Saturday, September 21, 2019

Satyam Asatyam

Truth and untruth
My article from Andhrabhoomi



ఒకసారి సంక్రాంతి పండుగకు నల్లగొండలో ఉన్నాను. అప్పటికి నేను రేడియోలో పని చేస్తున్నాను. ఆ సంవత్సరం పండుగ ఈనాడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలామందికి వచ్చింది. ప్రభుత్వం వారు ఒక సంగతి నిర్ణయించారు. కానీ సంప్రదాయ పనులు మాత్రం మరొక మాటగా నిర్ణయించుకున్నారు. రేడియో అన్నది ప్రభుత్వం వారి బాకా కనుక నేను వారు చేసిన నిర్ణయం ప్రకారం పండుగ ఫలానా నాడు అని వివరాలను ప్రకటించాను. వ్యక్తిగతంగా మాత్రం పాత పద్ధతులను పాటిస్తున్నాను కనుక పండుగ నేను ప్రభుత్వం చెప్పిన నాడు చేసుకోవడం లేదు. పక్కింట్లో ఒక అక్కయ్య ఉండేది. ఆమె ఆదరాబాదరాగా వచ్చింది. మా ఆవిడను నిలదీసి పండుగ ఇవ్వాలంట కదా, రేడియోలో చెబుతున్నారు, అని అడుగుతున్నది. నేను ఆమెను పిలిచాను. అమ్మా, ఎవరు చెబుతున్నారు అని అడిగాను. ఒక క్షణం ఆలోచించి ఆమె, అయ్యో అది మీ గొంతు అన్నది. తరువాత వాళ్లు పండుగ ఏనాడు చేసుకున్నారో నాకు తెలియదు. ఈ ప్రపంచంలో సత్యాలు అలా ఉంటాయి.
రచయితగా కొనసాగుతున్నాను. కథలు కాక సత్యాలు రాస్తున్నాను అనుకుంటున్నాను. కనుక ఏ రెండు అక్షరం ముక్కలు కాగితం మీద పెట్టినా వాటిలోని సత్యాసత్యాలను గురించి గట్టిగా ఆలోచించాలి అన్న ఒక పద్ధతి మెదడులో గట్టిగా పాతుకుపోయింది. ఏదో రాస్తాము. సందర్భానికి తగినట్టుగా బహుశా రాసి ఉంటాము. కొంతకాలం తరువాత ఆ పరిస్థితులు మారుతాయి. అప్పుడు మనం రాసిన సంగతులు సత్యం కాకుండా పోతాయి. ఎవరో వచ్చి అప్పటి రాతల గురించి అడుగుతారు. చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది.
సత్యాలు లక్షల కొద్దీ ఒకచోట చేర్చినా వాటివల్ల ఏ ప్రయోజనం ఉండదు అని ఎక్కడో రాసి ఉండటం చదివాను. ఇంగ్లీషులో ట్రీవియా అని ఒక మాట ఉంది. అవి సత్యాలే. కానీ ఎవరికి పనికి వస్తాయో తెలియదు. వాటిని తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఉందా లేదా కూడా తెలియదు. అయినా అవి సత్యాలు. బహుశా సరదాగా ఉంటాయి. కానీ ప్రపంచం మొత్తం దీనికి విపరీతమైన పద్ధతిలో జరుగుతున్నది.
పొద్దునే్న వార్తాపత్రిక వస్తుంది. అందులో రకరకాల సంగతులు రాసి ఉంటాయి. ఆ వార్తాపత్రిక కలకాలం ఉండిపోతుంది. కానీ అందులో రాసిన సంగతులు కొన్ని సత్యాలు కావు అని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒక ప్రమాదం జరుగుతుంది. అందులో హతులైన వారి సంఖ్యను ఏ రెండు పత్రికలూ సమానంగా చూపించవు. ఆ తేడా ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. ఎవరికి అనుకూలంగా ఉండే విషయం, అందుబాటులో ఉండే విషయాన్ని వారు చెబుతారు అని నా అనుమానం. రోడ్డు మీద ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని అందరూ చూస్తారు. మరునాడు దాన్ని గురించి పేపర్లో వస్తుంది. అక్కడ జరిగింది ఒకటైతే, దాన్ని గురించి రాసిన తీరు మరొకటిగా ఉంటుంది. పరిస్థితి అలాగ ఉందని ముందుకు వచ్చి ప్రశ్నించే వారు ఉండరు. నేను ఒక బిల్డింగ్‌లో, నా ఇంట్లోనే ఉన్నాను. ఆ బిల్డింగ్‌లో కింద ఖాళీగా ఉండవలసిన ప్రాంతాన్ని యజమాని తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. మునిసిపాలిటీ వాళ్లు వచ్చారు. గోడలో 4 ఇటుకలు పడగొట్టారు. ఆలోగా యజమాని వచ్చి వారి పద్ధతిని మార్చే ప్రయత్నం ఏదో చేసినట్టు ఉన్నాడు. గోడ సలక్షణంగా అలాగే ఉండిపోయింది. మరురోజు పత్రికలో కింద సెల్లార్ పూర్తిగా పడగొట్టినట్టు వార్త వచ్చింది. గోడలు పడగొట్టే బాధ్యతగల మున్సిపాలిటీ వారు అటువంటి వార్తలు పత్రికకు అందజేశారు. వారు సత్యాసత్యాలను తెలుసుకోకుండా ప్రచురించారు. నేను ప్రయత్నించి ఆ పత్రికకు ఫోన్ చేశాను. అక్కడి వారు నన్ను దుర్భాషలాడారు కానీ, అసలు విషయం వినడానికి కూడా ప్రయత్నించలేదు. పత్రిక శాశ్వతంగా నిలబడి పోతుంది. అందులోని అబద్ధం శాశ్వతంగా నిలబడిపోతుంది. కూలినట్టు రాసిన ఆ గోడ కూడా శాశ్వతంగా నిలబడి ఉంది. ఇది ఈనాటి సత్యం.
సత్యం వెనుక ఒక తత్త్వం ఉంటుంది. పత్రికలో వచ్చింది తెలుసా? అనే మాట నేను చాలాసార్లు విన్నాను. అంటే పత్రికల్లో వచ్చేవి అన్నీ సత్యాలు కావు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని కదా అర్థం! ఇక విషయానికి వస్తే, అవి పత్రికలకన్నా వేరుగా ఉంటాయి అని నేను అనుకోను. చాలా విషయాలు ఇట్లాగే అరకొరగా పుస్తకాలలోకి చేరుకుంటాయి. అవి శాశ్వతంగా నిలబడతాయి. తర్వాతి ప్రపంచాన్ని మోసపుచ్చుతాయి. జరిగిన విషయాలను జరగనట్టు, జరగని విషయాలను జరిగినట్టు చరిత్ర చెబుతూ ఉంటుంది. కనుక చరిత్రను నమ్మడానికి లేదు. చరిత్ర అన్నది నిజంగా సత్యం అయితే ప్రపంచం ఇలాగే ఉండేది కాదు. చరిథ్ర ఎవరు చెప్పారు? ఏ ప్రయోజనం కొరకు చెప్పారు అన్న దాన్నిబట్టి అందులోని సత్యాసత్యాల నిగ్గు తేలవలసి ఉంటుంది. బ్రిటిష్ వారు భారతదేశపు చరిత్రను తమకు అనుకూలంగా రాసుకున్నారు అన్న వాదం బలంగా ఉంది. అసలు చరిత్రను గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరికీ ఉన్నట్టు కనిపించదు. కనుక ఎవరు చెప్పినది అయినా మొత్తానికి ఒక చరిత్ర చెలామణి అవుతూ ఉంటుంది. పాశ్చాత్య దేశాలలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల వారు భారతదేశపు చరిత్రను విస్తృతంగా రాయించి పుస్తకాలుగా వేశారు. వాటన్నిటినీ కాకున్నా కొన్నిటిని చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలను గురించి ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, అర్థంకాదు. చరిత్రలో మధ్యన ఖాళీలు కనిపిస్తాయి. వాటికి కారణం మాత్రం ఎవరూ చెప్పరు. వెండీ డోనిగర్ అనే ఆవిడ భారతదేవపు గతం గురించి ఒక పుస్తకం రాసింది. అది నాకు చాలా పక్షపాత దృష్టితో రాసినట్టు కనిపించింది. అట్లా రాయవలసిన అవసరం ఏమిటో తెలియదు. అలాగే ఇర్ఫాన్ హబీబ్, రొమిల్లా థాపర్, మరొక ప్రసిద్ధ బెంగాలీ చరిత్రకారుడు మొదలైన వారి పుస్తకాలన్నీ అవి ఇంకొక ధోరణిలో ఉంటాయి. అన్నీ చదువుతూ ఉంటే అసలు సంగతి ఏమిటి అన్న అనుమానం మొదలవుతుంది.
కొన్ని సత్యాలు, అసత్యాలుగా రుజువయ్యే వరకు మాత్రమే నిలబడి ఉంటాయి అన్న పద్ధతి ఒకటి ఉంది. సైన్స్‌లో ముఖ్యంగా శాశ్వత సత్యాలు ఉండవు అంటారు. సైన్స్ అంటే సత్యాల పరంపర అని కూడా వాళ్లే అంటారు. సూచించిన పదధతులలో మాత్రమే, ఈ విషయాలు సత్యాలు అన్న ఒక రైడర్ ప్రతి సత్యం మీద ఉంటుంది. నీరు నూరు డిగ్రీల వద్ద మరుగుతుంది, అన్నది ఒక సత్యం. కానీ ఆ స్థలంలో వాతావరణ వత్తిడి ఎంత ఉంది అన్న దాన్నిబట్టి ఈ సత్యం మారుతూ ఉంటుంది. అంటే అది శాశ్వత సత్యం కాదు. మరొక విధంగా రుజువయ్యే వరకు మాత్రమే సత్యాలు అనేవి మరికొన్ని ఉన్నాయి. ఐన్‌స్టైన్ ఓ సిద్ధాంతం చేశాడు. అందరూ అవును అంటూ ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి మరొక పరిశోధకుడు వచ్చి, ఆయన చెప్పింది నిజం కాదు తెలుసా అంటాడు. అప్పుడు అందరూ అంగీకరిస్తారు. చరిత్ర విషయంలో కూడా ఇటువంటి పద్ధతిని పాటించవచ్చు అంటే కొంచెం చిక్కులు వస్తాయి. కొన్ని సంగతులు అందరికీ తెలిసి ఉంటాయి. కానీ ఎవరూ ముందుకు వచ్చి ఇది అసలు నిజం అని చెప్పడానికి సిద్ధం కారు. అందుకు సామాజిక కారణాలు, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఆ విషయం గురించి సత్యాన్ని నిరూపించవలసిన అవసరం కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు. అందరికీ తెలిసిన ఆ సత్యం అలాగే బయటపడకుండా నిలబడిపోతుంది.
వ్యక్తిగతమైన అంశాలలో ఇటువంటి పరిస్థితి మరీ ఎక్కువగా వస్తుంది. నా విషయంలోనే నాకు కొన్ని సంగతులు తెలుసు. నేను వాటిని ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. చెప్పనందుకు ఎవరికీ అపకారం కూడా జరగదు. కనుక నేను వాటిని బయటకు చెప్పను. ఒకవేళ చెబితే అది కొంతమందికి ఆసక్తికరంగా ఉండవచ్చు. మరి కొంతమందికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయినా నేను కొన్ని సంగతులు బయటపెట్టను. ఆ సత్యం నాలోనే మిగిలిపోతుంది. నాకు చాలా రోజులుగా కథలు నవలలలో ఎదురైన కొన్ని సంగతులను గురించి మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. బుచ్చిబాబుగారి చివరకు మిగిలేదిలో దయానిధికి, కోమలికి మధ్యన శరీర పరంగా ఎటువంటి సంబంధం లేదు. మానసికంగా ఏమి ఉందో ఎవరికీ అర్థం కాదు. అమృతంతో ఏం జరిగింది అన్నది బయటపడదు. ఇదే రకంగా ప్రపంచ విఖ్యాత రచయిత ఆల్బర్ట్ కామూ నవలలో కూడా చిత్రమైన పరిస్థితులు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. నాయకుడు అమాయకుడు అని పాఠకునికి తెలుసు. కథలోని వారికి మాత్రం తెలియదు. కనుక కథ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. అందరూ అతడిని అసహ్యించుకుంటారు. మనకు అసలు సత్యం తెలుసు గనుక, ఆ అసహ్యించుకునే వారి మీద కోపం పుడుతుంది. రచనకు రూపం పోయడంలో ఇంతకన్నా గొప్ప పద్ధతి మరొకటి ఉండదు అనిపిస్తుంది. ఇటువంటి ఉదాహరణలు చాలా చెప్పగలను. కనుకనే నాకు సత్యం గురించి గట్టి ఆలోచనలు పుడుతుంటాయి.
తెలుగు సినిమాలలో, బహుశా ఇతర భాషలలో కూడా, ఒక వ్యక్తి ఒక సత్యం చెప్పనందుకు మొత్తం సినిమా నడుస్తుంది. అవి నేను బెనారస్‌లో చదువుకుంటున్న రోజులు, అంటూ ముఖం మీద రింగులు చూపించి అసలు సత్యం బయట పెడతారు. అప్పుడు కథ ముగుస్తుంది. సత్యాలు నిజంగా ఉంటాయా అన్న అనుమానం నాకు కలుగుతుంది. పదుగురాడుమాట పాటియై ధర చెల్లు అని ఒక మాట ఉంది. అందరూ కలిసి అదే పనిగా ఒక సత్యాన్ని లేదా అసత్యాన్ని బలంగా నమ్మి ప్రచారం చేయడం మొదలుపెడతారు. అప్పుడు సత్యంగా మిగిలిపోతుంది. కలియుగమున శక్తి మొత్తము సంఘములోనే ఉన్నది అని అర్థం వచ్చే ఆర్యోక్తి ఒకటి మనకు ఉండనే ఉంది. అంటే ఈ సంఘం అనే విషయాన్ని సత్యంగా ముందుకు తీసుకుపో దలుస్తుందో దాన్ని మాత్రమే సత్యంగా గ్రహించవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఉన్నాడు అన్నారా ఇటువంటి సత్యానికి మొదటి ఉదాహరణ అని నా అభిప్రాయం. దేవుడు అంటే దేవులాట అనే పని చేయడం. అంతే వెతకడం. దేవుడు అంటే వెతకడం అని అర్థం. ఇక్కడ మార్గమే గమ్యం. ఆ దేవులాట ముగిసి దేవుడు దొరికితే ఆ తర్వాత ఏం చేయాలి? అది సమస్య! కనుక కలకాలం దేవులాట సాగాలి.
ఒకరికి సత్యంగా తోచింది మరొకరికి అసత్యంగా తోచే అవకాశం ఉంటుంది. ఇద్దరు వాదించుకుంటున్నారు. మూడవ మనిషి వచ్చాడు. మీ మధ్యన మూడు సత్యాలు ఉన్నాయి. మీరిద్దరూ ఎవరికి వారు నమ్ముతున్నవి అయితే మీరు కలిసి చేరవలసిన అసలు సత్యం మూడవది అన్నాడు ఆ మూడో మనిషి. అతనికి కూడా 3 సత్యాలలో ఏదీ తెలియదు. వీళ్లు తమతమ రెండు సత్యాలను చెప్పినప్పటికీ అతని బుద్ధి ప్రకారం వాటిలో ఒకదానిని ఎంచుకోగలదేమో కానీ, అసలైన మూడవ సత్యం ఉంది అని అన్నప్పటికీ దాన్ని అతను చూడగలుగుతాడా? అన్నది అసలు ప్రశ్న. అన్ని విషయాలు, అన్ని సత్యాలు నూటికి నూరుపాళ్లు సత్యం కావడానికి వీలు లేదు. కొన్ని మాత్రమే పూర్తి సత్యాలు కలుగుతాయి. మరికొన్ని పాక్షి సత్యాలుగా ఉంటాయి. కల్తీ కలిసినప్పుడు ఒక సత్యం, సత్యంగా నిలబడడం కష్టమవుతుంది.
అందరికీ అనుకూలంగా వినిపించని ఒక విషయం చెబుతాను. ఈ మధ్యనే యూరోపు దేశాల నుంచి వచ్చిన ఒక అపరాధ పరిశోధక నవల చదివాను. మొదటి నుంచి నాకు మెదడులో ఈ విషయం గురించి ఆలోచన ఉన్నా దాన్ని మరీ ముందుకు తీసుకుపోలేదు. విషయం చెప్పిన తరువాత మీకే అర్థం అవుతుంది. ఒక వ్యక్తికి తల్లి ఎవరు అన్న సంగతి నూటికి నూరు శాతం నిజంగా తెలిసి ఉంటుంది. అందులో ఏ మాత్రం తేడా రావడానికి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తికి తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం సాంఘిక మర్యాద ప్రకారం అంగీకరించవలసినదే. కానీ ఆ తల్లి నోరు విప్పి చెప్పే దాకా అసలు విషయం బయటకు రాదు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ల అందరినీ నేను అనుమానించడం లేదు. కానీ చాలామంది ఈ రకమైన పరిస్థితులకు గురి అయినట్లు నాకు గట్టి అనుమానం. వ్యవస్థలో ఎంతటి గట్టిదనం ఉన్నప్పటికీ మనుషుల మెదడులో మాత్రం అది ప్రతిబింబించదు. ఆడ మగ ఆనాటి నుండి ఈనాటి వరకు తమ ఇష్ట ప్రకారం లైంగిక జీవితాలు గడుపుతున్నారు. సమాజంలోని సమస్యలకు సగం వరకు లైంగిక సంబంధాలే కారణం అని మానసిక శాస్తవ్రేత్తలు కూడా ఒప్పుకున్నారు. పురాణ కాలం నుంచి మొదలు ఇవాళటి వరకు ఇటువంటి పరిస్థితులను గురించి మనకు కావలసిన అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. సినిమాల గురించి నేను చేసిన ప్రసక్తి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక భాగంగా నిలబడుతుంది. సత్యం అన్నది సంపూర్ణ సత్యమా, సాపేక్ష సత్యమా, అన్న ప్రశ్న వచ్చిన తరువాత అది సత్యమే కాదు.

Thursday, September 19, 2019

M S Gopalakrishnan - R T P

Shravanam for those who are interested!

People appear to be disinterested....
But, I do what I do for those who still want to listen to good Music....


Sri M S Gopalakrishnan 

Ragam tanam pallavi in Kambhoji



Music is for listening.
Not for storing.....

Naradaguruswami - T M Thyagarajan

Shravanam

Master singer and teacher 

Sri T M Thyagaran sings

Naradaguruswami in Darbar




pallavi
nArada gurusvAmi ikanaina nannAdarimpavEmi I karavEmi

anupallavi
sAreku sangIta yOga naigama pAranagatuDaina parama pAvana

caraNam
itihAssa purANAgama caritamu lavarivella galige 
patini dAnamiyya buddhi satyabhAma ketula galge 
dyutijita sharadabhra ninu vinA muni yatula kevaru galige 
kSitini tyAgarAja vinuta nammiti citta dIrci prahlAduni brOcina

Wednesday, September 18, 2019

Tappi Bratiki Pova - Todi

Shravanam of a rare Song....

I don't know the name of this artist....

Tappi Bratiki Pova in Todi...




pallavi
tappai bratiki pOva taramA rAma kalilO
anupallavi
muppuna viSaya taTAkamuna munugAka dhrDha manasai
caraNam 1
kancu modalu lOha dhana kanakamulanu jUci visamancu mariyu penci kanucu enci aNTina manasai
caraNam 2
nanganAcula mAnagu anga vastramula bAgagu mungurulanu gani antaranga munanu Ashincaka
caraNam 3
jAji malle mandAra sarOjamulanu manasAra rAja pathamucE tyAgarAjanutuni pUjincaka

Lalgudi

Today being the birth anniversary of Sri Lalgudi Jayaraman Sir, I recall your attention to one of my old posta....
https://lokabhiramam.blogspot.com/2010/07/lalgudi-and-son-sukhi-evvaro.html


Music is to be enjoyed.... Not stored.....


Tuesday, September 17, 2019

More Light Please!


Poem by 

NAUSHEEN EUSUF



What are you thinking? I could ask you
the same, but to no avail.
I am thinking of the window. Refulgence.
Luminosity. The grand fiat.

The diaphanous curtains hung between
the light and me—I who see
but do not see. More light, for god’s sake,
more light. Let there be light.

Monday, September 16, 2019

Nature of Nature

Here are three photoigraphs that are stunning.
I personally wish I was there at those spots savouring all the beauty....





Saturday, September 14, 2019

ఎవరు చెప్పాలి?



ఊరికంతా అప్పిగాడు లోకువ, అప్పిగానికి నేను లోకువ అన్నాడట ఆ మహానుభావుడు ఎవరో, అప్పిగానికి తాను ఊరికి లోకువ అన్న సంగతి గురించి బాధ లేదు. తనకు కూడా ఎవరో ఒకరు లోకువ అయితే చాలు. ఇది ఒక అప్పిగానికి మాత్రమే సంబంధించిన విషయం కానే కాదు. మన దేశంలో అందరి మనస్తత్వం ఇట్లాగే ఉంటుంది. మానావమానములను సమానముగా చూడవలెనని సూత్రం చెప్పగలిగిన దేశం మనది. తుల్య నిందా స్తుతిర్మౌనేః అని గదా సూక్తి! రాజపూజ్య అవమానాలు గ్రహచారం కొద్దీ వచ్చేవి మాత్రమే అనుకోగలిగిన మంచి సంప్రదాయం మనది. దూషణ భూషణ తిరస్కారాలకు చలించని గట్టి మనుషులం మనమంతా. అవమానం భరించినందుకు కొంప మునగకపోవచ్చు. అలాగని అన్యాయాన్ని కూడా అంతే సులభంగా భరించడం మనకు అలవాటయింది. ఇందులో కొంచెం తంటా ఉంది. రాజకీయాల్లో తప్ప ఓడిపోయిన వారికి ఎవ్వరికీ కోపం రాదు. అందుకే మన వాళ్లు ఆటల్లో ఓడి కూడా జల్సా చేసుకోగలరు. కోర్టులో వ్యాజ్యం పోయి ఇల్లు గుల్ల అయినా సరే పర్వాలేదు. ఎందుకు ఓడితిమి అన్న చర్చ మనసులో బాధను మాత్రం కలిగించదు. అంగడి వారు చచ్చు పుచ్చు వస్తువులను అంటగడితే ఎందుకిలా అని అడిగే సత్తా లేదు. అన్నింటికీ ఒకటే ఊరడింపు. ప్రారబ్దమిట్లుండగా ఒరులనను పనిలేదు అని త్యాగరాజ స్వామి వారు పాడి చెప్పారు. ఖర్మం ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అని సరిపెట్టుకోవడం మన పద్ధతి. అడిగితే తంతారేమోనన్న భయం కూడా ఓ మూలన కొంత లేకపోలేదు. అంతా కలిపితే తాత్పర్యం ఒకటే. అవసరం లేని వాళ్లు కూడా అన్యాయం చేయడానికి అడుగు ముందుకు వేస్తారు.
జంటనగరాల్లో ఆటో వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించిన వారందరికీ ఒక అనుభవం ఎదురయింది ఉంటుంది. నాకు రెండు చక్రాలు, నాలుగు చక్రాలు తెలియవు కనుక ఆటోల మీద ఆధారపడతాను. కొత్తగా వచ్చిన ఓలా, ఉబెర్‌లు కూడా అన్యాయంగానే ఉన్నాయని నా అభిప్రాయం. యక్షులు గంధర్వులు విమానాల్లో తిరిగి ఏదో శాపం కారణంగా భూలోకం మీదకు వచ్చిన జాతి వారు విమానాలను, రథాలను మరిచిపోలేక ఆటోలు నడుపుతున్నారని ఒక పెద్ద మనిషి నాకు విడమర్చి చెప్పారు. అది అక్షరాల నిజం అనిపిస్తుంది. వారు మీరు అడిగిన చోటికి వస్తానంటే గొప్ప అనుగ్రహం ప్రసాదించినట్టే లెక్క. ఈ మధ్యన అసలు ఆటో వాళ్లు అసలు నీ దగ్గర పైసలు ఉన్నాయా అన్నట్టు చూస్తున్నారని నాకు అనుమానంగా ఉంటుంది. ఆ రథంలో కూర్చున్న తర్వాత మొదలవుతుంది కథ. మీటరు మినిమం కిలోమీటర్ల దూరం కాకముందే పరుగుపెట్టడం మొదలవుతుంది. ఈ రహస్యం చాలామంది ఆటో ఎక్కే వాళ్లకు తెలియదు. నిత్యము ఎక్కే వాళ్లకు కూడా అంత ధ్యాస ఉండదు. ఉన్నా సరే ఎవరికి తెలుసు అనుకుని ఊరుకుంటారు. ఈ మధ్యన అసలు మీటర్ మీద నడిచే ఆటోలు లేకుండా అయినయి. పాత కాలంలో రిక్షాల వలె బేరాలు ఆడవలసి ఉంటుంది. ఎక్కడో సకృత్తుగా మీటర్‌తో వచ్చే ఆటో దొరికినప్పటికి చేరవలసిన చోటికి వెళ్లిన తరువాత అది ఒక భయంకరమైన అంకెను చూపిస్తుంది. మామూలుగా 60 కావలసిన చోటికి 66, 70 ఆపైన ఎంతైనా చూపిస్తుంది. ఎలక్ట్రానిక్ మీటర్లు రాక ముందు ఈ పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. డిజిటల్ మీటర్‌లలో ఈ బాధలేదు అన్నారు. కానీ చూస్తుండగానే వాటిని కూడా గోల్‌మాల్ చేసే పద్ధతులు మనవాళ్లు తెలుసుకున్నారు. అంకెలు చూచిన మీ అంతరాత్మ ఘోషించింది అనుకోండి. ఇక జరిగిన అన్యాయానికి తోడుగా అవమానం కూడా ఎదురై సిద్ధంగా నిలబడుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా ఆటో ఎక్కావా, అని అనిపించుకుంటే ఆశ్చర్యం లేనే లేదు. మంచితనం మీద నమ్మకం గల గంధర్వుడు అయితే, ఏం చేయమంటావు పెట్రోల్ బంక్ వాళ్లు. ఆటో సొంతదారుడు నన్ను మోసం చేస్తుంటే నేను నిన్ను ఎంచుకున్నాను మోసం చేయడానికి అంటాడు. నీవు వెళ్లి మరెవరినైనా వెతికి చేతనైనంత మోసం చెయ్యి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేస్తాడు. అది నాకు చేతకాదు అన్నారే అనుకోండి, అర్భకుడా అన్నట్టు నీ వైపు చూస్తాడు. బతుకు దారి గురించి విడమర్చి చెప్పిన యోగి లాంటి కటాక్ష వీక్షణం మన మీద పడవేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరి మనకు రక్షణగా తాత్వికత అనే రక్షణ కవచం ఉండనే ఉంటుంది. మళ్లీ నా ఖర్మ లాంటివి, గుర్తు తెచ్చుకోవాలి. తాత్వికతను, కొంచెం భయాన్ని మేళవించి అంతకన్నా ఫిలసాఫికల్ నవ్వు ముఖమంతా పూసుకుని జేబులో లేదా పర్సులో చేయి పెట్టక తప్పదు. గంధర్వులు పూర్తిగా రూపాయలే గానీ చిల్లర పుచ్చుకునే కాలం ఎప్పుడో గడిచిపోయింది.
ఈ మధ్యన చిల్లర అంటే ఐదు రూపాయలు కూడా లెక్కలోకి తీసుకుంటున్న పరిస్థితి. పది రూపాయలకు పూర్తి చేసి చెల్లింపులు జరపాలి. ఖర్మం కొద్దీ 5 రూపాయల నోట్లు, అంతకు చిన్న బిళ్లలు కనుక నీ వద్ద కనిపించాయంటే, గంధర్వుడు నిన్ను పురుగులాగా చూడడం మొదలు పెడతాడు. నేనే దొరికానా అని నేను ఒకరి చేత అనిపించుకున్నాను. ఇక మరీ పెద్ద నోట్లతో సమస్య మరొక రకంగా ఉంటుంది. గంధర్వుల వద్ద వందకు కూడా చిల్లర ఉండదు. ఉంటుంది అనుకుంటే అది మన మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఆ సంగతి మనం అర్థం చేసుకోవడానికి అక్కడ ఒక చిత్రమైన నాటకం జరుగుతుంది. మొత్తానికి కొంత అదనపు ఖర్చు, కొంత అన్యాయం, మరి కొంత జ్ఞానోదయంతో యాత్ర ముగుస్తుంది. తెలివితక్కువ కొద్దీ నోరు చేసుకోవడానికి పూనుకుంటే ఎదురుగా తిట్లు రావన్న గ్యారంటీ లేదు. పోలీసులకు మరొకరికో ఫిర్యాదు చేయాలనుకోవడం కన్నా తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. ప్రపంచంలో రక్షకులు అనుకున్న వారంతా దొంగలతో గట్లు పంచుకున్న వారే గానీ మామూలు మనిషి మాట వినే వారు కాదన్నది అనుభవం మీద తెలిసిన సత్యం. ఈ ఆటోల మీటర్లకు బాధ్యులైన ప్రభుత్వ శాఖ వారు జరుగుతున్న అన్యాయాలను అన్నింటిని హాయిగా నవ్వుతూ చూస్తున్నారు కానీ అందులో కలుగజేసుకునే ప్రయత్నం చేయడం లేదు అంటే ఎంతమంది నమ్ముతారు? నేను ఏకంగా హైదరాబాదు ఆటోలను గురించి ఇంటర్నెట్‌లో అదేదో డాట్‌కామ్‌లో పిటిషన్ మొదలుపెట్టాను. వారం అయింది. రెండు వారాలు అయినయి. కదలిక లేదు. నెట్ వాడుతున్న వారు ఎవరూ ఆటోలు వాడరేమో అన్న అనుమానం మొదలయింది. నోరు మూసుకుని ఉండిపోయాను. అంతా మోసం! అంతా అన్యాయం!! తిరువనంతపురంలో ఒక మిత్రుడు కనిపించిన ప్రతి ఆటో మీద కోర్ట్ కేసు వేసే అందరినీ తికమక పెట్టడం నాకు బాగా తెలుసు. చివరికి అతను కూడా బహుశా తన ప్రయత్నాలు మానుకొని ఉంటాడు. స్వయంగా లాయర్ కాబట్టి ఖర్చు లేకుండా కావల్సినన్ని కేసులు వేశాడు. కానీ ఒక మనిషి ఒక వర్గంతో, అందునా అధికారుల అండ గల వర్గంతో పోరాడ కలగడం అసాధ్యం కాదా?
ఆటోవాళ్లు అన్యాయం చేస్తున్నారు అన్న సంగతి మహా ఘనత వహించిన ప్రభుత్వం వారికి తెలియకుండా ఉండదు. ఇన్ని సమస్యలు ఉండగా ఇదొకటా అన్న ధోరణి తప్ప నిర్లక్ష్యానికి కారణం మరొకటి కాదు. మామూలు మనుషుల గోల ఎవరికీ పట్టదు. పట్టిన పక్షంలో సమస్యకు సమాధానం ఒక పూటలో దొరుకుతుందని నా నమ్మకం. ఈ వ్యాసం తుంపును సదరు సర్కారు వారికి ఎవరయినా అందిస్తే ఎంతో బాగుంటుంది. కార్డు ముక్కలను పిటిషన్‌లుగా తీసుకుంటారట. నా వ్యాసాన్ని కూడా అట్లాగే తీసుకుంటే మంచి జరుగుతుంది.
అన్యాయం గురించి గొంతు చించుకుని గోల చేయడం కన్నా అర్థం లేని పని మరొకటి లేదని అనుభవం మీద మనకు అందరికీ తెలుసు. పోలీసుస్టేషన్‌కు వెళ్లడం కంటే వ్యభిచార గృహానికి, లేదా కల్లు పాకకు వెళ్లడం గౌరవంగా ఉంటుంది అనుకునే పరిస్థితి మనది. ఒక ట్రాఫిక్ పోలీసాయనకు ఒకానొక సాయంత్రం మందే మాతరం సమయం గనుక నా మీద వల్లమాలిన కోపం వచ్చింది. మాయావిడ చిన్న పొరపాటు చేసింది. అతను అవమానకరంగా మాట్లాడసాగాడు. ఇద్దరమూ గౌరవంగా బతుకుతున్న వాళ్లమే. తప్పు ఒప్పుకుంటున్నాము అని ఏదో చెప్పబోయాను. అతనికి తిక్క రేగినట్టుంది. బూతులకు దిగాడు. జర్నలిస్టు సోదరులను పిలిచి గోల చేసి ఉండవచ్చు. కానీ అక్కడ పరిస్థితి శృతిమించి రాగాన పడుతున్నది. మందు ప్రభావంలో సోదరుడు మితిమీరుతున్నాడు. అసలు సంగతి, మేము మెడికల్ ఎమర్జెన్సీలోకి వెళ్తున్నాము. అడిగిన డబ్బు ఇచ్చి రసీదు లేకుండానే బయట పడినట్టు గుర్తు.
ఇక కోర్టుకు వెళ్లడంకన్నా కనకష్టమైన పని మరొకటి లేదు. న్యాయం కోసం న్యాయస్థానానికి వెళితే అక్కడ ఆ సరుకు దొరుకుతుందన్న నమ్మకం అసలు లేదు. అధవా దొరికిన ఆలోగా ఈ మనిషి మిగిలే అవకాశం ఉండదు. న్యాయం దొరికే లోపల దాని అవసరం తీరిపోతుంది. ఇంతకూ అన్యాయం చేసేందుకు వీళ్లు మాత్రమేనా అనేది అసలైన ప్రశ్న! అందరికంటే ముందు నాకు అనుభవంలో ఉన్న విషయం కనుక ఆటో వాళ్లు గుర్తుకు వచ్చారు. నేను ఈ వ్యాసం రాశాను అన్న సంగతి తెలిస్తే, వాళ్లంతా చేరి నాకు దేహశుద్ధి చేస్తారేమో? చేస్తే బాగుండును. టీవీ చానల్ వాళ్లందరినీ పిలిచి పెద్ద గోల సృష్టించి విషయానికి ప్రచారం కలిగించగల అవకాశం దొరుకుతుంది. అక్కడికి టీవీ వాళ్లు నేను ఎప్పుడు పిలుస్తానా అని ఎదురుచూస్తూ కూచున్నారని అనుకోవడం నా తెలివితక్కువతనం. వాళ్ల అన్యాయం పద్ధతులు వాళ్లకూ ఉంటాయి.



ఒకరు అన్యాయం చేయడానికి వంద మంది కారణం అవుతున్నారు. పెట్రోల్ వాళ్లు తక్కువ పోస్తారు. చూచే వాళ్లు తక్కువ తూస్తారు. ఈ సంగతి అనుభవం లేకుంటే కోఠికి వెళ్లి ఏవైనా పళ్లు కొని చూడండి. దిమ్మ తిరుగుతుంది. కిలో అని ఇచ్చిన పళ్లు ఇంటికి వస్తే ఆరు ఏడు వందల గ్రాములుగా మిగిలితే చాలు. కొలిచి ఇచ్చేవాళ్లు తక్కువ కొలిస్తే, కొలిచి తీసుకునే వాళ్లు ఎక్కువ కొలుస్తారు. జనాభా వాళ్లు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే మనుషుల సంఖ్య ఒకటి అయితే రేషన్ కార్డు వాళ్లకు చెప్పే సంఖ్య ఇంకొకటి. ఇప్పుడు ఆధార్ కార్డు అని ఒకటి తయారుచేసి మనుషుల ఫొటోలు కూడా తీసి చూస్తున్నారు కనుక కొంచెం పరిస్థితి మెరుగైందేమో ఏమో తెలియదు. పొద్దున హైదరాబాద్‌లో ఓటు వేసి సాయంత్రం లోగా ఏరు దాటి అక్కడ మళ్లీ ఓటు వేసిన వాళ్లు ఉన్నారని విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ రకంగా మనుషులు రెండు రెండు చోట్ల బతుకుతున్నారు. ఇటువంటి అన్యాయాన్ని భరించడం కష్టం కాదు అనుకుంటే పొరపాటే. అందరూ ఇదే పని చేస్తే కొన్ని లెక్కల ప్రకారం దేశ జనాభా రెండింతలు అవుతుంది. అందవలసిన తిండి నిజంగా అవసరమైన చోట అందనే అందదు.
సర్కారు వారు బడి లేదా ఆసుపత్రి కట్టిస్తారు. దానికి ఇంత ఖర్చయిందని ఒక లెక్క చూపుతారు. ఆ భవనాన్ని కట్టిన గుత్తేదారు పక్కనే బడికి ఆరంతలు ఉండే బంగ్లా కట్టుకుంటాడు. ఆ బంగ్లా కట్టడం ఎట్లా వీలయింది అన్న సంగతి మొత్తం ప్రపంచానికి తెలిసి ఉంటుంది. కానీ ఎవరూ గొంతు ఎత్తరు. మన పని కాదని అందరూ అనుకుంటారు. బంగ్లా కట్టడం మన పని కాదు. కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడం మన పని అంతకన్నా కాదు. అది ప్రజాధనం అన్న మాట ఎవరికీ గుర్తు రాదు. కరకరలాడే రూపాయి నోట్లు పోసిన చోట జరిగే అన్యాయాన్ని గురించి గొంతెత్తి ధైర్యం లేనివాళ్లు ఈ రకమైన ప్రజాధనం గురించి మాట్లాడవచ్చు అని అనుకోవడం కూడా ఉండదు. కొని తెచ్చిన గుడ్డ వారం రోజులలో పోయి తడిపిన ప్రతిసారికి జానెడు తక్కువ అయితే మరో దేశంలోనైతే ఆ గుడ్డ తయారుచేసిన ఫలానా కంపెనీ మీద నష్టపరిహారం దానికి తోడు మానసిక క్షోభ కలిగింది అంటూ దానికి కూడా వెలకట్టి పెద్ద ఎత్తున దావా వేస్తారు. కంపెనీ వారు కిక్కురుమనకుండా ఆ సమ్మెతో ఇచ్చి సరుకును దుకాణం నుంచి తొలగిస్తారు కూడా.
ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే. అడిగే దిక్కు లేకపోతే అది అలా పెరుగుతూనే ఉంటుంది మరి.