్తి, మానవత్వం, మరియు దానగుణం వంటి అంశాలపై ఆయన వేలకొద్దీ త్రిపదులను రచించారు.

Monday, February 2, 2026

పాబ్లో నెరూడా కవిత Poem of Pablo Neruda translated to Telugu. english ve...

పాబ్లో నెరూడా కవిత


 KEEPING QUIET

by Pablo Neruda

 తెలుగు అనువాదం

నిశ్శబ్దం

మనమంతా యిప్పుడు పన్నెండు దాకా లెక్క పెడదాం

ఇక అందరమూ మవునంగా ఉందాం

 

ఈ భూమ్మీద కనీసం ఒకసారి

మనం ఏ భాషలోనూ మాట్లాడకుండా ఉందాం

ఒక క్షణం మనం ఆగుదాం

చేతులు అంతగా ఆడించకుండా ఉందాం.

అదొక అపరిచిత క్షణమవుతుంది

తోపుడు ఉండదు, ఇంజన్లు ఉండవు

ఒక అకస్మాత్తు అపరిచితత్వంలో

మనమందరమూ కలిసి ఉంటాం

 

చల్లని సముద్రంలో జాలరులు

తిమింగలాలను బాధించరు

ఉప్పు కూడదీస్తున్న మనిషి

కమిలిన తన చేతులను చూచుకుంటాడు.

 

పచ్చని యుద్ధాలను సిద్ధం చేసేవారు,

గ్యాసుతో యుద్ధం, అగ్గితో యుద్ధం,

ఎవరూ మిగలని విజయాలూ,

ఆ తరువాత శుభ్రమయిన దుస్తులు ధరించి

ఇక తమ సోదరులతో కలిసి

నీడలో, ఏం చేయకుండా నడుస్తారు

 

నేను కోరినదాన్ని పూర్తి పనిలేమితో

పోల్చి తికమక పడకండి.

జీవితమంటే దాని గురించే

నాకు మరణంతో ఏ బంధమూ అవసరం లేదు.

 

మన బతుకులను కదలుతూ ఉంచడం గురించి

అందరమూ ఇంత ఏకాగ్రచిత్తంతో ఉంటే

ఒక్కగాసారి ఏం చేయలేకుండా ఉంటే

బహుశః ఒక మహత్తర నిశ్శబ్దం

మనల్ని మనం అర్థం చేసుకోలేనితనం

మనల్ని మనం మరణంతో బెదిరించడాలనే

ఈ విషాదానికి అడ్డు తగులుతుందేమో

 

అంతా చచ్చినట్టు కనబడినప్పుడు

తరువాత బతికే ఉందని రుజువయినప్పుడు

భూమి మనకు ఏదో బోధిస్తుందేమో

 

ఇప్పుడిక నేను పన్నెండు దాకా లెక్కబెడతాను

మీరు ఊరికే ఉండండి నేను వెళ్లిపోతాను

English version

Keeping Quiet


Now we will count to twelve

and we will all keep still.

 

For once on the face of the earth,

let’s not speak in any language.

let’s stop for one second,

and not move our arms so much.

It would be an exotic moment

without rush, without engines.

we would all be together

in a sudden strangeness.


Fisherman in the cold sea

would not harm whales

and the man gathering salt

would look at his hurt hands.

 

Those who prepare green wars,

wars with gas, wars with fire,

victories with no survivors,

would put on clean clothes

and walk about with their brothers

in the shade, doing nothing.

 

What I want should not be confused

with total inactivity.

Life is what it is about.

I want no truck with death.

 

If we were not so single-minded

about keeping our lives moving,

and for once could do nothing,

perhaps a huge silence

might interrupt this sadness

of never understanding ourselves

and of threatening ourselves with death.

 

Perhaps the earth can teach us

as when everything seems dead

and later proves to be alive.

 

Now I’ll count to twelve

and you keep quiet and I will go.

 

Every single poem in Extravagaria is rewarding beyond words, beyond time. Complement it with Neruda’s beautiful metaphor of the hand through the fence and the story of his extraordinary life adapted in an illustrated love letter to language, then revisit Paul Goodman on the nine types of silence and the lovely The Quiet Book.

 

 

 

 

 

 

Saturday, January 31, 2026

రుచిలేని కుక్కరు బ్రతుకులు Cooker Bratuklu

రుచిలేని కుక్కరు బ్రతుకులు


తిండి గురించి నా వ్యాసం.

Thursday, January 29, 2026

శ్రీపాద గురించి వాకాటి మాటలు : Vakati Pandurangarao's words about Sripad...


శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గురించి

వాకాటి పాండురంగరావు గారి మాటలు 


అత్తరు’ శాస్త్రిగారు

          తెలుగు కథావనంలో విరబూసిన దివ్యపారిజాతం సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదం!  పదాలలో అన్నమయ్యా, పద్యాలలో వేమనలకు వలెనే కథలలో అచ్చతెనుగుతనం ఆఘ్రాణించాలి అంటే శ్రీ పాదవారే శరణ్యం. వారి కథలకు వారే నిర్వచనం, వారే కొలమానమున్నూ.... గోదావరికీ కోనసీమకూ కూడా అంతే కదా!

          నాకో మంచి నవల చదవాలినిపించినప్పుడెల్లా నేనో నవల రాసుకుంటాను’ అన్నాట్ట బెంజమిన్‌ డిజ్రాలీ.... బహుశ శాస్త్రిగారూ అలాగే రాసివుండాలి  తమ కథల్ని.

          కథలంటే ఏమిటో, వాటి పరమార్థం ఏమిటో ఈ సంపుటిలో కాపురం చేస్తున్న, వారి కథాదీపం ‘మార్గదర్శి’ అన్నదాన్లో ఆయనే వివరంగానే చెప్పారు.

          ‘‘కథలంటే పైపైని వున్నాయనుకున్నావేమో! అవి కల్పించడానికి చాల గొప్ప ప్రతిభ వుండాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం వుండాలి. అవి చెప్పడానికి ఎంతో నేర్పుండాలి......కథలు కళ్ళకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనస్సుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కల్గిస్తాయి. జడునకున్నూ కల్పనాశక్తి ప్రతిపాదిస్తాయి.’’

          కల్పనా ప్రతిభ, విశిష్టమైన పరిజ్ఞానం, కథన కౌశలం ` ఇవి పుష్కలంగా పండిన మాగాణి వారి కథల సీమ. వారి కథ దేనిని తీసుకున్నా వెలుగు, పదును, ఉత్సాహం, ఉల్లాసం పఠిత సంస్కార వైశాల్యాన్ని బట్టి పసిఫిక్‌ మహాసముద్రమంతగా లభిస్తాయి.

          మధునా పంతుల సత్యనారాయణశాస్త్రిగారి మాటలలో చెప్పాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘‘ఆంగ్లము కాని, వంగము కాని, మఱియొక వాజ్మయము కాని మర్యాదకైనను చదివిచూచినవారు కారు. విశేషించి ‘హిందీ’ని చేరదీయరాదని వారి వాదము `’’ శ్రీపాద వారిలోని ఈ అంశ ఆయకే చేతనయిన వ్యంగ్య వైభవమంతా సంతరించుకుని ‘శుభికే శిర ఆరోహ’ అన్న ఈ సంపుటిలోని కథ నిండా పరుచుకుని వుంది. ఈ క్రింది సంభాషణ చిత్తగించండి.

          ‘‘ఉత్తరదేశం రాతలో రమా అనే వుంటుందిÑ కాని పలుకుబడి రొమా అని.’’

          ‘‘ఉన్నది ఉన్నట్టే పలికితే యేం?’’

          ‘‘పనికి రాదు, సంస్కృత భాషా సంప్రదాయ ప్రకారం ‘రొమా’ అనే పలకాలి. మనవాళ్ళకి హ్రస్వాకారం యెలా పలకాలో తెలియదు.’’

          ‘‘అయ్యో... అయితే అ ఆలు ఎలా పలకాలంటావోయ్‌?’’

          ‘‘ఓ ఆ అని!’’

          (ఇదంతా విని మూడోపాత్రయిన అన్నపూర్ణ అంటుంది) ‘‘మరి అంత తెలిసినవాడు కదా ఓ ఆ అని, అంటాడేమిటి బావ, నాన్నారూ, ‘ఒఆ  ఒని ఒనాలి’ కాదండి!’’

          1891`1961 సంవత్సరాల మధ్య జీవించిన ఈ కథక చక్రవర్తి ఆనాటి సమాజంలో పెల్లుబికిన అనేకానేక మార్పుల ఉప్పెనలను చదివి, వాటి దిశనూ సారాంశాన్ని గ్రహించి, తన కథలలో ఎంతో పోడిమితో పోహణించారు.

          తలిదండ్రులు ` పిల్లలు, సంప్రదాయం ` ఆధునికత, కులము ` గుణము, పెళ్ళి ` ప్రేమ, బానిసత్వం ` స్వాతంత్య్రం లాంటి ద్వంద్వాలన్నిటిలోనూ ఆయన అటుకన్నా ఇటే మొగ్గి తాను ఇరవయ్యవ శతాబ్దం వాడినని మాత్రమే కాదు, ఇరవయ్యొకటవ శతాబ్దానికి కూడా స్నేహితుడినేనని నిరూపించారు. ఇది చాల హర్షణీయమైన అంశమేÑ కాని శ్రీపాద వారిలో, ఆధునికతలోని అపస్వరాలను పసిగట్టి ప్రక్కకు పెట్టగల తెంపరితనమూ వుంది. అందులోనే  ఆయన పరిపక్వత, పరిపూర్ణత ద్యోతకమవుతాయి. ఈ క్రింది వాక్యాలు గమనించండి.

          ‘‘అడుక్కు తింటూ చెట్టుకింద కాలం గడిపే వాళ్ళని దరిద్రులంటుంది మన సంఘం. ఇది అర్థంలేని మాట. వాళ్ళకి కావలసినంత శక్తి వుందిÑ కాని దానికి వినియోగం లేదు అంతే. అలా లేకపోవడానికి సన్నికృష్ట కారణం. వాళ్ళకి సిగ్గు బిడియమూ లేకపోవడంÑ విప్రకృష్ణ కారణం మన ఆధ్యాత్మిక దృష్టి... ఆధ్యాత్మిక దృష్టి యెప్పుడేర్పడ్డదో అప్పుడే మన పతనం ప్రారంభం అయింది మనకు దాస్యం బలపడినకొద్దీ ఆధ్యాత్మిక చింత పెరిగిపోయింది.’’ అంటూ నిశితంగా మన ఆధ్యాత్మిక దృష్టిని తూర్పారబట్టిన కలమే`

          ‘‘వేద కాలం నుంచీ మన దేశంలో పట్నాలే కాదు నగరాలూ వుండినాయి. అప్పుడు కూడా మన పట్నాలకూ, నగరాలకూ వుండిన ఆకర్షణ, గౌరవమూ పల్లెలకు లేశమూ లేదు. అలా అని అప్పుడెవరూ పల్లెలను నిరసించనూలేదు. నగరాలను దుమ్మెత్తి పోయ్యనూలేదు..... మనం మహోన్నత నాగరికత అనుభవించిన  దినాల్లో పాశ్చాత్యులు ఇప్పుడు మనం వుండిన స్థితి కంటే అధ్వాన్నస్థితిలో వుండినారు`’’

          అని ఆనాటి మేలి అంశాలనూ ఎత్తి చూపగల్గింది.

          ఇంకొక వాక్యం చూడండి.

          ‘‘మనిషి వల్ల వర్తకం పాడవుతోందిÑ గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు `’’ అన్న కీలకవాక్యం నేటి అమెరికా ధోరణి నుండి భారత్‌ లోని బ్యాంక్‌ల ` స్టాక్‌ విఫణుల భాగోతాలదాక వున్న వికారాలకు అర్థం చెప్పడం లేదూ?

          అందుకే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయితగా కనిపిస్తాడు.

          శాస్త్రిగారు చేయి తిరిగిన నాటక రచయిత. అందువల్లనే ఆయన కథలలో కూడా నాటక రచయిత కుండవలసిన దృష్టి వైశిత్యమూ, వర్ణనా వైశాల్యమూ, పాత్ర చిత్రణము, సంభాషణా వైదగ్ధ్యమూ ప్రతిపంక్తిలోనూ సాక్షాత్కరిస్తాయి. అది ఆవిడ వాళ్ళాయనవైపు చూచిన చూపే కానివ్వండి ` ఆడపడుచు నోట నుండి కురిసిన నిప్పుల వానే కానివ్వండి ` దివాన్జీ గారి గీర్వాణమే కానివ్వండి`  ఒకదాత నిర్లక్ష్యం పరికింపుగా, పరికింపు పలకరింపుగా, పలకరింపు సానుభూతిగా,  సానుభూతి శ్రద్ధగా, శ్రద్ధ స్నేహంగా, స్నేహం బంధంగా అంచెలంచెలుగా మెట్లెక్కి మనం అలా చదువుతుండగా మాట వర్ణనయి, వర్ణన జీవమయి, జీవం వ్యక్తి అయి, ఆ వ్యక్తి నువ్వయి, నేనయి ` మనం కథను చదివే పాఠకులమా, లేక అందులోని పాత్రలమా అన్పించేంత అల్కెమీల చిరపుంజీలూ, చిరంజీవులూ ఆయన కథలు.

          కథను చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పిÑ నేపథ్య నిర్మాణంలో శాస్త్రిగారొక చిత్రకారుడుÑ వర్ణనల విషయంలో ఎక్స్‌రే కలం ఆయనది. రెండో మూడో పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథనెత్తుకొని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకుని లాక్కువెళ్ళి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్‌ మార్షల్‌ ఆయన.

           ఈ సంపుటిలోని ` ‘వడ్లగింజలు’ లక్ష్మీ సరస్వతుల మధ్య జరిగిన చదరంగంÑ స్నేహకరచాలనంతో ముగిసిన ఉజ్వల కథనవిలాసం.

          శుభి కే! శిర ఆరోహ।, కన్యాకాలే యత్నా ద్వరితా’ ` శాస్త్రిగారికి వల్లమాలిన ప్రీతిగల సంసార ప్రేమ కథాక్షేత్రంలోని భామాకలాపాలు.

          మార్గదర్శి’ ` అన్ని భాషలలోకి అనువదించి మెట్రిక్‌ పాసయిన ప్రతి వారికి ఉచితంగా పంచిపెట్టవలసిన స్నాతకోత్సవ రచన. దానితో బాటే అందించవలసిన సులోచనాల వంటి కథ ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఎ’

          ఇక మిగిలిందల్లా షకూరల్లీఖాను అంటే సాక్షాత్తూ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రిగారే! అత్తరు సౌరభం కంపుగా వెలవరించుకున్న దివాంజీలు మనమే, తెలుగు పాఠకులమే! ఇప్పటికీ గుబాళిస్తూన్న ‘గులాబీ అత్తరు’ సీసాలా....?

Wednesday, January 28, 2026

కరెంటు - మిఖయిల్ జోషెంకో : రష్యన్ కథ

కరెంటు

మిఖయిల్ జోషెంకో  : రష్యన్ కథ


కరెంటు

మిఖయిల్‌ మిఖయిలోవిచ్‌ జోషెంకో

ఇవాళ రేపు, అన్నలారా, అన్నిటికంటే ఫ్యాషనబుల్‌ మాట ఏమిటి?

ఇవాళటి అన్నిటికన్నా ఫ్యాషనబుల్‌ మాట అదే, “కరెంటు, అంటే ఎలక్ట్రిఫికేషన్‌'.

సోవియట్‌ రష్యాని కరెంటు లైట్లతో వెలిగింపజేయడం అన్నది (ప్రస్తుతం చాలా ప్రాముఖ్యతగల విషయం అనడంలో

అనుమానంలేదు. కానీ, ప్రస్తుతానికి, అందులో కొంత అసౌకర్యంగా కూడా ఉంది. నేనంటున్నది, కామ్రేడ్స్‌, దాని ధర ఎక్కువగా ఉందని మాత్రం కాదు. దానికి డబ్బులు కావాలి అంతే. లేదు, నేను చెప్పేది మరొకమాట.

నేను చెపుతున్నది ఇది:

నేను, కామ్రేడ్స్‌, ఒక పెద్ద బిల్డింగ్‌లో బతుకుతున్నాను. ఆ మొత్తం బిల్డింగ్‌లో పారఫిన్‌ మైనం వాడతారు. మాలో కొందరికి

దీపాలున్నాయి. కొందరికి వత్తి వేసిన నూనె దీపాలున్నాయి. ఇక అందరికన్నా బీదవాళ్లు చర్చ్‌ కొవ్వొత్తులతో పని గడుపుకోవాలి.

బతుకు అంత సులభమయినది కాదు.

ఇక అప్పుడు అందరూ లైట్లు పెట్టించసాగారు.

మొట్టమొదట హౌజ్‌ మేనేజర్‌ ఇంట్లో. తన గదిని అతను వెలుగుతో నింపాడు

- అంతే. ప్రశాంతంగా ఉంటాడు. అతని

ఆలోచనలను బయట పడనివ్వడు. వింతగా అటూఇటూ తిరుగుతూనే ఉంటాడు. తెలియకుండానే తరచూ ముక్కు చీదుతూ ఉ౦టాడు. అయినాసరే తాను దేన్నిగురించి ఆలోచిస్తున్నాడన్నది మాత్రం బయటకు రానివ్వడు.

ఇక అప్పుడు మా ఆవిడ అనే, యెలిజవెతా ఇగ్బాత్యేవ్నా |ప్రాఖరోవా, లోపలికి వచ్చేసింది. మనం కూడా అపార్ట్‌మెంట్‌ని

వెలిగించాలంటుంది. అందరూ లైట్లు పెట్టిస్తున్నారు. డైరెక్టర్‌ కూడా లైట్లు పెట్టించాడు" అంటుంది ఆమె. కనుక - ఇక - మేమూ అదే పని చేశాము.

లైట్లు పెట్టేశారు. అపార్ట్‌మెంట్‌ వెలుగుతో నిండింది - ఓహో పైలోకం! ఏం మురికి, ఏం చీదర!

అప్పటివరకు, నీవు పొద్దున్నే లేచి పనిలోకి పోతావు, సాయంత్రం తిరిగి వచ్చేస్తావు, నీటీ తాగేస్తావు, ఇక పడక చేరుకుంటావు.

కేవలం పారఫిన్‌ వెలుగులో ఒక్క విషయం కూడా నీవు చూడజాలవు. మరి ఇప్పుడో వెలుగు నిండిపోయిన తరువాత – గోడమీద ఊడి ఊగిసలాడుతున్న వాల్‌పేపర్‌ ఇంకా నేలమీద పడిఉన్న ఎవరిదో అరిగిపోయిన స్లిప్పర్‌ అన్నీ కనబడతాయి. పాకుతున్న ఒక నల్లి, వెలుగునుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తూ నీకు కనబడుతుంది. ఇక్కడొక పాత చింపుగుడ్డ, అక్కడొక ఉమ్మి కళ్లె, ఒక సిగరెట్‌ ముక్క ఎగురుతున్న ఒక మిన్నల్లి....

ఓహో పైలోకం! నైట్‌ వాచ్‌మన్‌ను పిలవడానికి ఇక అది చాలు. అలాంటి దృశ్యం చూడడం దు:ఖకరం.

మా గదిలో, ఉదాహరణకు, మాకొక సోఫా ఉంది. అది ఏమంత చెడ్డ సోఫా కాదని నేను ఎప్పుడూ అనుకునే వాడిని -

నిజానికి మంచి సోఫా అనుకున్నాను! సాయంత్రాలలో నేను దానిమీద కూచునేవాడిని. ఇక ఇప్పుడు & ఎలక్ట్రిసిటీతో - ఓహో

'పైలోకం! అది సోఫానా! అక్కడా ఇక్కడా పైకి చొచ్చుకువచ్చిన ముక్కలు, కొన్ని వేళ్లాడే ముక్కలు, కొన్ని రాలిపడుతున్న ముక్కలు.

అటువంటి సోఫా మీద నేను ఎలా కూచోగలను? నా ఆత్మ ఘోషిస్తున్నది.

లేదు, నేను, పెద్ద లగ్జరీలో బతుకుతున్నానని అనుకోవడం లేదు. చూచిన ప్రతి వస్తువూ తిరగబడుతున్నట్టు కనబడుతున్నది.

చేస్తున్న ప్రతి పని తప్పుదారి పడుతున్నది.

అప్పుడు నేను డియర్‌ ఎలిజబెతా ఇగ్బాత్ర్యేవ్నాను చూచాను. ఆమె దు:ఖంగా కనిపించింది. తనలో తాను మాట్లాడుకుంటున్నది.

వంటింట్లో వస్తువులను సర్దుతున్నది.

'దేని గురించి దుఃఖంగా ఉన్నావు, నా ప్రియమయిన భార్యామణీ?” నేను అడిగాను.

ఆమె భుజాలు ఎగరేసింది.

ప్రియమయిన మగాయనా, ఇంతకాలంగా నేను ఎంత మురికి బతుకు గడిపానో నాకే తెలియదు” ఆమె అన్నది.

నేను మా వస్తువులవేపు చూచాను. పెద్ద గొప్పవి ఏమీ కావని అనుకున్నాను. మురికి, ఇంకా చీదర, ఒకరకం పీలికలు, ఇక మరోరకం పీలికలు, అన్నింటిమీదా వెలుగు వెల్లువెత్తి అన్నీ నీకంట్లోకి సూటిగా చూస్తున్నాయి.

సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు నాకు నోట్లో ఏదో తట్టుకున్నట్టు ఉంటుందని, మీరు అనవచ్చు.

నేను వస్తాను, లైటు వేస్తాను, కొద్దిసేపు దాన్ని బాగా చూస్తాను, ఆ తరువాత మాత్రం ముఖాన్ని తలగడలో దాచుకుంటాను.

అప్పుడు నేను ఆలోచనలో పడతాను. జీతం అందుకుంటాను. ఆ తరువాత సున్నం కొన్నాను, దాన్ని బాగా కలిపాను - ఇక

పనిలోకి దిగాను. వాల్‌ పేపర్‌ని లాగేశాను, నల్లులను నలిపేశాను, బూజులను దులిపేశాను. సోఫాను సర్దాను, రంగులు వేశాను,

పొంగిపోతూ చూచాను - నా ఆత్మ ఇప్పుడు పాడుతూ ఆనందంగా ఉంది.

నేను మంచిపని చేశాను. కానీ మరీ అంత మంచిపని కాదు. అంతా వ్యర్థమయింది ప్రియమయిన అన్నలారా, ఆ డబ్బులన్నీ

గాలిలో పోయాయి. మా ఆవిడ తీగలు కత్తింరించేసింది.

లైటు ఉంటే బతుకు భయంకరమయిన మురికిగా కనిపిస్తుంది, ఏమంటావ్‌, మన బీదతనం మీద లైటు వెలిగించడమేనా?

నల్లులు కూడా నవ్వలేక చచ్చిపోతున్నాయి” అన్నది ఆమె.

నేను ఆమెను అడుక్కున్నాను, ఆమెతో వాదం వాదించాను. అయినా లాభం లేదు.

కావాలంటే నీవు మరో అపార్ట్‌మెంట్‌లోకి మారవచ్చు. నేను మాత్రం లైట్‌లో ఉండడానికి రాను. నా దగ్గర ఇంటిని మళ్లీ

బాగు చేయించడానికి, దాన్ని కొత్తదిగా మార్చడానికి డబ్బులు లేవు” ఆమె చెప్పింది.

కానీ, నేను మాత్రం ఎలా మారగలను, కామ్రేడ్స్‌, సున్నం పేరున బోలెడంత ఖర్చు పెట్టాశాను మరి? నేను లొంగిపోయాను.

లైట్లు మంచివే, అన్నలారా, కానీ వాటితో బతకడం మాత్రం సులభం కాదు.

(1924 కథ)